దార్శనికుడు.. ధర్మరక్షకుడు రామోజీరావు
నిత్య కృషీవలుడు, మేరునగ ధీరుడు, ధీరోదాత్తుడు, నాయకుడు, నిగర్వి, మానవతావాది, సంఘ సంస్కర్త, సత్య శోధకుడు.. ఇలా తెలుగు భాషలోని విశేషణాలన్నీ వాడినా రామోజీరావు వ్యక్తిత్వానికి, పరిపూర్ణ జీవితానికి పూర్తిగా అద్దం పట్టవు. రామోజీరావు ఒక మహోన్నత శక్తి.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు. చిత్రంలో బోయపాటి శ్రీను, బండ్ల గణేశ్
నిత్య కృషీవలుడు, మేరునగ ధీరుడు, ధీరోదాత్తుడు, నాయకుడు, నిగర్వి, మానవతావాది, సంఘ సంస్కర్త, సత్య శోధకుడు.. ఇలా తెలుగు భాషలోని విశేషణాలన్నీ వాడినా రామోజీరావు వ్యక్తిత్వానికి, పరిపూర్ణ జీవితానికి పూర్తిగా అద్దం పట్టవు. రామోజీరావు ఒక మహోన్నత శక్తి. ఐదున్నర దశాబ్దాలుగా ఆయన సృష్టించిన అద్భుతాలు తెలుగు వారి జీవితాల్లో విడదీయరాని భాగమయ్యాయి. ఆ అద్భుతాల్లోకెల్లా అద్భుతమైంది ఉదయాన్నే తలుపు తెరవగానే గడప దగ్గర పలకరించే ‘ఈనాడు’ దినపత్రిక. తెలుగు జాతికీ, భాషకూ ఈనాడు చేస్తున్న సేవకు వెలకట్టలేం. పత్రికను ప్రాణంగా భావించి, అక్షరమక్షరం సరిదిద్దుతూ, కొత్త ఒరవడికి, రెండో తరం వాడుక భాషా ఉద్యమానికి నాంది పలికారు రామోజీరావు. ఆనాడు రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా ఉన్న అధికార పార్టీ అణచివేతను ఖాతరు చేయకుండా అవినీతిని, అక్రమాలను ఎండగట్టారు. సామాన్యుడి ఆవేశానికి, ఆగ్రహానికి, ఆక్రోశానికి గొంతుకనిచ్చారు. తెలుగు జాతికి అధిష్ఠానాల వల్ల జరుగుతున్న అవమానాలను భరించలేక, బహిరంగంగానే ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించారు. నిర్మాణాత్మక పాత్రికేయ విలువలతో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికారు. ప్రజలకు, సమాజానికి న్యాయం చేయాలంటే న్యాయమూర్తే కానవసరం లేదని నిరూపించారు. ‘యథో ధర్మ.. తథో జయ’ అన్న సూత్రాన్ని నమ్మారు. తన కలం ద్వారా నిరంతరం న్యాయం, ధర్మం నిలబెట్టేందుకు పాటుపడ్డారు.
వేధింపులకు వెరవని నైజం
ఎదుటివాడు ఎంతటి శక్తిమంతుడైనా అన్యాయం అన్పిస్తే ఢీకొట్టేవారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంత వేధించినా వెనక్కి తగ్గలేదు. ఎలాంటి ప్రలోభాలకూ లొంగలేదు. రాజకీయ అధికారాన్ని ఆమడదూరంలో ఉంచారు. 2004 నుంచి 2010 వరకు, మళ్లీ ఇటీవల రెండేళ్లుగా రామోజీరావు ఎదుర్కొన్న వేధింపులు, మానసిక హింస, బహుశా మరే పత్రికా యజమాని చవిచూసి ఉండరు. అయినా ఆయన కలం కింద పడేయలేదు. అధికారంలో ఉన్నవారు ఎన్ని రాయబారాలు పంపినా రాజీ పడలేదు. బెదిరింపులకు లొంగలేదు. తప్పుడు కేసులు పెట్టి, గంటల తరబడి ప్రశ్నించి హింసించినా, నిస్సహాయంగా మంచంపై ఉన్న తన ఫొటోలను ప్రభుత్వం పైశాచిక ఆనందం కోసం ప్రసారం చేసినా, రామోజీరావు కుంగిపోలేదు. ఆయనకు తెలిసింది ఒక్కటే.. అది పోరాటం.
వారసత్వాన్ని నిలబెట్టేది తెలుగు జాతే
సగటు తెలుగువాడి నిజాయతీకి, నిర్భీతికి, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం రామోజీరావు. మిగతా ప్రపంచం కంటే ఎప్పుడూ నాలుగడుగులు ముందే నడచిన దార్శనికుడు, నిత్య పరిశోధకుడాయన. తెలుగు సంస్కృతిని, కళారూపాలను కంటికి రెప్పలా కాపాడారు, ప్రోత్సహించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి, ప్రపంచంలో ఏ మూలనైనా తెల్లవారుజామున జరిగిన సంఘటనను సైతం అచ్చులో మన గడప దగ్గరకు చేర్చి పాత్రికేయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు.. మూలాలను మరవలేదు. రైతుల అభ్యున్నతికి, వారికి ఆధునిక సాగు రీతులు నేర్పడానికి పత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా వెలకట్టలేని కృషి చేశారు. ఎందరికో ఉపాధి కల్పించారు. నా తొలి ఉద్యోగం కూడా రామోజీరావు చలవే. ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్న వారు నేడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లోనూ రాణిస్తున్నట్టే, రామోజీరావు స్థాపించిన ఈనాడులో పాత్రికేయం నేర్చినవారు అన్ని మీడియా సంస్థల్లోనూ రాణిస్తున్నారు. దార్శనికులకు మాత్రమే ఇది సాధ్యం. ప్రజలు అన్యాయాన్ని, అరాచకాన్ని సహించరని, పాతర వేస్తారని రామోజీరావుకు గట్టి నమ్మకం. ఈ నెల నాలుగో తేదీన, ప్రజలు తన నమ్మకాన్ని వమ్ము చేయలేదని నిర్ధారించుకున్నాకే ప్రశాంతంగా నిష్క్రమించారు. వారికి నా శ్రద్ధాంజలి! కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు నా సానుభూతి! రామోజీరావు ఘనమైన వారసత్వాన్ని తెలుగు సమాజం కాపాడుకుంటుందని నా ప్రగాఢ విశ్వాసం!
జస్టిస్ ఎన్.వి.రమణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ