సంక్షిప్త వార్తలు (9)
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు సంచలనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నారాయణ సంచలనం
ఈనాడు, అమరావతి: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు సంచలనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో సందేశ్ భోగాలపల్లి 3వ ర్యాంకు, రాజ్దీప్ మిశ్రా 6, ఎం.బాలాదిత్య 11, రాఘవ్ శర్మ 12, బిస్మిత్ సాహు 16, ఆర్యన్ ప్రకాశ్ 17, అమోఘ్ అగర్వాల్ 20వ ర్యాంకులు సాధించారన్నారు. వీరితో పాటు 100లోపు 31 ర్యాంకులతో రికార్డు సృష్టించామన్నారు. వివిధ కేటగిరీలలో 6 ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు నారాయణవేనని వెల్లడించారు. విద్యార్థులకు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ కొత్తప అభినందనలు తెలిపారు.
ఫలితాల్లో శ్రీచైతన్య సత్తా
జేఈఈ అడ్వాన్స్డ్-2024 ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య యాజమాన్యం తెలిపింది. రాఘవశర్మ ఆలిండియా మొదటి ర్యాంకు, ఓపెన్ కేటగిరీలో రిథమ్ కేడియా 4వ ర్యాంకు, పుట్టి కుశాల్ కుమార్ 5, రాజదీప్ మిశ్రా 6, ధృవిన్ హేమంత్ దోషి 9, అల్లడబోయిన ఎస్ఎస్డీబీ సిద్ధ్విక్ సుహాస్ 10వ ర్యాంకులను సాధించినట్లు వెల్లడించింది. వీటితో పాటు ఓపెన్ కేటగిరీలో టాప్ 10 లోపు 5 ర్యాంకులు, 100 లోపు 30 ర్యాంకులు, 1000 లోపు 202 ర్యాంకులు, వివిధ కేటగిరీల్లో 100 లోపు 146, 1000 లోపు 721 ర్యాంకులు వచ్చాయని చెప్పింది. మొత్తంగా 3,728 మంది విద్యార్థులు అర్హత సాధించారని పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ అభినందించారు.
ఎస్ఆర్ విద్యార్థుల విజయకేతనం
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఎస్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది. అన్ని కేటగిరీలో కలిపి జి.నవీన్ 8వ ర్యాంకు, పి.రాకేశ్ కుమార్ 36, జె.స్నేహిత్ సందేశ్ 123, వి.రాంబాబు 125వ ర్యాంకులను సాధించారని వెల్లడించింది. వీటితో పాటు అన్ని కేటగిరీల్లో కలిపి వరుసగా 8, 36, 123, 125, 127, 133, 157, 185, 299, 323, 324, 450, 598, 621, 654, 689, 737, 751, 901, 966 వంటి మరెన్నో ర్యాంకులు సాధించిందని పేర్కొంది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి అభినందించారు.
శశి వైజాగ్ విజయభేరి
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయభేరి మోగించామని శశి విద్యాసంస్థల యాజమాన్యం వెల్లడించింది. ఆలిండియా స్థాయిలో టీఎస్ఎల్ సంజన 17వ ర్యాంకు, జి.జైదీప్ 223వ ర్యాంకు సాధించారని తెలిపింది. 13 మంది 2000లోపు ర్యాంకులు, 20 మంది 3000లోపు ర్యాంకులు సాధించారని పేర్కొంది. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను శశి విద్యాసంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ ఛైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, అకడమిక్ డైరెక్టర్ మేకా క్రాంతి సుధ అభినందించారు.
చరిత్ర సృష్టించిన శశి వేలివెన్ను
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు చరిత్ర సృష్టించారని శశి విద్యాసంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ తెలిపారు. పి.సత్యసాయి పవన్ రానా ఆలిండియా 13వ ర్యాంకు, బి.గరిమ 73, కె.సృజన్ 97వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. 10 మంది విద్యార్థులు 500లోపు, 20 మంది విద్యార్థులు 1000లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. విద్యార్థులను శశి విద్యాసంస్థల వైస్ ఛైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీ సుప్రియ అభినందించారు.
తిరుమల విద్యార్థుల ప్రభంజనం
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తిరుమల ఐఐటీ, మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు వెల్లడించారు. వివిధ కేటగిరీలలో జి.ఎన్.వెంకట దుర్గ సాయి 53వ ర్యాంకు, కె.శరణ్ తేజ అనురూప్ రెడ్డి 62, కె.సాకేత్ ప్రణవ్ 92, హర్ష నాగ వర్ధన్ 95వ ర్యాంకు సాధించారన్నారు. 74 మంది విద్యార్థులు 1000లోపు ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు.
భాష్యం విద్యార్థుల సత్తా
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ తెలిపారు. ఓపెన్ కేటగిరీల్లో సాయియశ్వంత్రెడ్డి ఆలిండియా 50వ ర్యాంకు, ఎం.జిష్ణుసాయి 62వ ర్యాంకు సాధించారన్నారు. వీటితో పాటు వివిధ కేటగిరీల్లో ఎం.సాయియశ్వంత్రెడ్డి 5, పి.గౌతమి 19, కె.శ్రేయ 23, కె.జాషువా వివేక్ 26, జి.జాన్ 36, ఎం.అర్జున్కుమార్ 37, కె.హర్షిత 43, కె.చైతన్య 52, పి.శ్యామ్ 61, డి.భరత్చంద్ర 86వ ర్యాంకు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆలిండియా 50, 62 ర్యాంకులు సాధించిన ఎం.సాయియశ్వంత్రెడ్డి, ఎం.జిష్ణుసాయిలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెక్కులను భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ అందజేశారు. డైరెక్టర్ హనుమంతరావుతో కలిసి విద్యార్థులను అభినందించారు.
డా.కె.కె.ఆర్ గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ప్రతిభ
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో డా.కె.కె.ఆర్ గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థులు ప్రతిభ చూపారని ఆ స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఓపెన్ కేటగిరీల్లో పుట్టి కుషల్ కుమార్ ఆలిండియా 5వ ర్యాంకు, సతివాడ జ్యోతిరాధిత్య 55వ ర్యాంకు సాధించారని పేర్కొంది. వీటితో పాటు 100 లోపు వివిధ కేటగిరీల్లో 3, 5, 9, 12, 17, 26, 28, 45, 55, 55, 64, 88 వంటి ర్యాంకులు 12 వచ్చాయని చెప్పింది. విద్యార్థులను స్కూల్ యాజమాన్యం అభినందించింది.
ఫిట్జీ విద్యార్థుల ప్రభంజనం
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ సంస్థ విద్యార్థులు ప్రతిభ చూపారని ఫిట్జీ డైరెక్టర్ పిన్నెపు రమేష్ బాబు తెలిపారు. ఓపెన్ కేటగిరీల్లో కోడూరు తేజేశ్వర్ ఆలిండియా 8వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. అలాగే ఈ ఫలితాల్లో దాదాపు 300 మందికి పైగా తమ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని చెప్పారు. జేఈఈ మెయిన్స్లోనూ తమ విద్యార్థులు 100 శాతం విజయం సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఫిట్జీ డైరెక్టర్ పిన్నెపు రమేష్ బాబు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి