Andhra news: బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది.
తుపానుగా మారితే ‘రెమాల్’గా నామకరణం
రాష్ట్రంపై ప్రభావం తక్కువే
నేడు, రేపు తేలికపాటి వర్షాలు..
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, శనివారం సాయంత్రానికి తుపానుగా బలపడి ఈశాన్య, వాయవ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశముందని తెలిపింది. వాయుగుండం తుపానుగా బలపడితే దీనికి ఒమన్ సూచించిన ‘రెమాల్’ అనే పేరును పెట్టనున్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల విస్తరణ ఈ అల్పపీడనంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తరాంధ్రకు విస్తరించని ‘నైరుతి’
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల గమనం మందగించింది. మూడు రోజులు ముందుగా ఈ నెల 2న రాష్ట్రంలోకి ‘నైరుతి’ ప్రవేశించింది. తర్వాత వేగంగా ముందుకు కదిలేందుకు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహా వర్షాలు ఆశాజనకంగా లేవు. -
కంట్లో కొయ్య దిగినా.. తిరిగొచ్చిన చూపు
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కన్ను అత్యంత సున్నితమైన అవయవం. చిన్న నలుసు పడినా మనం అల్లాడిపోతాం. అలాంటిది ఏకంగా కంట్లో కొయ్య దిగిన వ్యక్తికి మళ్లీ చూపు వస్తుందని ఊహించగలమా? కానీ విశాఖ కేజీహెచ్ వైద్యులు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. -
లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు
ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సభ్యులకు శుక్రవారం శాఖలు కేటాయించారు. మిత్రపక్షాలైన జనసేన, భాజపాలకు కీలక శాఖలు కట్టబెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారు. -
అన్నక్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల ప్రణాళిక
అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. శనివారం నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. -
పేద పిల్లల ఫీజుల్ని మళ్లించేశారు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఐదేళ్లు వైకాపాతో అంటకాగి.. పేదల పిల్లల ఫీజులను భారీగా దారి మళ్లించారు. ఓట్ల లెక్కింపు రోజున వైకాపా ఓడిపోతుందని తెలుసుకుని వెంటనే కీలకమైన దస్త్రాలను మాయం చేశారు. కొన్నింటిని మెషీన్లో వేసి, ముక్కలుగా కట్ చేశారు. -
మద్యం విధానం ముసుగులో ‘జగన్ అండ్ కో’ భారీ కుంభకోణం
అధికారం చేపట్టిన వెంటనే దశలవారీ మద్యనిషేధం ముసుగులో మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వమే నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చిన ‘జగన్ అండ్ కో’.. దాన్ని అడ్డుపెట్టుకుని అతి పెద్ద కుంభకోణానికి తెరలేపింది. -
పెద్దిరెడ్డి మార్క్.. అరాచక సెటిల్మెంట్లు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఒకరికి 40 ఏళ్లుగా చైనా క్లే అనే ఖనిజం లీజు ఉంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. రైతులను ఎర్రిపప్పలు అని వ్యాఖ్యానించిన ఆ జిల్లాకు చెందిన మంత్రి కన్ను ఈ లీజుపై పడింది. -
జర్మనీలో మినీ మహానాడు
అయిదేళ్ల జగన్ అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రులు.. వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడారని జర్మనీలోని తెలుగువారు పేర్కొన్నారు. తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. -
వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో దేశ రక్షణ: రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్
స్వయం ప్రతిపత్తితో కూడిన వ్యూహాత్మక ఆలోచనా విధానాలు అమలుచేయడం ద్వారా దేశ సమగ్ర రక్షణ సాధ్యమని, అందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. -
ప్రక్షాళన మొదలైంది.. తిరుమల నుంచే శ్రీకారం!
పాలన ప్రక్షాళన దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తిరుమల నుంచే దానికి శ్రీకారం చుట్టింది. ఇంతకాలం తితిదే ఇన్ఛార్జి ఈవోగా కొనసాగుతూ అనేక ఆరోపణలను ఎదుర్కొన్న ధర్మారెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తప్పించేసింది. -
వైకాపా హయాంలో.. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత!
అంతా మా ఇష్టం అన్నట్లు సాగిన వైకాపా పాలనలో పౌరసరఫరాల సంస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. అడ్డగోలు నిర్ణయాల కారణంగా అయిదేళ్ల కాలంలో సంస్థ అప్పులు రూ.40వేల కోట్లకు చేరాయి. సంస్థకు అప్పు పుట్టే మార్గం లేక.. మార్క్ఫెడ్ తదితర సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. -
సీఎంఓలోకి రాజమౌళి, కార్తికేయ మిశ్రా
ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోకి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎ.వి.రాజమౌళి, కార్తికేయ మిశ్రాలను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎ.వి.రాజమౌళి 2003 బ్యాచ్ ఉత్తర్ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. -
కాకినాడ జిల్లా కొమ్మనాపల్లిలో 70 మందికి అతిసారం.. వ్యవసాయ కూలీ మృతి
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో గురు, శుక్రవారాల్లో అతిసారం ప్రబలి సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొమ్మనాపల్లిలో ఉంటున్న ఉప్పాడ మండలం రమణక్కపేటకు చెందిన డి.నాగమణి (36) అనే వ్యవసాయ కూలీ శుక్రవారం మృతిచెందారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
తెలుగుతేజం, ఐఏఎస్ అధికారి ఎం.వి.ఆర్.కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆయన కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా కలెక్టర్గా పని చేస్తున్నారు. -
చట్టాల్లో మార్పులను.. నిరంతరం అధ్యయనం చేయాలి
చట్టాల్లో వచ్చే మార్పులను న్యాయవాదులు నిరంతరం అధ్యయనం చేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు సూచించారు. -
మహిళా లక్షాధికారులు!
జీవనోపాధి కల్పన ద్వారా సుస్థిర ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళల్ని లక్షాధికారులను చేసేందుకు గ్రామీణ, పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) నడుంకట్టింది. -
రెండున్నరేళ్లలో అమరావతి పూర్తయ్యేలా చూస్తాం
రాజధాని అమరావతి నిర్మాణం రెండున్నరేళ్లలో పూర్తయ్యేలా చూస్తామని పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలు గొప్పవని... వారికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
వైకాపా పాలనలో అరాచక డీఎస్పీలు
వారంతా డీఎస్పీ స్థాయి అధికారులు.. చట్టం, నిబంధనల ప్రకారం పనిచేయాల్సింది పోయి ఐదేళ్లలో వైకాపా బంటుల్లా సేవలందించారు. ఆ పార్టీ నాయకుల అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచారు. -
అప్పులు, ఆర్థిక పరిస్థితులపై నాలుగు శ్వేతపత్రాలు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభాన్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థికచిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు శ్వేతపత్రాలు (వైట్ పేపర్) వెలువరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన కసరత్తు కూడా ప్రారంభమైంది. -
శాప్ ఏవోకి ఉద్యోగ విరమణ వర్తించదా?
సర్వీస్ నిబంధనల ప్రకారం గత నెల 31న ఉద్యోగ విరమణ చేయాల్సిన క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) పరిపాలనాధికారి రామకృష్ణ ఇప్పటికీ అదే స్థానంలో కొనసాగడం చర్చనీయాంశమైంది. -
రవాణాశాఖలో ఓడీల పేరిట గుట్టుగా బదిలీలు
రవాణా శాఖలో కొంత కాలంగా పలువురు అధికారులు, ఉద్యోగులకు ఆన్ డ్యూటీ (ఓడీ) కింద గుట్టుగా బదిలీలు చేశారు. వివిధ కారణాలను సాకుగా చూపించి.. వాళ్లు కోరుకున్నచోట విధులు కేటాయిస్తూ ఆ శాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా ఆదేశాలిస్తూ వచ్చారు.