ఈ నెల 13న పాఠశాలల పునఃప్రారంభం

ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల 13న పాఠశాలల్ని పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 10 Jun 2024 04:53 IST

ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ నిర్ణయం 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నెల 13న పాఠశాలల్ని పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12వ తేదీనే పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉండగా.. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు సంఘాలు కోరాయి. దీంతో తేదీని పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని