Andhra news: బలహీనంగా కరకట్టలు.. భయం భయంగా బతుకులు!
మరో నెల రోజుల్లో గోదావరికి మళ్లీ వరద రోజులు ప్రారంభం కానున్నాయి. జులై నుంచి అక్టోబరు వరకు నదిలో ప్రవాహం ఎక్కువగా ఉంటుంది.
వరద రోజుల్లో గోదారి తీరాన కష్టాలు తప్పవా
37 చోట్ల దెబ్బతిన్న కరకట్టలు
మూడేళ్లుగా ఒక్క పైసా ఇవ్వని సర్కారు
నిపుణుల నివేదికలు బుట్టదాఖలు
ఈనాడు - అమరావతి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కె.గంగవరం మండలం సుందరపల్లి గ్రామంవద్ద ప్రమాదకరంగా ఉన్న గోదావరి ఎడమ గట్టు
మరో నెల రోజుల్లో గోదావరికి మళ్లీ వరద రోజులు ప్రారంభం కానున్నాయి. జులై నుంచి అక్టోబరు వరకు నదిలో ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. జూన్లోనే భారీ వరదలు వచ్చిన అనుభవాలూ ఉన్నాయి. ఈ రోజుల్లో వందల కిలోమీటర్ల మేర గోదావరి తీర ప్రాంతం ఉన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో అనేక పల్లెలు బితుకు బితుకుమంటూ ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. నదీ తీర ప్రాంతం పొడవునా చాలాచోట్ల కరకట్టలు బలహీనమయ్యాయి. డ్రెయిన్లు గోదావరిలో కలిసే చోట్ల వరద సమయంలో ప్రవాహాలు వెనక్కు తన్ని.. ఊళ్లకు ఊళ్లే ముంపులో చిక్కుకుంటున్నాయి. దీంతో వేలమంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి జలవనరుల శాఖ నియమించిన నిపుణుల బృందం కరకట్టల పొడవునా.. అన్ని ప్రాంతాలూ సందర్శించి సమగ్ర నివేదిక సిద్ధం చేసింది. ఎక్కడెక్కడ కరకట్టలు బలహీనంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ తర్వాత సర్కారులో ఈ నివేదికను పట్టించుకున్న నాథుడు లేరు. కరకట్టలు పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలూ లేవు. ఆ నివేదికలన్నీ గోదావరికి అర్పించినట్లయింది. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిగా ఉన్న నది.. ఆ తర్వాత అనేక పాయలుగా చీలిపోయింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దిగువన అఖండ గోదావరి గౌతమి, వశిష్ట పాయలుగా చీలింది. గౌతమి మళ్లీ గౌతమి, వృద్ధగౌతమి, కోరంగి పాయలుగా విడిపోయింది. వశిష్ట రెండు పాయలుగా.. వశిష్ట, వైనతేయలు పాయలుగా సముద్రంలో కలుస్తోంది. అఖండ గోదావరికి 83.73 కిలోమీటర్లు, గౌతమికి 204.70 కి.మీ., వశిష్టకు 246.30 కి.మీ. మేర గట్లు ఉంటాయి. వీటికి సంబంధించి దాదాపు 37 చోట్ల అత్యంత బలహీనంగా, ప్రమాదకరంగా కరకట్టలు ఉన్నాయని జలవనరుల శాఖ నిపుణుల కమిటీ నివేదించింది. 2020, 2022, 2023లలో గోదావరి పెద్ద వరదలను ఎదుర్కొంది. కట్టలు బలహీనంగా ఉండటంతో ఈ మూడు సందర్భాల్లోనూ ప్రజలు భయాందోళనలు చెందారు. అధికారులు ఆ కరకట్టలను రక్షించేందుకు తాత్కాలిక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు పడ్డారు. అప్పట్లోనే అక్కడ పనిచేసిన చీఫ్ ఇంజినీరు కరకట్టల పటిష్ఠానికి తీసుకోవాల్సిన చర్యలపై ఓ నిపుణుల కమిటీని నియమించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దాని ఫలితంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విశ్రాంత ఇంజినీరింగు నిపుణులు, గోదావరి డెల్టా చీఫ్ ఇంజినీరు, ఆకృతుల సంస్థ చీఫ్ ఇంజినీరు బృందంగా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీయే వెంటనే కరకట్టలు పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని సమగ్ర నివేదిక అందించింది. కరకట్టలను ఆనుకొని గోదావరిలో ఇసుక తవ్వకాలు భారీగా చేపట్టడం వల్ల కూడా గట్టు దెబ్బతింటోందని పేర్కొంది. గతంలో పనులు చేసిన చోట కూడా కరకట్టలు బలహీనమవుతున్నట్లు గుర్తించారు. గ్రోయిన్ల నిర్మాణ శైలిని మార్చుకోవాలని సూచించడంతో పాటు పుదుచ్చేరి ప్రభుత్వ పరిధి యానాం పరిసర ప్రాంతాల్లో గోదావరి కరకట్టల పటిష్ఠానికి తీసుకున్న చర్యల తరహాలోనే నిర్మాణాలూ ఉండాలని సిఫార్సు చేశారు.
86 వరద స్థాయికి తగ్గట్టుగా పనులు ఏవీ?
1986లో గోదావరికి అతి భారీ వరద వచ్చింది. చరిత్రలో ఇదే అత్యంత భారీ వరదగా రికార్డయింది. నాడు 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం పోటెత్తడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో ఊరూ, ఏరూ ఏకమైనట్లుగా పరిస్థితి మారింది. అంతకుముంద]ు 15 లక్షల క్యూసెక్కుల వరదకు తగ్గట్టుగా గోదావరి గట్లు ఉండేవి. 1953లో 30,03,100 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా.. 14 చోట్ల నదికి గండ్లు పడి కోనసీమ ప్రాంతం ధ్వంసమైంది. ఆ తర్వాత అదే ప్రమాణ స్థాయిగా కరకట్టల ఎత్తు పెంచారు. 1986 తర్వాత అప్పటి వరదను ప్రమాణస్థాయిగా తీసుకొని గట్లు ఎత్తు పెంచారు. అయితే ఇప్పటికీ 56 కిలోమీటర్ల మేర ఆ స్థాయి ఎత్తులో కరకట్టల నిర్మాణం పూర్తి కాలేదు. దీనికి తోడు గట్లు చాలాచోట్ల బలహీనపడ్డాయి. అప్పట్లో చీఫ్ ఇంజినీరు రూ.150 కోట్లతో ప్రతిపాదనలు పంపినా, ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. గడిచిన మూడేళ్లలో ఒక్క పైసా కూడా గోదావరి కరకట్టల పటిష్ఠానికి ఖర్చు చేయలేదని సర్కారు లెక్కలే చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.