ICMR: కత్తిగాటు లేకుండా శవపరీక్ష
ప్రమాదాల్లో, నేర ఘటనల్లో చనిపోయిన వారి మృతదేహాలకు శవపరీక్షలు చేయించడం కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదన కలిగించే పరిణామం.
వర్చువల్ అటాప్సీకి ఐసీఎంఆర్ ప్రోత్సాహం
త్రీడీ కన్వర్షన్, ఫొటోగ్రామ్మెట్రీ సాంకేతికత వినియోగం
కర్నూలు, గుంటూరు, విశాఖలో అమలుకు ప్రతిపాదనలు
ఈనాడు, అమరావతి: ప్రమాదాల్లో, నేర ఘటనల్లో చనిపోయిన వారి మృతదేహాలకు శవపరీక్షలు చేయించడం కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదన కలిగించే పరిణామం. అసలే ఆప్తులను కోల్పోయామన్న విషాదంలో ఉంటే, శవపరీక్ష పేరిట వారి శరీర భాగాలను కోయడం, సుత్తెతో పుర్రె పగలగొట్టడం జీర్ణించుకోలేనివి. కొన్నివర్గాల వారు మెడికో లీగల్ కేసుల్లోనూ శవపరీక్షలకు ముందుకు రాకుండా రాజీకి యత్నించడానికి కారణమిదే. ఈ తరుణంలో, కత్తిగాట్లు లేకుండా వర్చువల్ అటాప్సీ విధానంలో శవపరీక్షలు చేసే వైద్యపరమైన సాంకేతికత త్వరలోనే రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. త్వరగా పోస్టుమార్టం పూర్తిచేసి శవాన్ని పంపించడంతో పాటు ఈ నివేదికలు న్యాయపరంగానూ చెల్లుబాటు కావడం ఈ విధానంలోని అదనపు సౌలభ్యాలు.
వర్చువల్ అటాప్సీ లేదా డిజిటల్ అటాప్సీ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు బోధనాసుపత్రులకు అత్యాధునిక స్కానింగ్ యంత్రాలను గ్రాంట్స్ రూపంలో ఇవ్వనుంది. ఇందుకు సుమారు రూ.2 కోట్ల ఖర్చవుతుంది. ఏపీలో కర్నూలు, గుంటూరు బోధనాసుపత్రులు, విశాఖ కేజీహెచ్లో ఈ విధానం అమలుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే దిల్లీ, రిషికేశ్, నాగ్పుర్ ఎయిమ్స్ల్లో ఈ విధానం అమలవుతోంది. ఐదేళ్లుగా వర్చువల్ అటాప్సీ విస్తృతికి ఐసీఎంఆర్ చర్యలు తీసుకుంటోంది. రిషికేశ్ ఎయిమ్స్లో డీఎం-ఫోరెన్సిక్ రేడియాలజీ అండ్ వర్చువల్ అటాప్సీ కోర్సు (సూపర్ స్పెషాల్టీ)లో ఫోరెన్సిక్లో ఎండీ చేసిన వారికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ కోర్సును మరిన్ని ఆసుపత్రుల్లో ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఏటా గుంటూరు, విశాఖ బోధనాసుపత్రుల్లో 2 వేలు, మిగిలిన బోధనాసుపత్రుల్లో 1,000-1,500 వరకు శవపరీక్షలు జరుగుతున్నాయి.
ప్రస్తుత విధానంలో మూణ్నాలుగు గంటలు!
అసహజ మరణం చెందిన వారి మృతదేహాలకు బోధనాసుపత్రులు, ప్రాంతీయ, సామాజిక, జిల్లా ఆసుపత్రుల్లో పోస్టుమార్టం చేస్తుంటారు. మృతుల వివరాలను పోలీసులు ఆసుపత్రిలో అందించాక, వైద్యులు అందుబాటులో ఉండి వెంటనే పోస్టుమార్టం ప్రారంభిస్తే పూర్తి కావడానికి కనీసం 3-4 గంటలు పడుతుంది. ఈ ప్రక్రియలో వైద్యులు వివిధ పరికరాలతో మృతదేహం ఛాతీ, కడుపు, మెడ, పుర్రెను తెరుస్తారు. మృతదేహంపై ఎక్కడ గాయాలున్నా ఈ నాలుగు భాగాల పరిశీలన ద్వారా మరణానికి కారణాలు 90% వరకు నిర్ధారణ అవుతాయి.
వర్చువల్ అటాప్సీలో.. అరగంటే
సీటీ, ఎమ్మారై, త్రీడీ ఫొటోగ్రామ్మెట్రీ సాంకేతికత గల యంత్రం ద్వారా చేసే వర్చువల్ అటాప్సీ ప్రక్రియ అరగంటలో పూర్తవుతుంది. శవాన్ని బ్యాగుల్లో చుట్టి సాధారణ సీటీ, ఎమ్మారై స్కానింగ్ మాదిరిగానే ఇందులోనూ పరీక్షిస్తారు. శవంతో కూడిన బ్యాగ్ మిషన్ లోపలికి పంపిస్తుండగా, శరీర అవయవాలను అన్ని కోణాల్లోంచి పరిశీలించేలా ఇమేజెస్ జనరేట్ అవుతాయి. వాటి ఆధారంగా కండరాలు, కాలేయం, కిడ్నీ, ఇతర అవయవాల్లోని గాయాలను గుర్తిస్తారు. అంతర్గత రక్తస్రావం, అవయవ లోపాలు, అసాధారణ గాయాలతో పాటు కంటితో చూడలేని సూక్ష్మ తేడాలను వర్చువల్ అటాప్సీలో పరిశీలిస్తారు. ఇమేజెస్ను బట్టి మరణం ఎలా జరిగిందో వైద్యులు నిర్ధారిస్తారు. పోస్టుమార్టం గదిలోకి మృతదేహం వచ్చినప్పటి నుంచి అర గంటలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని విశాఖ కేజీహెచ్ ఫోరెన్సిక్ వైద్యుడు కట్టంరెడ్డి అనంత రూపేశ్ తెలిపారు. రోడ్డు ప్రమాద మృతులకు ఇది అనువైన విధానమని పేర్కొన్నారు. ‘సాధారణ శవపరీక్ష నివేదికలకు, డిజిటల్ అటాప్సీ నివేదికలకు వ్యత్యాసం లేదు. సెక్షన్ 65ఏ, 65బీ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం న్యాయస్థానాలు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వర్చువల్ అటాప్సీలో పారదర్శకత ఉంటుంది. ఎన్నేళ్లయినా ఫిల్మ్లు చెడిపోకుండా భద్రంగా ఉంటాయి. కత్తిగాట్లు వద్దనుకునే వారి సంప్రదాయాలను కూడా గౌరవించినట్లవుతుంది’ అని వివరించారు.
అన్ని కేసులకూ సరిపోతుందా?
వర్చువల్ అటాప్సీ విధానం 80-90% అసహజ మరణ కేసులకు అనుకూలం కాగా, కొన్నింటికి సంప్రదాయ (కత్తిగాటు) శవపరీక్ష తప్పదు. విషప్రయోగం జరిగిన కేసుల్లో కారణాలు తేల్చాలంటే పొట్టభాగంలో కత్తిగాట్లు తప్పనిసరి. మరికొన్ని కేసుల్లో అనుమానిత శరీర భాగంలోని కణజాలాన్ని సేకరించి, మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ (హిస్టో పాథాలజీ పరీక్ష) ద్వారా మరణ కారణాలు ధ్రువీకరించాలి. మలం, మూత్రం, ఫ్లూయిడ్స్ పరీక్షలు చేయాల్సిన కేసుల్లో వాటి నమూనాలు సేకరించేందుకు ఆయా భాగాల్లో కత్తిగాట్లు తప్పవు. ప్రత్యేక సందర్భాల్లో ఇమేజెస్ ద్వారా సీనియర్ వైద్య నిపుణుల అభిప్రాయాలను స్థానిక వైద్యులు తెలుసుకోవడానికి దీంతో వీలుందని విజయవాడ జీజీహెచ్ ఫోరెన్సిక్ విభాగం డాక్టర్ మహేశ్ తెలిపారు. ఈ విధానంలో ఇమేజింగ్ టెక్నాలజీ సాయంతో మృతదేహంలోని అన్ని భాగాలను నిశితంగా పరిశీలించి, మరణ కారణాన్ని (కాజ్ ఆఫ్ డెత్) ధ్రువీకరిస్తారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
-
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు