Social Trolling: సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు.
లైట్ తీస్కో..
భయ్యా లైట్ తీస్కో...
ఆ మధ్య బాగా హిట్టయిన పాట.
విద్యార్థులు మళ్లీ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన పాట. బంగారు భవితకోసం కష్టపడి చదివే విద్యార్థులను ‘అకడమిక్ ట్రోలింగ్’ భూతం తరుముతోంది. ఎక్కువ మార్కులొస్తే అన్ని ఎలా వచ్చాయి అంటారు, తక్కువ వస్తే ఇంతేనా సామర్థ్యం అంటారు.. కొందరు మరింత ముందుకెళ్లి విద్యార్థుల రూపురేఖలపైనా కామెంట్లు చేస్తూ వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరి వీటిని ఎదుర్కొని నిలబడేదెలా?
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. ఇటువంటి సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎదురయ్యే విమర్శలు, ప్రతికూల వ్యాఖ్యలు ఎదుర్కోవడం మరో పెద్ద ఒత్తిడి అయిపోతోంది. ఇటీవల ఉత్తర్ప్రదేశ్లో పదోతరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థినిని అభినందించడం మానేసి.. తన రూపురేఖలపై కొందరు చేసిన దుష్ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఎంతో కష్టపడి చదివి మొదటి ర్యాంకు తెచ్చుకున్న ఆ అమ్మాయి ఇటువంటి పరిస్థితులకు ఎంత తల్లడిల్లి ఉంటుంది? అయితే తాను ఇటువంటి వాటిని పట్టించుకోవడం లేదనీ, చదువు మీదే దృష్టిపెట్టాననీ నవ్వుతూ చెప్పేసింది. ఆమె ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని ఉంటే తన జీవితం ఏమయ్యేది?
- ఎదుటివారిని విమర్శించడం, వెక్కిరించడం అనేది సమాజంలో ఎప్పుడూ ఉంది. ఒకప్పుడు విద్యార్థులు స్నేహితుల నుంచి, దూరపు బంధువుల నుంచి ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు ఇది డిజిటల్ ఫార్మాట్కు మారింది. కంప్యూటర్ తెర వెనుక ఉన్నాం, మనల్ని ఎవరూ గమనించరు అనే నమ్మకంతో కొందరు ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇటువంటి ట్రోలింగ్కు విద్యార్థులు ఎక్కువగా గురికావాల్సి వస్తోంది. అందుకే వారు దీనిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.
- ఈ ఆన్లైన్ వేధింపుల వల్ల విద్యార్థులు మానసికంగా ఎంతగానో నలిగిపోతుంటారు. నిజానికి ఆన్లైన్లో ఇలా ఇతరుల మీద బురద చల్లేవారు తమ నిజజీవితంలో ‘ఐడెంటిటీ క్రైసిస్’తో బాధపడుతుంటారు. ఏదోవిధంగా అందరూ తనను గుర్తించాలి అనే ఆలోచనతో ఉంటారు. సొంతంగా ఏదైనా సాధించి ఆ గుర్తింపు పొందే యోగ్యత లేనివారు.. అప్పటికే ఏదో విధంగా విజేతలైన వారిని విమర్శించడం ద్వారా గుర్తింపు పొందాలని కోరుకుంటారు. ఎవరికైనా ప్రాముఖ్యం పెరుగుతుందని అనిపిస్తే వారిని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. లైక్లు, కామెంట్లు, షేర్ల కోసం అవతలివారు మనిషి అని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఒకరకమైన మానసిక లోపం.
- ఏం చేయాలి?: ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సమాజంలో ఎన్నో రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులుంటారు. కొందరి ఆలోచనా ధోరణి విపరీత పద్ధతుల్లో ఉంటుంది. వాస్తవాలను పట్టించుకోకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే వారికి కొదవ లేదు. ఇటువంటి వారిని మనం మార్చలేం, కానీ దూరంగా ఉండగలం. వారి నుంచి మనకు రక్షణ కల్పించేది మనం ఏర్పరుచుకునే ఆత్మస్థైర్యం మాత్రమే. నేటి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల నుంచి పూర్తిగా దూరంగా ఉండటం సాధ్యం కాదు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాడటం ద్వారా ఇటువంటి మానసిక దాడుల నుంచి బయటపడగలం.
- ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్.. మాధ్యమం ఏదైనా ప్రైవసీ సెట్టింగ్స్ ఉన్నాయి. మన ప్రొఫైల్ను ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదు.. ఇలా లాకింగ్ను ఉపయోగించుకోవడం ద్వారా కొంతవరకూ రక్షణ పొందవచ్చు.
- విద్యార్థుల్లో చదివేవారు, చదవనివారు, భిన్న మనస్థత్వాల వారూ ఉంటారు. అందరి పట్లా ఇతరులకు ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. మనం ఎదుటివారికి నచ్చకపోతే అది వారి సమస్య. ఏదో అన్నారని మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనపై మనకు నియంత్రణ పెరగాలి. మన ఆలోచనలు, మాటలు, చేతలు అన్నీ మన అధీనంలోనే ఉండాలి. అందుకు నిరంతర సాధన చేయాలి.
- ఇప్పుడు ముఖాలు, గొంతులు మార్చేలా ఎన్నో యాప్లు వచ్చేశాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. మనం కూడా కనిపించిదల్లా ఫార్వర్డ్ చేయడం, విషప్రచారాలను పంచుకోవడం సరికాదు. కొన్నిసార్లు ఇది న్యాయపరమైన ఇబ్బందులను తెచ్చిపెట్టగలదు. మన ఫోన్లో ఏ యాప్కి ఎంతవరకూ పర్మిషన్ ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేది చూసుకోవాలి. డిజిటల్ డిపెండెన్సీను తగ్గించుకోవాలి. ప్రఖ్యాత సైకాలజిస్ట్ విలియం జేమ్స్ చెప్పిన ‘స్టార్వేషన్ ఆఫ్ అప్రిషియేషన్’ బారిన పడకూడదు. దానితో బాధపడేవారి ఆలోచనలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వకూడదు. డీసెంటిసైజేషన్ను సాధన చేయాలి. మన పట్ల మనమే బాధ్యత తీసుకోవాలి. అనవసర విషయాలకు, మన చేతుల్లో లేని అంశాలకు స్పందించడం తగ్గించుకోవాలి. ఎమోషనల్ ఎలాస్టిసిటీ పెంచుకోవాలి. ఒక రబ్బర్బాండ్ ఎంత లాగినా వదిలిన వెంటనే తన యథాస్థితికి వచ్చేస్తుంది. అలాగే ఒక విషయం మనల్ని ఎంత బాధపెట్టినా, దాన్ని వదిలేసి మన యథాస్థితికి వచ్చేయడానికి ప్రయత్నించాలి.
- విమర్శ ఏదైనా ఆలోచన వరకే ఉండాలి, మనసుకు చేరకూడదు. గొప్పగొప్ప నాయకుల దగ్గర్నుంచి సాధారణ వ్యక్తుల వరకూ అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత ట్రోలింగ్కు గురవుతూనే ఉంటారు, ఇది సాధారణం. స్పందిస్తేనే డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి చుట్టుముడతాయి. అదే వదిలేస్తే ఏ బాధా ఉండదు. తిట్టుకుంటూ నిలబడటం కాదు, తట్టుకుని నిలబడాలి. విద్యార్థులంతా ఇది సాధన చేయడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కో గలరు.
- అన్నింటికీ మించి విద్యార్థులు ట్రోలింగ్ సెన్సిటివిటీని తగ్గించుకోవాలి. రెజిలియన్స్ నైపుణ్యం (స్థితప్రజ్ఞత) పెంచుకునే ప్రయత్నం చేయాలి. అవతలి వారు అనేవి మాటలు మాత్రమే.. దాన్ని మనం మనసుకు తీసుకుంటేనే అది మనపై ప్రభావం చూపగలదు. అదే వదిలేస్తే అది ఎటువంటి ప్రభావమూ చూపలేదు.
- ఇందుకు మనం చేయాల్సిందల్లా అలా వదిలేయడం నేర్చుకోవడం. అయితే ఇది చెప్పినంత సులభమైన పనైతే కాదు, చాలా కసరత్తు అవసరం. నేటి విద్యార్థులు ఇతర నైపుణ్యాలను ఎలాగైతే సాధన చేస్తున్నారో దీన్ని కూడా అలాగే చేయడం ద్వారా వయసు పెరిగేకొద్దీ వారు మరింత దృఢంగా తయారవుతారు.
- 19 నుంచి 25 విద్యార్థుల భవితను మలుపు తిప్పే వయసు. ఇటువంటి సమయంలో ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తూ జీవితాన్ని పాడుచేసుకోకుండా మనకోసం మనం జీవించడం నేర్చుకోవాలి.
- విద్యార్థులు ఈ సమయంలో మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మనం ఏదైనా ఇబ్బందికి గురైతే మనకంటే ఎక్కువగా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు నలిగిపోతారు.
- అదే ధైర్యంగా ఉండటం ద్వారా వారికి ఆ బాధ కలగకుండా చూసుకోవచ్చు. ఆన్లైన్లో ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో కనెక్ట్ అవుతున్నాం, జీవితం గురించి ఎవరికి సమాచారం ఇస్తున్నాం అనేది గమనించుకోవాలి. స్క్రీన్ టైమ్ను తగ్గించుకోవడం, డిజిటల్ ఫాస్టింగ్ చేయడం.. ఇవన్నీ అవసరం.
ఈనాడు చదువు డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి