Liquor scam: దిల్లీ, ఛత్తీస్గఢ్ను మించిన మద్యం కుంభకోణం
దిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న దానికంటే మించి గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. గత ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు, వారి సన్నిహితులు సూత్రధారులుగా.. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలు అన్నింటినీ గుత్తాధిపత్యంలో పెట్టుకుని భారీగా దోచుకున్నారు.
సూత్రధారులు గత ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు, వారి సన్నిహితులు
వైకాపాకు మద్దతుదారులైన అధికారులతో వ్యవస్థీకృత దందా
మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలు అన్నింటా వారిదే గుత్తాధిపత్యం
ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నేపథ్యంలో.. పాత్రధారులైన ఇతర అధికారులపైనా చర్చ
సీబీఐ, ఈడీలకు దర్యాప్తు అప్పగించాలనే డిమాండ్లు
ఈనాడు, అమరావతి: దిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న దానికంటే మించి గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. గత ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు, వారి సన్నిహితులు సూత్రధారులుగా.. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలు అన్నింటినీ గుత్తాధిపత్యంలో పెట్టుకుని భారీగా దోచుకున్నారు. వైకాపాకు కరడుగట్టిన మద్దతుదారులైన అధికారులను పాత్రధారులుగా మార్చుకుని ఈ వ్యవస్థీకృత దందా కొనసాగించారు. రాష్ట్రంలో అధికారమార్పిడి జరిగిన తరుణంలో ఈ కుంభకోణంపై తెదేపా దృష్టిసారించింది. వైకాపా నాయకులు కుట్రదారులుగా రూపొందించిన నేర విధానాన్ని అన్నీ తానై అమలుచేశారనే అభియోగాలున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ శుక్రవారం కేసు నమోదుచేసింది. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సీఐడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ఇతర అధికారుల పాత్రపై తెదేపా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వారు భారీగా వెనకేసుకున్నారని తెలుస్తోంది. సూత్రధారుల్ని, పాత్రధారుల్ని పట్టుకునేలా ఈ కుంభకోణంపై విచారణను సీబీఐ, ఈడీలకు అప్పగించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
దోపిడీకీ అన్నీ తానైన వాసుదేవరెడ్డి
- ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యనాయకులు మద్యం విధానంలో కొనసాగించిన దోపిడీకి వాసుదేవరెడ్డే కళ్లు, చెవులు సహా అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులున్నాయి. వైకాపా అధికారం చేపట్టగానే ఏపీఎస్బీసీఎల్ ఎండీగా, డిస్టిలరీస్, బ్రూవరీస్ కమిషనర్గా ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని నియమించుకున్నారు. నాలుగున్నరేళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగి.. వైకాపా నాయకులు, ప్రభుత్వ పెద్దలు బినామీల పేరుతో ఏర్పాటుచేసిన మద్యం సరఫరా కంపెనీలు తయారుచేసే ‘జే బ్రాండ్లు’ మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో లభ్యమయ్యేలా చేసింది ఈయనేనని తెదేపా గుర్తించింది. ప్రభుత్వ పెద్దలు, అధికారపార్టీ ముఖ్య నాయకులకు ప్రతి మద్యం కేసుకు రూ.200-250 చొప్పున, ప్రతి బీరు కేసుకు రూ.100-150 చొప్పున కమీషన్ చెల్లించిన మద్యం కంపెనీలకే 99% కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్న ఫిర్యాదులున్నాయి.
- ఏ మద్యం కంపెనీలకు ఎంతవిలువైన ఆర్డర్లు ఇవ్వాలి? ఏయే బ్రాండ్లకు అనుమతులివ్వాలి? ఇలా ప్రతి అంశంపై సీఎంఓలోని కీలక అధికారి ఆదేశాలను పాటిస్తూ.. ప్రభుత్వపెద్దలు, వైకాపా ముఖ్య నాయకులకు అనుచిత లబ్ధి కలిగించారనేది ఈయనపై ప్రధాన ఆరోపణ.
- రమేష్రెడ్డి, కరీముల్లా, సురేష్రెడ్డి అనే ఉద్యోగుల్ని తనతోపాటు రైల్వే నుంచి డిప్యుటేషన్పై ఏపీఎస్బీసీఎల్కు తీసుకొచ్చిన వాసుదేవరెడ్డి.. వారిని ఈ దందాలో కీలకంగా మార్చారన్న ఫిర్యాదులున్నాయి.
‘జే’ ట్యాక్స్ వసూళ్ల బాధ్యతల్లో కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి
ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు చెల్లించేందుకు అంగీకరించే కంపెనీలకే మద్యం ఆర్డర్లు లభించేలా చేయడం, వారినుంచి ‘జే’ ట్యాక్స్ వసూలు లాంటి బాధ్యతలన్నీ కసిరెడ్డి రాజశేఖర్రెడ్డే నిర్వహించారనే ఫిర్యాదులున్నాయి. వైకాపా ప్రభుత్వంలో కొన్నాళ్లు ఐటీ సలహాదారుగా పనిచేసిన ఈయన.. జగన్కు అత్యంత సన్నిహితుడు. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి, దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్ల అమ్మాలనేది ఈయన ఆదేశాల మేరకే జరిగేవన్న విమర్శలున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో భారీ కార్యాలయం ఏర్పాటుచేసుకుని ఈ దందా నడిపించినట్లు సమాచారం. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు, బ్రూవరీస్, ఇథనాల్ ప్లాంట్ల నుంచి ‘జే ట్యాక్స్’ వసూలు చేసేవారని తెదేపా శ్రేణులు చెబుతున్నాయి.
దందా అమలులో పాత్రధారులు సత్యప్రసాద్, శౌరి, వేణుగోపాల్
- ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీల బ్రాండ్లు, జే బ్రాండ్లకే ఆర్డర్లు లభించేలా చేయడంలో సత్యప్రసాద్దే ప్రధానపాత్ర అనే ఫిర్యాదులున్నాయి. కసిరెడ్డి ఆదేశాల మేరకు పనిచేస్తూ, వాటిని అమలు చేసేవారు. ఏపీఎస్బీసీఎల్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన చెప్పిన బ్రాండ్లే ప్రభుత్వ దుకాణాల్లో అమ్మేలా డిపో మేనేజర్లకు రోజూ ఆదేశాలిచ్చేవారన్న ఫిర్యాదులున్నాయి.
- ఎక్సైజ్ శాఖలో ఈఎస్గా ఉన్న శౌరి... సత్యప్రసాద్కు సహాయకుడిగా ఉంటూ మద్యం కొనుగోలు ఆర్డర్లు సిద్ధం చేయడంలో కీలకపాత్ర పోషించారనే ఫిర్యాదులున్నాయి.
- ఏసీఎస్బీసీఎల్లో జీఎంగా పదవీవిరమణ చేసి, తర్వాత వాసుదేవరెడ్డి వద్ద ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాల్ది ఈ దందాలో ప్రధానపాత్రని తెదేపా గుర్తించింది.
సచివాలయంలో కీలక అధికారి ప్రమేయం?
సచివాలయంలో కీలకంగా ఉన్న ఓ సీనియర్ ఉన్నతాధికారి... ఈ అక్రమాల్ని అడ్డుకోకుండా పరోక్షంగా సహకరించారన్న ఫిర్యాదులున్నాయి. అందుకు ప్రతిగా ఆయన తరఫున బినామీగా, కలెక్షన్ ఏజెంట్లుగా ఉండే ఓ వ్యక్తికి భారీగా సొమ్ములు అందాయని చెబుతున్నారు.
రూ.లక్ష కోట్లకు పైగా నగదు లావాదేవీలే
చిన్న చిల్లర దుకాణం వద్ద చూసినా డిజిటల్ లావాదేవీలు ఉంటాయి. కానీ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని నగదు రూపంలోనే అమ్మింది. గతేడాది ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టినా అది పేరుకే పరిమితమైంది. ఈ మొత్తం దందాలో వేలకోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ప్రభుత్వంలోని కీలక పెద్దకు అవినీతి సొత్తంతా చేరుతోందని, నల్లధనం పోగుపడుతోందన్న ఫిర్యాదులున్నాయి.
సీబీఐ, ఈడీ రంగంలోకి దిగితేనే..
ఆంధ్రప్రదేశ్లో మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా మొదలుకుని.. విక్రయాల వరకూ అన్నింటా వ్యవస్థీకృతంగా సాగించిన ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో సూత్రధారులుగా ఉన్న నేతలు, పాత్రధారులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలు, అధికారపార్టీ కీలక నాయకుల బినామీలు, సన్నిహితులుగా పేరొందిన వారి నివాసాలు, కార్యాలయాల్లో, అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల్లో ఎక్కడ సోదాలు చేసినా ఈ కుంభకోణం డొంక బయటపడుతుంది. వారిలో ఏ ఒక్కరిని విచారించినా గుట్టంతా వీడుతుంది. దిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్ కెమ్ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు, ఏపీఎస్బీసీఎల్ నుంచి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కు మధ్య విడదీయలేని అనుబంధముంది. ఈ కోణంలోనూ సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు