యుద్ధ ప్రాతిపదికన అమరావతి నిర్మాణ పనులు
అమరావతిలో సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సీఆర్డీఏ అధికారులతో కలిసి రాజధానిలో దాదాపు రెండు గంటల పాటు పర్యటించారు.
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అనంతరం దృష్టి
నిలిచిన నిర్మాణాల పటిష్ఠతపై నిపుణుల నుంచి నివేదిక
రాజధానిలో సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ సుడిగాలి పర్యటన
ఉద్దండరాయనిపాలెంలో అమరావతి శంకుస్థాపన ప్రాంత పరిశీలనకు వచ్చిన సీఎస్ నీరభ్కుమార్ ప్రసాద్తో మాట్లాడుతున్న అమరావతి రైతులు
ఈనాడు-అమరావతి, తుళ్లూరు-న్యూస్టుడే: అమరావతిలో సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదివారం సుడిగాలి పర్యటన చేపట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన సీఆర్డీఏ అధికారులతో కలిసి రాజధానిలో దాదాపు రెండు గంటల పాటు పర్యటించారు. ఆగిపోయిన భవన సదుపాయాలు, కట్టడాలను పరిశీలించారు. కరకట్ట రోడ్డు నుంచి మొదలుపెట్టి సీడ్యాక్సెస్ రహదారిపై ఉన్న సెంట్రల్ లైటింగ్ను పరిశీలించారు. విద్యుద్దీపాల పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ రాజధానికి భూమిపూజ జరిగిన ప్రాంతం, శంకుస్థాపన శిలాఫలకాలు, పవిత్ర మట్టి, నీరు, అమరావతి నమూనాలు ఉంచిన గ్యాలరీలను పరిశీలించారు. అనంతరం సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించారు. విజయవాడలోని సీఆర్డీఏ కీలక విభాగాలను ప్రాజెక్టు కార్యాలయంలోకి తరలించాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిలభారత సర్వీసు ఉద్యోగుల భవన సముదాయాలు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శుల బంగ్లాలు, శాశ్వత సచివాలయం, శాసనసభ, హైకోర్టు, ఎన్జీవో, నాలుగో తరగతి ఉద్యోగుల భవన సముదాయాలు, హ్యపీనెస్ట్ ప్రాజెక్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కట్టడాల పరిస్థితి గురించి సీఆర్డీఏ అధికారులను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సీఎస్తో పాటు సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్, అదనపు కమిషనర్ సింహాచలం, సీఈలు ధనుంజయ్, ఎన్వీఆర్కే ప్రసాద్, పల్లంరాజు, ఇతర విభాగ అధికారులు పాల్గొన్నారు.
ఎన్జీఓల క్వార్టర్లు పరిశీలిస్తున్న నీరభ్కుమార్
కమిషనర్ తీరుపై సీఎస్కు రైతుల ఫిర్యాదు
సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ వ్యవహారశైలిపై రాజధాని రైతులు, మహిళలు సీఎస్కు ఫిర్యాదుచేశారు. రెండేళ్లుగా కమిషనర్ అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్షిక కౌలు, ప్లాట్ల అభివృద్ధిపై తాము విజయవాడలోని ఆయనను కలిసి విన్నవించేందుకు ప్రయత్నించినా సరిగా స్పందించలేదన్నారు. అనేకసార్లు కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత వార్షిక కౌలును త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు సీఎస్ హామీ ఇచ్చారు.
రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన స్థలంలో నమస్కరిస్తున్న సీఎస్
దశలవారీగా రాజధాని పనులు
చంద్రబాబు ఆదేశాలను అనుసరించి అమరావతి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభిస్తున్నాం. తొలిదశలో పిచ్చిమొక్కలను శుభ్రం చేసే పనులను చేపట్టాం. 94 పొక్లెయిన్లతో 25 ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నాం. తదుపరి దశలో ప్రతి పనినీ సమీక్షించి, ప్రమాణస్వీకారం ముగిశాక వాటిని మొదలుపెడతాం. రాజధానిలో జరిగిన చోరీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మంత్రివర్గంతో చర్చించాక రాజధాని రైతులకు వార్షికకౌలు చెల్లిస్తాం. ఆర్5 జోన్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున నేను మాట్లాడలేను. ఐదేళ్లుగా నిర్మాణాలు నిలిచిపోవడంతో, వాటి పటిష్ఠతపై ఇంజినీరింగ్ నిపుణుల నుంచి నివేదికలు తీసుకుంటాం. పటిష్ఠతపై అవగాహన లేకుండా పనులు ప్రారంభించలేం.
నీరభ్కుమార్ ప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
పోలవరం పనులపై నివేదిక రూపకల్పన
పోలవరం, న్యూస్టుడే: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబునాయుడు ఏ క్షణంలోనైనా పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చే అవకాశం ఉండటంతో జలవనరులశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత అయిదేళ్ల వైకాపా పాలనలో జరిగిన పనులకు సంబంధించి నివేదికల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడం, గైడ్ బండ్ కుంగడం, ఎగువ కాఫర్డ్యాం సీపేజ్కు సంబంధించిన కారణాలను నివేదికలో పొందుపరుస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు హిల్వ్యూపై హెలీప్యాడ్ పరిసరాలు, వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!