Annavaram: వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం

కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు.

Published : 20 May 2024 04:12 IST

అన్నవరం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణవేదికపై స్వామి, అమ్మవార్లను, ఆ పక్కనే పెళ్లిపెద్దలు సీతారాముల వారిని ఆసీనులను చేసి కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ కమిషనర్‌ సత్యనారాయణ.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలమంది భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు