రూ.100 కోట్లకు పైగా దోచిపెట్టే పన్నాగం
ప్రైవేటు గుత్తేదారుకు రూ.100 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చేందుకు వైకాపా ప్రభుత్వంలో సకలశాఖ మంత్రిగా వ్యవహరించే ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి, పాఠశాల విద్యాశాఖలోని ఓ కీలక అధికారి తెరవెనుక చక్రం తిప్పారు.
తెరవెనుక చక్రం తిప్పిన ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్ర మంత్రి, విద్యాశాఖ కీలక అధికారి
‘ఆర్బిట్రేటర్’ నిబంధనను సాకుగా చూపి.. గుత్తేదారుకు చెల్లింపులకు చర్యలు
హైకోర్టు సింగిల్ జడ్జి, ధర్మాసనం తీర్పులనూ పట్టించుకోకుండా ఆదేశాలు
ఈనాడు, అమరావతి: ప్రైవేటు గుత్తేదారుకు రూ.100 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చేందుకు వైకాపా ప్రభుత్వంలో సకలశాఖ మంత్రిగా వ్యవహరించే ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి, పాఠశాల విద్యాశాఖలోని ఓ కీలక అధికారి తెరవెనుక చక్రం తిప్పారు. ఎన్నికల ముందు రహస్యంగా ఈ వ్యవహారం సాగించారు. ట్యాబ్ల కాంట్రాక్టుతో ఇప్పటికే ఆ గుత్తేదారుతో అంటకాగుతున్న ప్రభుత్వ సలహాదారు, మంత్రి అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ (ఏడీసీఆర్) టీవీల సరఫరాలోనూ ఆయనపై ప్రేమ కురిపించారు. గుత్తేదారు సంస్థ 2వేల ఏడీసీఆర్లను సరఫరా చేశామని చెబుతున్నా.. ఒప్పందం ప్రకారం 779 ఏడీసీఆర్లకే సొమ్ము చెల్లించాలని హైకోర్టు సింగిల్ జడ్జి, సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చాయి. కానీ, ఒప్పందంలో ‘ఆర్బిట్రేటర్’ నిబంధనను సాకుగా చూపుతూ గుత్తేదారుకు లబ్ధి చేకూర్చేందుకు పావులు కదిపారు. ఆర్బిట్రేటర్ న్యాయశాఖ కార్యదర్శి ద్వారా గుత్తేదారుకు రూ.100కోట్లకు పైగా దక్కేలా వైకాపా ప్రభుత్వ పెద్దలు అవార్డు జారీ చేయించుకోవడం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందరూ ఏకమైన ప్రజాధనాన్ని అప్పనంగా గుత్తేదారు సంస్థకు కట్టబెట్టేలా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఏం జరిగింది?
ఏడీసీఆర్ సామగ్రి సరఫరా చేసేందుకు ఏపీ సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ గతంలో రూ.123.83 కోట్ల విలువైన టెండర్ ప్రకటన జారీచేశారు. ఈ టెండర్లో సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. 90 రోజుల్లో 2వేల ఏడీసీఆర్ల సరఫరా పూర్తిచేయాలని ఎస్ఎస్ఏ వర్క్ ఆర్డర్ జారీచేసింది. నిర్దిష్ట సమయంలో సరఫరా చేయకపోతే తిరస్కరించే అధికారం ఉంటుందని, జరిమానా విధించొచ్చని ఒప్పందంలో పేర్కొన్నారు. ఏడీసీఆర్ల సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంపిణీని నిలిపేయాలని గుత్తేదారు సంస్థకు అధికారులు ఆదేశించారు. దీంతో గడువులోపు సరఫరా చేసిన 779 ఏడీసీఆర్లకూ ప్రభుత్వం సొమ్ము చెల్లించడం లేదని తొలుత గుత్తేదారు సంస్థ 2021 జూన్లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. వాటి సొమ్మును చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించగా, ప్రభుత్వమూ ఆ సొమ్ము చెల్లించింది.
ధర్మాసనం ముందు అప్పీల్
సింగిల్ జడ్జి తీర్పుపై గుత్తేదారు సంస్థ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి 779 ఏడీసీఆర్లకే సొమ్ము చెల్లించాలన్నారని, మొత్తం 2,000 యూనిట్లకు చెల్లించేలా ఆదేశించలేదని పేర్కొంది. అప్పీల్పై విచారణ జరిపిన హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, అప్పీల్ను కొట్టేస్తూ 2023 ఆగస్టు 9న తీర్పు వెల్లడించింది.
మతలబంతా ఇక్కడే
హైకోర్టు సింగిల్ జడ్జి, ధర్మాసనం రెండూ 779 ఏడీసీఆర్లకే సొమ్ము చెల్లించాలని తీర్పునిచ్చాయి. ఒప్పందంలోని ఆర్బిట్రేషన్ క్లాజ్ను సాకుగా చూపుతూ గుత్తేదారుతో కుమ్మక్కైన ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్ర మంత్రి తెరవెనుక చక్రం తిప్పారు. దీనికి పాఠశాల విద్యాశాఖ కీలక అధికారి సహకారం అందించారు. గుత్తేదారు సంస్థ సరఫరా చేసినట్లు చెబుతున్న 2వేల ఏడీసీఆర్లలో మిగతా 1,221కీ సొమ్ము చెల్లించేలా అవార్డు జారీ చేయాలని కోరుతూ అర్బిట్రేటర్ను ఆశ్రయించింది. గుత్తేదారు అభ్యర్థనకు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు తోడవ్వడంతో రూ.వంద కోట్లకుపైగా డబ్బులు చెల్లించేందుకు ఆర్బిట్రేటర్ ద్వారా ఆదేశాలు వెలువడ్డాయి.
వీటిని పట్టించుకోలేదనే విమర్శలు..
ఏడీసీఆర్లు సరఫరా చేసేందుకు కాలపరిమితిని ‘వర్క్ ఆర్డర్’ తేదీ నుంచి మాత్రమే లెక్కించాల్సి ఉండగా.. ఆ విషయాన్ని ఆర్బిట్రేటర్ పరిగణనలోకి తీసుకోలేదని, వడ్డీతో చెల్లించాలనడం ఒప్పందంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలోని నిబంధనల పరిధికి మించి ఆర్బిట్రేటర్ వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఓ కేసులో ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఇందులో ఆర్బిట్రేటర్ వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. నిర్వహణ నిబంధనలను గుత్తేదారు ఉల్లంఘించినా, నిర్వహణ కింద రూ.16.95 కోట్లు చెల్లించాలని అవార్డు జారీచేయడం చట్టవిరుద్ధంగా ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్బిట్రేటర్ అవార్డు ఆదేశాలివే..
- ఏడీసీఆర్లు సరఫరా చేసినందుకు గుత్తేదారు సంస్థకు ప్రభుత్వం రూ.66.63 కోట్లు చెల్లించాలని ఆర్బిట్రేటర్ ఆదేశించారు.
- గతంలో 779 ఏడీసీఆర్లకు సొమ్ము చెల్లించే క్రమంలో ఆ సంస్థ నుంచి జరిమానా రూపంలో మినహాయించిన రూ.6.61 కోట్లూ తిరిగివ్వాలి.
- రూ.66.63 కోట్లు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేసినందుకు గుత్తేదారు సంస్థకు 12% వడ్డీ కట్టాలి.
- 2020 సెప్టెంబరు నుంచి 2024 సెప్టెంబరు వరకు నిర్వహణకు రూ.16.95 కోట్ల సొమ్ము ఇవ్వాలి.
- వడ్డీ కాకుండా ఈ మొత్తమే రూ.90.19 కోట్లు అవుతోంది. అంతా 30 రోజుల్లో చెల్లించాలి.
- ఇన్స్టాలేషన్ పెండింగ్లో ఉన్నవాటిని పూర్తి చేసి 30 రోజుల్లో ఆ సొమ్ము కోసం ప్రభుత్వానికి బిల్లులు సమర్పించాలని గుత్తేదారు సంస్థకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో పెట్టుబడుల పరిణామాలు తెలియజేయండి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
దేశంలో పెట్టుబడులకు సంబంధించిన పరిణామాలు, వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన కంపెనీల విస్తరణ సమాచారమంతా ఎప్పటికప్పుడు తనకు చేరేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. -
బాధ్యతలు అప్పగించక ముందే సామగ్రి తరలింపు.. ధర్మారెడ్డి తీరుపై విమర్శలు
తితిదే ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి మరొకరికి బాధ్యతలు అప్పగించక ముందే గుట్టుగా తన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసేసి, సామగ్రిని తరలించడం అనుమానాలకు తావిస్తోంది. -
నేడు చంద్రబాబు పోలవరం సందర్శన
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి జిల్లా పర్యటన ఇదే. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. -
తాడేపల్లిలో ప్రజలకు తీరిన ‘దారి’ కష్టాలు!
తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువనున్న మార్గాలపై రాకపోకలు నిలిపివేశారు. -
బెదిరించి రాజీనామాలు చేయించారు.. వైకాపా నేతలపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదు
‘అకస్మాత్తుగా సమావేశమన్నారు. వెళ్లేసరికి రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే.. రాజీనామా చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారు. -
‘కర్మ’ఫలం ఇది.. వైకాపాను ఉద్దేశించి పోస్టు చేసిన సీమెన్స్ మాజీ ఎండీ!
‘కర్మ’ఫలం ఇది.. అని సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ గత వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘న్యాయం గెలుస్తుంది.. అని నేను చెప్పిన మాటల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం చేశారు’ అని ఆదివారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. -
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడిఇబ్రహీంపట్నం, న్యూస్టుడే: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకొంది. -
‘ఉద్యోగాలు దక్కాలంటే పెట్టెలు తేవాలన్న బొత్స, సజ్జల’
మీ ఉద్యోగాలు దక్కాలంటే ఖాళీ చేతులతో కాదు..పెట్టెలు పట్టుకురావాలని అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ పీజీటీ(తెలుగు, ఇంగ్లీష్) ఉపాధ్యాయులు ఆరోపించారు. -
పత్రికా రంగానికి మార్గదర్శి
పత్రికా రంగంపై, తెలుగు ప్రజలపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని..ఆయన జీవితం నుంచి సాహసం, పట్టుదల, దార్శనికత వంటి నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు పేర్కొన్నారు. -
జనం సొమ్ముతో... జగన్ మాయామహల్
అణువణువునా పెత్తందారీ మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకుని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులతో ఊరూరా ప్యాలెస్లు నిర్మించుకున్నా సంతృప్తి చెందని జగన్.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విజయవంతంగా పూర్తిచేసిన ఏకైక ప్రాజెక్టు ఏంటో తెలుసా? విశాఖలోని రుషికొండపై తన కోసం రాజభవనాల్ని తలపించేలా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్లు మరిన్ని కట్టుకోవడం..! అయితే... -
గత మాస్టర్ప్లాన్ ప్రకారమే రాజధాని
గతంలో రూపొందించిన మాస్టర్ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. పనుల నిర్వహణలో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని, రాజధానిలో ఏ పనులు ఎప్పటికి పూర్తి చేస్తామో ప్రజలకు ముందుగానే తెలియజేస్తామని అన్నారు. -
పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే!
జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది. హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి.. కొన్నిచోట్ల బడులు మూతపడుతున్నాయి. -
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
ఉంగరాన్ని పోగొట్టుకున్న వ్యక్తి.. అనుమానితుణ్ని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించినా కేసు నమోదు చేయకపోగా, బాధితునితో సీఐ హేళనగా మాట్లాడిన ఘటనపై తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
రూ.2,100 కోట్లు దారి మళ్లింపు
ఏళ్ల తరబడి డ్వాక్రా మహిళలు రూపాయి, రూపాయి కూడబెట్టుకున్న అభయహస్తం నిధులనూ వైకాపా ప్రభుత్వం వదల్లేదు. 2021లో ఎల్ఐసీ వద్ద ఉన్న రూ.2,100 కోట్లను లాగేసుకున్నారు. ఆ నిధులు ఏం చేశారో, ఎక్కడికి మళ్లించారో ఇప్పటికీ మిస్టరీనే. -
వెన్నెముక శస్త్రచికిత్స వైద్యునికి అంతర్జాతీయ అవార్డు
వెన్నులోని డిస్కులకు పోషక పదార్థాలు ఎలా అందుతున్నాయో ప్రయోగాత్మకంగా నిరూపించిన పరిశోధనకు గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు ప్రతిష్ఠాత్మక ‘ఐఎస్ఎస్ఎల్ఎస్ ప్రైజ్’ అవార్డు దక్కింది. -
క్రీడాశాఖలో అవినీతిని బయటికి తీస్తాం: మంత్రి రాంప్రసాదరెడ్డి
‘రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్లలో క్రీడాశాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతాం. అవినీతిపరులను శిక్షిస్తాం. ప్రభుత్వం సొమ్మును తిరిగి రాబడుతాం’ అని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు. -
ప్రవీణ్ప్రకాష్ను బదిలీ చేయాలి
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ను బదిలీ చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. -
చిన్న పరిశ్రమల కష్టాలపై కసరత్తు
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) సంఖ్యను గుర్తించి.. క్షేత్రస్థాయిలో అవి ఎదుర్కొనే సమస్యలు తెలుసుకోడానికి చేపట్టిన ‘రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్)’ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
జనం సొమ్ముతో జగన్ సోకులు
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజాధనాన్ని లూటీ చేశారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. -
రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు!
నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సీఎంకు కృతజ్ఞతలు
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
-
మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్మెంట్ పేరుతో ₹81 లక్షలకు టోకరా!
-
భాజపా జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి
-
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!
-
పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు
-
క్రికెట్లో మా ప్రాభవం తగ్గుతోంది.. పీసీబీ లుక్కేయాలి: పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్