మనమెరిగిన మార్గదర్శి
ఆలోచనల్లో నూతనత్వం... ఆచరణలో విరామమెరుగని తత్వం... విలువలతో కూడిన వ్యాపార విధానం... ప్రతిక్షణం సమాజం కోసం ఆలోచించే నైజం... జనతను జాగృతం చేసే సంకల్పం... స్ఫూర్తిదాయక చైతన్యప్రస్థానం...
ఆయన వ్యక్తి కాదు.. వ్యవస్థ
తెలుగువారి గుండెచప్పుడు
రామోజీరావు పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి
ఆలోచనల్లో నూతనత్వం... ఆచరణలో విరామమెరుగని తత్వం... విలువలతో కూడిన వ్యాపార విధానం... ప్రతిక్షణం సమాజం కోసం ఆలోచించే నైజం... జనతను జాగృతం చేసే సంకల్పం... స్ఫూర్తిదాయక చైతన్యప్రస్థానం...
..వీటన్నింటి సమాహారం రామోజీరావు జీవితం. ఓ సాధారణ కుటుంబంలో జన్మించి, ఇష్టంగా కష్టపడి, ఒక్కో మెట్టూ పైకి ఎదుగుతూ, తనతోపాటు మరెంతోమందికి చేయూతనిస్తూ, నలుగురికీ ప్రేరణగా నిలుస్తూ వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిన ఆయన జీవితం భావితరాలు గుర్తుంచుకుని ఆచరించాల్సిన వెలుగుల పాఠం.
విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధముత్తమ జనాః న పరిత్యజన్తి?
భర్తృహరి చెప్పినట్లు ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవరోధాలు ఎదురైనా చలించకుండా చేపట్టిన కార్యాన్ని పూర్తిచేసేవరకూ ధీరోదాత్తులు విశ్రమించరు. వారినే ఉత్తములుగా భర్తృహరి అభివర్ణించారు. అలాంటి కార్యసాధకుల్లో నాకు ముందుగా గుర్తొచ్చే పేరు, నేను ఎంతోమందికి ఆదర్శంగా చూపించే వ్యక్తి రామోజీరావు. ఈనాడు దినపత్రిక నుంచి ఈటీవీ జాతీయ నెట్వర్క్ వరకూ, ప్రియా పచ్చళ్ల నుంచి ప్రపంచప్రఖ్యాతి గాంచిన రామోజీ ఫిల్మ్సిటీ వరకూ ప్రతిదీ ఆయన సరికొత్త ఆలోచనా సరళికి ఉదాహరణలే.
రామోజీరావు జీవితం ఓ సాధారణ ఉద్యోగిగా ప్రారంభమైంది. ఆయన ఆలోచనా విధానం ప్రత్యేకమైనది. నా పట్ల ఎంతో అభిమానాన్ని, గౌరవాన్ని చూపించే ఆయన అనేక సందర్భాల్లో అనేక విషయాల గురించి నాతో చర్చించేవారు. ఆ సమయంలో చిన్న చిన్న విషయాల గురించి కూడా సూక్ష్మంగా ఆలోచించే ఆయన శైలిని గమనించాను. అప్పట్లో చాలామంది, మాట వరసకు రామోజీరావు పట్టిందల్లా బంగారమేనండీ అని నాతో అనేవారు. అయితే పట్టుకున్నది బంగారం చేసే దిశగా ఆయన పట్టుదల, చేసే కృషి, పడే శ్రమ గురించి తెలుసుకుని ఆచరణలో పెట్టాలని నేను సూచించేవాడిని. సమయపాలన, క్రమశిక్షణ అనేవి ఆయన వ్యక్తిగత జీవితానికే కాదు, వారు చేసిన వ్యాపారాలకూ విజయాలను అందించాయి.
నిత్యం ఉషోదయంతో...
సమయపాలన అనగానే ముందుగా నాకు ఈనాడే గుర్తుకొస్తుంది. ‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించు గాక’ అంటూ పత్రికారంగంలో ఈనాడుతో ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆ రోజుల్లో ఆంధ్ర అనే పేరు లేని పత్రికలు ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో ‘ఈనాడు’ అనే పేరు ఓ నూతనత్వానికి నాంది పలికింది. ఈ రోజు, ఈ ప్రాంతం అనే రెండు అర్థాలు వచ్చేలా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా జర్నలిజం స్కూలును స్థాపించి, ఉద్దండులైన పాత్రికేయులను తెలుగు నేలకు అందించిన ఘనత ఈనాడుకు దక్కుతుంది. వార్తల్లో, సంపాదకీయాల్లో ఈనాడు భాషా ప్రామాణికత కొత్త బాటలు వేసింది. ఘనమైన చరిత్ర ఉన్న తెలుగుభాష పట్ల ఎనలేని మమకారం ఆయన సొంతం. భాష విషయంలో చిన్న పొరపాటు జరిగినా, అది తనవల్ల అయినా సరే తట్టుకోలేని మనస్తత్వం ఆయనది. అమ్మ భాష పట్ల అంత ప్రేమ ఉండటం వల్లే తమ మీడియా విషయంలో నిరుపమానమైన నిబద్ధతను చూపారు. నాణ్యతకు పెద్దపీట వేశారు.
విలువలతో కూడిన వ్యాపారం
వ్యాపారం అంటే కొనడం, అమ్మడం కాదు, నమ్మకం. ఈ విషయాన్ని త్రికరణశుద్ధిగా నమ్మి అడుగుపెట్టిన అనేక వ్యాపారాల్లో తనదైన ముద్ర వేశారు రామోజీరావు. హోటళ్లు, ఎరువులు, మార్గదర్శి, ఇమేజెస్ ప్రకటనలు, సినిమాలు, కళాంజలి వస్త్రాలు... ఇలా ఏ రంగంలో అడుగుపెట్టినా నూతనత్వంతో కూడిన ఆలోచనలతో పాటు, విలువలకు పెద్దపీట వేయడమే ఆయన విజయరహస్యం. కళాత్మక వ్యాపారమైన సినిమా సమాజాన్ని ప్రభావితం చేయగల మాధ్యమం అని రామోజీరావు బలంగా విశ్వసించారు. ఓ చిన్న వార్త ఆధారంగా నిర్మించిన మౌనపోరాటం, కాలు దూరమైనా నాట్యానికి దగ్గరైన సుధాచంద్రన్ జీవితం ఆధారంగా నిర్మించిన మయూరి, నాటి సమాజాన్ని అద్దంలో చూపించిన ప్రతిఘటన, ఓ విజేత నిజజీవితం ఆధారంగా నిర్మించిన అశ్వని, యువతరం ఆలోచనలను ప్రతిబింబించిన నువ్వే కావాలి... ఇలా ఎన్నో సినిమాలు సంచనాలు సృష్టించాయి. సమాజంలో ఓ సానుకూల మార్పునకు బీజం వేశాయి.
రామోజీరావు సంస్థలు వ్యాపారానికి పరిమితం కాలేదు. సమాజానికి మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సహాయం చేయడం, దేశవ్యాప్తంగా అనేకచోట్ల కాలనీల నిర్మాణం, అనేక పాఠశాల భవనాల నిర్మాణం, చేతివృత్తుల వారికి పనిముట్ల వితరణ... ఇలా సేవారంగంలోనూ రామోజీ సంస్థలు తమదైన ముద్రను వేశాయి.
యథా మృత్పిణ్డతః కర్తా కురుతే యద్యదిచ్ఛతి
ఏవమాత్మకృతం కర్మ మానవః ప్రతిపద్యతే
మట్టిముద్ద నుంచి కులాలుడు (కుండల తయారీ కళాకారుడు) తన ఆలోచనలకు అనుగుణంగా కోరిన వస్తువులను తయారు చేస్తున్నట్లే.. మానవుడు తన మనసుకు నచ్చినవిధంగా, తన ఆలోచనలకు అనుగుణంగా, ప్రయత్నాను రూపంగా కర్మలను ఆచరించి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాడు. అదే మార్గంలో దిల్లీలో ఒక చిన్న ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, యువతకు ఆదర్శంగా ఎదిగిన రామోజీరావు జీవితం నుంచి భావితరాలు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. పనిలోనే విశ్రాంతిని వెతుక్కునే ఆయన తత్వం విజయాలకు దగ్గర చేస్తుంది. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆచరణలో చూపించిన నూతనత్వం కొత్త బాటను పరిచయం చేస్తుంది. రామోజీరావు అంటే తెలుగువారి గుండెచప్పుడు. ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక తరాలను ప్రభావితం చేశారు. భవిష్యత్తు తరాలనూ ప్రభావితం చేస్తూనే ఉంటారు. భారతదేశ పత్రిక, సినిమా రంగాల్లో ఆయన కీర్తి అజరామరం, ఆచంద్రతారార్కం.
తెలుగుకు పట్టం
తెలుగు భాష అంటే రామోజీరావుకు ఉన్న మమకారం ఆయన వ్యాపారాలన్నింటిలో కనిపిస్తుంది. ఆయా సంస్థలకు పెట్టే పేర్లు కావచ్చు, ప్రజలకు చేరువ చేసే తీరు కావచ్చు. అడుగడుగునా తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈనాడు, ఈటీవీలో తెలుగు భాష, సంస్కృతుల ఉన్నతికి ఆయన శ్రమించిన తీరు తెలుగు వారెవరూ మరువలేరు. పాడుతా తీయగా లాంటి కార్యక్రమం ద్వారా తెలుగునాట సంగీత విప్లవాన్ని సృష్టించారు. స్వరాభిషేకం వంటి కార్యక్రమాలు తెలుగు పాటకు ఈటీవీ ఇచ్చిన అఖండహారతి. ఆయన స్థాపించిన తెలుగువెలుగు మాసపత్రిక భాషా ఉద్యమంలో ఓ ముందడుగు. తరాల మధ్య అక్షరాల వారధి నిర్మించటంలో తెలుగు వెలుగు విజయం సాధించింది.
ఉద్యమస్ఫూర్తి
సారా ఉద్యమం, సమాచార హక్కు చట్టం... ఇలా ఈనాడు ఏ ఉద్యమాన్ని తలకెత్తుకున్నా సంచలనమే. ఎన్టీఆర్ను పదవీచ్యుతుల్ని చేయాలన్న తలంపుతో కుట్ర జరిగినప్పుడు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఈనాడు తనవంతు పాత్ర పోషించింది. ఆరోజు పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ తరఫున నిలబడి పోరాడినవారిలో నేనూ ఉన్నాను. ప్రాంతీయవార్తలను ప్రజలకు అందించాలన్న తలంపుతో జిల్లా ఎడిషన్ల దిశగా ఈనాడు వేసిన అడుగును ప్రజలు ఎంతగానో ఆదరించారు. రామోజీరావు సంపాదకత్వంలో వార్త అంటే సంచలనం కాదు, సమగ్ర సమాచారం. అదే దృక్పథంలో పనిచేసిన ఈనాడు, విలువలతో కూడిన పాత్రికేయానికి చిరునామాగా నిలిచింది.
(రామోజీరావుకు నివాళులర్పిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి ప్రత్యేక వ్యాసం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
ఎస్టీగా నా హక్కులు హరించారు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
-
భారత్కు అండగా ఉందాం.. పాక్కు సాయం నిషేధిద్దాం: అమెరికా కాంగ్రెస్లో బిల్లు
-
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
-
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన