MLA Pinnelli Case:: హమ్మయ్య.. అనుకున్న పోలీసులు!
అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేట్రేగిపోవడం, సింహం సింగిల్గానే వస్తుందని సినిమా డైలాగులు చెప్పడం... పరిస్థితులు ఎదురు తిరగ్గానే పిల్లిలా పారిపోవడం కొందరు వైకాపా నాయకుల నైజం..!
ప్రస్తుతానికి పిన్నెల్లిని అరెస్టు చేయక్కర్లేదని ఊరట
పది రోజులుగా ఆయనను అరెస్టు చేయకుండా హైడ్రామా
ఇప్పటికీ పరారీలోనే పిన్నెల్లి..!
ఈనాడు, అమరావతి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేట్రేగిపోవడం, సింహం సింగిల్గానే వస్తుందని సినిమా డైలాగులు చెప్పడం... పరిస్థితులు ఎదురు తిరగ్గానే పిల్లిలా పారిపోవడం కొందరు వైకాపా నాయకుల నైజం..! మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారిలో ఒకరు..! వైకాపా అధికారంలోకి వచ్చాక ఐదేళ్లూ కన్నూ మిన్నూ కానకుండా నియోజకవర్గాన్ని పట్టి పీడించిన ఆయన... పోలీసులు తనవైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా వ్యవస్థలను నియంత్రించారు. ఇప్పుడు అదే పోలీసులకు దొరక్కుండా కలుగులో దాక్కున్నారు. ‘‘పారిపోవాల్సిన అవసరం నాకేంటి? నేను ఎక్కడికీ పారిపోలేదు. కావాలంటే రెండు గంటల్లో మాచర్లకు రాగలను’’ అని బీరాలు పలికిన పిన్నెల్లి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. పల్నాడు పులి అంటూ అనుచరులిచ్చే బిల్డప్లతో తెగ రెచ్చిపోతూ... ఎన్నికల తర్వాత అందరికీ ‘సినిమా చూపిస్తా’నని హెచ్చరించిన ఆయన పోలీసులకు దొరక్కుండా దాగుడుమూతలు ఆడారు. పిల్లిలా ఒక చోటు నుంచి మరో చోటుకు మకాం మార్చారు.
పోలీసులు గురువారం కూడా పిన్నెల్లి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. రాష్ట్రంలో డీజీపీ మారినా పోలీసుల తీరు మారలేదనడానికి పిన్నెల్లి పరారీ ఉదంతమే నిదర్శనం. ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం పోలీసులు నిజంగానే గాలిస్తున్నారా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. పిన్నెల్లి పోలీసుల అదుపులో ఉన్నారని కాసేపు, అరెస్టు చేయలేదని కాసేపు బుధవారం అర్ధరాత్రి వరకు ఊహాగానాలు కొనసాగాయి. ఆయన నరసరరావుపేట కోర్టులో లొంగిపోతున్నారంటూ గురువారం ప్రచారం జరిగింది. దాంతో నరసరావుపేట, గురజాల కోర్టుల వద్ద కొందరు పోలీసుల్ని మోహరించారు. అంతకుమించి పిన్నెల్లిపై కేసుల దర్యాప్తులో గానీ, ఆయన ఆచూకీ కనిపెట్టడంలో గానీ పోలీసులు గురువారం ఎలాంటి పురోగతి సాధించలేదు. మరోపక్క ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు... ఆయనపై జూన్ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ఆదేశించింది. పోలీసులకు కావలసిందీ అదే..! హైకోర్టు ఉత్తర్వులు పిన్నెల్లి కంటే... పోలీసులకే ఎక్కువ ఊరట కలిగించాయి..! ఎమ్మెల్యేను అరెస్టు చేయకుండా రకరకాల డ్రామాలతో నెట్టుకొస్తున్న పోలీసులకు ఇది నిజంగా ఊరటే..!
పోలీసులు నిజంగానే అరెస్టు చేయలేకపోయారా?
పోలింగ్ మర్నాడు కారంపూడి, మాచర్లలో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని వెంటేసుకుని విధ్వంసం సృష్టించడం, తెదేపా నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, ఆస్తుల విధ్వంసం, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేయడంతో ఎమ్మెల్యేను ఈ నెల 15న పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తనపై పోలీసులు కేసులు నమోదుచేయడంతో అరెస్టు తప్పదన్న భయంతో... ఆయన మర్నాడు రాత్రి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పారిపోయారని ప్రచారం జరగడంతో, అక్కడ శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకే హైదరాబాద్ వచ్చాను తప్ప, తాను పారిపోలేదని, కావాలంటే రెండు గంటల్లో మాచర్లకు రాగలనని ఆయన టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇలా బహిరంగంగా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రతిపక్ష నాయకులకు సవాళ్లు విసురుతున్నా... పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించలేదు.
ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి నేలకేసి కొట్టిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేయడంతో... విధిలేని పరిస్థితుల్లో పోలీసుల్లో కదలిక వచ్చింది. పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీ పోలీసులు హైదరాబాద్లోని పిన్నెల్లి ఇంటికి సమీపంలో వేచి ఉండటం.. కాసేపటికి ఆయన ఇంటినుంచి బయటకు వచ్చిన కారును వెంబడించడం.. కొంత దూరం వెళ్లాక నిలిచిపోయిన ఆ కారులో పిన్నెల్లి లేకపోవడం.. ఆయన కారు దిగి రోడ్డు దాటి మరో కారులో హైదరాబాద్ వైపు వెళ్లిపోయారని ఎమ్మెల్యే కారు డ్రైవర్, గన్మెన్ చెప్పడంతో పోలీసులు అవాక్కై వట్టి చేతులతో వెనుదిరగడం వంటి పరిణామాలు బుధవారం జరిగాయి. ఇదంతా నిజంగానే జరిగిందా? పోలీసులు పండించిన హైడ్రామానా? అన్న విషయంలోనూ సందేహాలున్నాయి. మరోపక్క ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి విదేశాలకు పారిపోయారని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది.
ఇది పోలీసుల చేతగానితనం కాదా?
పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు గురువారం రాత్రి వచ్చాయి. అంతకుముందు పోలీసులు ఏం చేశారు? పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసినప్పుడు... ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే ఉన్నారు. పోలింగ్ కేంద్రంలోకి వెళుతున్న ఎమ్మెల్యేను అడ్డుకోలేదు సరే... ఆ తర్వాతైనా ఉన్నతాధికారులకు చెప్పలేదా? అలాగైతే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎన్నికల అక్రమాల్ని అడ్డుకోనందుకు రెంటచింతల ఎస్ఐని సస్పెండ్ చేసినప్పుడే ఎమ్మెల్యేని ఎందుకు అరెస్టు చేయలేదు? ఆయన పొరుగు రాష్ట్రానికి పారిపోయే వరకూ ఎందుకు ఊరుకున్నారు? ఎమ్మెల్యేతోపాటు ఉన్న గన్మెన్ పోలీసులే కదా? వారిని సంప్రదించి ఎమ్మెల్యే ఆచూకీ ఎందుకు తెలుసుకోలేదు? హైదరాబాద్లో ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికే వెళ్లామని చెబుతున్న పోలీసులు... ఆయన ఇంట్లోకి వెళ్లకుండా బయట ఉండటమేంటి? ఆయన కారు ఇంట్లోంచి బయటకు వెళుతుంటే అక్కడే అడ్డుకోకుండా వెంబడించడమేంటి? చివరకు కారులో ఎమ్మెల్యే లేరని, పారిపోయారని చెప్పడమేంటి? ఇదంతా పోలీసుల చేతగానితనం కాదా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి...!
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టిన మహిళ విజయలక్ష్మి.. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వచ్చారు. -
పోలవరమే పెను సవాలు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఒక పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్ వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. -
అధికారం వచ్చిందని.. కక్ష సాధింపులొద్దు
‘అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు.. విర్రవీగడం లాంటి చర్యలొద్దు.. ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దు’ అని తెదేపా నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. -
మోసపోయాం.. మన్నించండి
వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. -
విద్యా, వసతి దీవెన బకాయిల వివరాలివ్వండి
రాష్ట్రవ్యాప్తంగా విద్యా, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల ఖాళీల వివరాలివ్వాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. -
మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. -
ఏయూ విద్యార్థిని ఫిర్యాదు.. వెంటనే మంత్రి స్పందన
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. -
రామోజీరావు.. ఒక విశ్వవిద్యాలయం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. ఆయనొక విశ్వవిద్యాలయమని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్మరించుకున్నారు. -
ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కసరత్తు
రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
బోల్తాపడిన బోధనాసుపత్రులు
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్ధి పడకేసింది. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పన హామీలను పాలకులు విస్మరించారు. -
ముఖ్యమంత్రి రేపు పోలవరం సందర్శన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. -
చంద్రబాబుకు కళ్లద్దాలిచ్చి.. మురిసిపోయిన మహిళ
మిమ్మల్ని సీఎంగా చూడాలని ఐదేళ్లుగా మేం చేయని పూజలు లేవని పలువురు మహిళలు చంద్రబాబుతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. -
సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం
అనుమతులు లేకుండా అవులపల్లె ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి.. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.600 కోట్ల బిల్లులు చేసుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీరభ్కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్కుమార్ గుప్తా శనివారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. -
ఇదీ సంగతి!
-
సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల వినతులు స్వీకరించడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టారు. -
కిషన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్కల్యాణ్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు బొగ్గు, గనులశాఖ ఎంతో కీలకం. -
ప్రజలకూ నాకూ మధ్య అడ్డుగోడలుండవు
ప్రజలకు, తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. -
పౌరసరఫరాల శాఖలో భారీ దోపిడీ
రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె.. ఏది చూసినా ప్యాకెట్కు 50-100 గ్రాములు తక్కువ బరువే. -
మహిళలకు రక్షణ కల్పిస్తాం.. రాష్ట్ర హోం మంత్రి అనిత
భూకబ్జాలు, దాడులు.. మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరక్కుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.