రూ.100 కోట్లకు పైగా దోచిపెట్టే పన్నాగం
ప్రైవేటు గుత్తేదారుకు రూ.100 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చేందుకు వైకాపా ప్రభుత్వంలో సకలశాఖ మంత్రిగా వ్యవహరించే ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి, పాఠశాల విద్యాశాఖలోని ఓ కీలక అధికారి తెరవెనుక చక్రం తిప్పారు.
తెరవెనుక చక్రం తిప్పిన ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్ర మంత్రి, విద్యాశాఖ కీలక అధికారి
‘ఆర్బిట్రేటర్’ నిబంధనను సాకుగా చూపి.. గుత్తేదారుకు చెల్లింపులకు చర్యలు
హైకోర్టు సింగిల్ జడ్జి, ధర్మాసనం తీర్పులనూ పట్టించుకోకుండా ఆదేశాలు
ఈనాడు, అమరావతి: ప్రైవేటు గుత్తేదారుకు రూ.100 కోట్లకు పైగా లబ్ధి చేకూర్చేందుకు వైకాపా ప్రభుత్వంలో సకలశాఖ మంత్రిగా వ్యవహరించే ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి, పాఠశాల విద్యాశాఖలోని ఓ కీలక అధికారి తెరవెనుక చక్రం తిప్పారు. ఎన్నికల ముందు రహస్యంగా ఈ వ్యవహారం సాగించారు. ట్యాబ్ల కాంట్రాక్టుతో ఇప్పటికే ఆ గుత్తేదారుతో అంటకాగుతున్న ప్రభుత్వ సలహాదారు, మంత్రి అడ్వాన్స్డ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ (ఏడీసీఆర్) టీవీల సరఫరాలోనూ ఆయనపై ప్రేమ కురిపించారు. గుత్తేదారు సంస్థ 2వేల ఏడీసీఆర్లను సరఫరా చేశామని చెబుతున్నా.. ఒప్పందం ప్రకారం 779 ఏడీసీఆర్లకే సొమ్ము చెల్లించాలని హైకోర్టు సింగిల్ జడ్జి, సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చాయి. కానీ, ఒప్పందంలో ‘ఆర్బిట్రేటర్’ నిబంధనను సాకుగా చూపుతూ గుత్తేదారుకు లబ్ధి చేకూర్చేందుకు పావులు కదిపారు. ఆర్బిట్రేటర్ న్యాయశాఖ కార్యదర్శి ద్వారా గుత్తేదారుకు రూ.100కోట్లకు పైగా దక్కేలా వైకాపా ప్రభుత్వ పెద్దలు అవార్డు జారీ చేయించుకోవడం తాజాగా వెలుగులోకి వచ్చింది. అందరూ ఏకమైన ప్రజాధనాన్ని అప్పనంగా గుత్తేదారు సంస్థకు కట్టబెట్టేలా చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఏం జరిగింది?
ఏడీసీఆర్ సామగ్రి సరఫరా చేసేందుకు ఏపీ సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ గతంలో రూ.123.83 కోట్ల విలువైన టెండర్ ప్రకటన జారీచేశారు. ఈ టెండర్లో సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. 90 రోజుల్లో 2వేల ఏడీసీఆర్ల సరఫరా పూర్తిచేయాలని ఎస్ఎస్ఏ వర్క్ ఆర్డర్ జారీచేసింది. నిర్దిష్ట సమయంలో సరఫరా చేయకపోతే తిరస్కరించే అధికారం ఉంటుందని, జరిమానా విధించొచ్చని ఒప్పందంలో పేర్కొన్నారు. ఏడీసీఆర్ల సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంపిణీని నిలిపేయాలని గుత్తేదారు సంస్థకు అధికారులు ఆదేశించారు. దీంతో గడువులోపు సరఫరా చేసిన 779 ఏడీసీఆర్లకూ ప్రభుత్వం సొమ్ము చెల్లించడం లేదని తొలుత గుత్తేదారు సంస్థ 2021 జూన్లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. వాటి సొమ్మును చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించగా, ప్రభుత్వమూ ఆ సొమ్ము చెల్లించింది.
ధర్మాసనం ముందు అప్పీల్
సింగిల్ జడ్జి తీర్పుపై గుత్తేదారు సంస్థ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి 779 ఏడీసీఆర్లకే సొమ్ము చెల్లించాలన్నారని, మొత్తం 2,000 యూనిట్లకు చెల్లించేలా ఆదేశించలేదని పేర్కొంది. అప్పీల్పై విచారణ జరిపిన హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని, అప్పీల్ను కొట్టేస్తూ 2023 ఆగస్టు 9న తీర్పు వెల్లడించింది.
మతలబంతా ఇక్కడే
హైకోర్టు సింగిల్ జడ్జి, ధర్మాసనం రెండూ 779 ఏడీసీఆర్లకే సొమ్ము చెల్లించాలని తీర్పునిచ్చాయి. ఒప్పందంలోని ఆర్బిట్రేషన్ క్లాజ్ను సాకుగా చూపుతూ గుత్తేదారుతో కుమ్మక్కైన ప్రభుత్వ సలహాదారు, ఉత్తరాంధ్ర మంత్రి తెరవెనుక చక్రం తిప్పారు. దీనికి పాఠశాల విద్యాశాఖ కీలక అధికారి సహకారం అందించారు. గుత్తేదారు సంస్థ సరఫరా చేసినట్లు చెబుతున్న 2వేల ఏడీసీఆర్లలో మిగతా 1,221కీ సొమ్ము చెల్లించేలా అవార్డు జారీ చేయాలని కోరుతూ అర్బిట్రేటర్ను ఆశ్రయించింది. గుత్తేదారు అభ్యర్థనకు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు తోడవ్వడంతో రూ.వంద కోట్లకుపైగా డబ్బులు చెల్లించేందుకు ఆర్బిట్రేటర్ ద్వారా ఆదేశాలు వెలువడ్డాయి.
వీటిని పట్టించుకోలేదనే విమర్శలు..
ఏడీసీఆర్లు సరఫరా చేసేందుకు కాలపరిమితిని ‘వర్క్ ఆర్డర్’ తేదీ నుంచి మాత్రమే లెక్కించాల్సి ఉండగా.. ఆ విషయాన్ని ఆర్బిట్రేటర్ పరిగణనలోకి తీసుకోలేదని, వడ్డీతో చెల్లించాలనడం ఒప్పందంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలోని నిబంధనల పరిధికి మించి ఆర్బిట్రేటర్ వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఓ కేసులో ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఇందులో ఆర్బిట్రేటర్ వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. నిర్వహణ నిబంధనలను గుత్తేదారు ఉల్లంఘించినా, నిర్వహణ కింద రూ.16.95 కోట్లు చెల్లించాలని అవార్డు జారీచేయడం చట్టవిరుద్ధంగా ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్బిట్రేటర్ అవార్డు ఆదేశాలివే..
- ఏడీసీఆర్లు సరఫరా చేసినందుకు గుత్తేదారు సంస్థకు ప్రభుత్వం రూ.66.63 కోట్లు చెల్లించాలని ఆర్బిట్రేటర్ ఆదేశించారు.
- గతంలో 779 ఏడీసీఆర్లకు సొమ్ము చెల్లించే క్రమంలో ఆ సంస్థ నుంచి జరిమానా రూపంలో మినహాయించిన రూ.6.61 కోట్లూ తిరిగివ్వాలి.
- రూ.66.63 కోట్లు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేసినందుకు గుత్తేదారు సంస్థకు 12% వడ్డీ కట్టాలి.
- 2020 సెప్టెంబరు నుంచి 2024 సెప్టెంబరు వరకు నిర్వహణకు రూ.16.95 కోట్ల సొమ్ము ఇవ్వాలి.
- వడ్డీ కాకుండా ఈ మొత్తమే రూ.90.19 కోట్లు అవుతోంది. అంతా 30 రోజుల్లో చెల్లించాలి.
- ఇన్స్టాలేషన్ పెండింగ్లో ఉన్నవాటిని పూర్తి చేసి 30 రోజుల్లో ఆ సొమ్ము కోసం ప్రభుత్వానికి బిల్లులు సమర్పించాలని గుత్తేదారు సంస్థకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!