Ramoji Rao: పత్రికారంగంపై చెరగని సంతకం
ఈనాడు అంటే సామాన్యుడి అక్షరం.. ఈనాడు అంటే కార్మిక కిరణం.. ఈనాడు అంటే విద్యాదీప్తి.. ఇలా ఒకటేమిటి.. ‘ఈనాడు’ను ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే. దాని వెనుక ఓ వ్యక్తి కృషి, తపన, పట్టుదల ఉన్నాయి.. ఆయనే రామోజీరావు.
‘ఈనాడు’కు దశ.. దిశ రామోజీ..
ఆరంభం నుంచీ కొత్త పుంతలే..
ప్రజల గొంతుకగా అలుపెరగని ప్రస్థానం
ఈనాడు - హైదరాబాద్
ఈనాడు అంటే సామాన్యుడి అక్షరం.. ఈనాడు అంటే కార్మిక కిరణం.. ఈనాడు అంటే విద్యాదీప్తి.. ఇలా ఒకటేమిటి.. ‘ఈనాడు’ను ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే. దాని వెనుక ఓ వ్యక్తి కృషి, తపన, పట్టుదల ఉన్నాయి.. ఆయనే రామోజీరావు. దినపత్రిక రావాలంటే మధ్యాహ్నం వరకు వేచి చూసే పరిస్థితులున్న 70వ దశకంలో.. సూర్యోదయం కాక ముందే ఇంటి గుమ్మం ముందు పత్రికను అందించాలన్న ఆయన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నదే ఈనాడు. నాటి నుంచి నేటి వరకు ‘ఈనాడు’ వేసిన ప్రతి అడుగూ సంచలనమే. తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీ లిఖించుకున్నారాయన. అందుకే ఆయనను ‘మీడియా మొఘల్’ అని కీర్తిస్తారు.
ఆరంభమే సంచలనం
‘సూర్యోదయం తరువాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదు’.. ఇది రామోజీరావు గీసిన గీత. పత్రిక పంపిణీలో ఎదురయ్యే సవాళ్లకు ఈనాడు తొలి ప్రస్థానమే సమాధానం. రాష్ట్రానికి ఓ మూలన.. మరే పత్రికా లేని ప్రదేశమైన విశాఖపట్నంలో 1974 ఆగస్టు 10వ తేదీన పడిన తొలి అడుగు.. నేటికీ అనంతమై నిరంతరంగా, తరంతరంగా అలా సాగిపోతూనే ఉంది. ప్రారంభించిన నాలుగేళ్లకే అప్పటి అగ్రగామి పత్రిక ఆంధ్రప్రభ సర్క్యులేషన్ను దాటేసింది ఈనాడు! దినపత్రికల పంపిణీ వ్యవస్థకు ‘ఈనాడు’ వేసిన బాటే మిగిలిన పత్రికలకు దారిచూపింది. అప్పటి వరకు పత్రిక కావాలంటే విక్రయ కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఈ పద్ధతికి చరమగీతం పాడింది ఈనాడే. అంతకుముందు పత్రికలకు పల్లెల్లో ఏజెంట్లు ఉండేవారు కాదు. ఈ సరిహద్దు రేఖను ఈనాడు చెరిపేసింది. గిరులు, ఝరులు దాటి అడవులు, మారుమూల పల్లెల్లో సైతం రెక్కలు కట్టుకుని వాలిపోయింది. అప్పటి వరకు బస్సులు, రైళ్లు, తపాలా ద్వారా మాత్రమే సాగుతున్న పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చేసింది. సొంతంగా ప్రైవేటు రవాణా ఏర్పాటు చేసుకుని మరీ పత్రికను పంపిణీ చేసింది. ఇది పత్రికా ప్రపంచంలోనే పెను సంచలనం. తొలినాళ్లలో ఐదారు వేల కాపీలతో ప్రారంభమై.. ఆ తర్వాత కొన్నేళ్లలోనే తెలుగులోనే అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దినపత్రికగా అగ్రస్థానానికి చేరింది. యాభయ్యో పడిలోనూ ‘అగ్ర మకుటాన్ని’ సగర్వంగా నిలబెట్టుకోవడం వెనుక.. రామోజీరావు కొన్ని దశాబ్దాలపాటు శ్రమించి వేసిన పునాది రాళ్లున్నాయి.
రాజకీయ శక్తిగానూ..
‘ఈనాడు’ అంటే కేవలం వార్తలే కాదు.. తెలుగువారి ఆత్మగౌరవ పతాకగా నిలిచింది. 1978-83 మధ్య నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఏలిన కాంగ్రెస్ అధిష్ఠానం ఐదేళ్లలో నలుగురు ముఖ్యమంత్రుల్ని మార్చింది. ఆ సమయంలో తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని పరిరక్షించే కొత్త రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పత్రికగా తెలుగుదేశం పార్టీ రాకను ‘ఈనాడు’ హర్షించింది. అయితే వ్యక్తులకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. నియంతృత్వాన్ని ప్రతిఘటించడమే లక్ష్యంగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డామని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి చేస్తే ‘ఈనాడు’ అభినందిస్తుందని, తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని రామోజీరావు 1983 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తన సంపాదకీయంలో స్పష్టం చేశారు. దానికి తగ్గట్లే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను నిస్సంకోచంగా ఎండగట్టింది ఈనాడు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ‘ఈనాడు’ అక్షర యుద్ధం చేసింది. 2003లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పాదయాత్రకు విస్తృత కవరేజి ఇచ్చింది. తర్వాత కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాల్నీ బహిర్గతం చేసింది. 2019లో జగన్ పాదయాత్రకూ ‘ఈనాడు’ కవరేజి ఇచ్చింది. ఆయన అధికారంలోకి వచ్చాక జరిగిన అరాచకాలను ఎండగట్టి నవ్యాంధ్రలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు తనవంతు కృషి చేసింది.
మహిళలకు, పిల్లలకు ప్రత్యేక పేజీలు
మహిళల కోసం ప్రత్యేక పేజీ ఉండాలన్న ఉద్దేశంతో 1992 సెప్టెంబరు 24న ‘వసుంధర’ను ప్రారంభించింది ఈనాడు. ఆ తరువాతి కాలంలో దాదాపు అన్ని ప్రాంతీయ పత్రికలూ మహిళా అనుబంధాల్ని ప్రారంభించాయి. 2002 జులై 17న ఈనాడు ప్రస్థానంలో మరో మైలురాయి చేరింది. తెలుగు పాఠకులకు వరంగా ఇంధ్ర ధనుస్సు వంటి ఏడు ప్రత్యేక పేజీలు ప్రారంభమయ్యాయి. విజ్ఞానం, ఆరోగ్యం, క్రీడలు, సాంకేతిక విజ్ఞానం, బాలల వినోదం వంటి అంశాలతో ఏడు ప్రత్యేక పేజీలుగా ఇవ్వడం ఈనాడు సృష్టించిన వినూత్న సమాచార విప్లవం. చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈ-నాడు, సిరి, ఈతరం, హాయ్బుజ్జీ పేజీలకు ‘ఈనాడు’ శ్రీకారం చుట్టింది. ఇతర పత్రికలకు స్ఫూర్తిగా నిలిచింది.
అక్షరాలే అస్త్రాలై..
‘ఈనాడు’ అక్షరయాత్రలో మరో సంచలనం పరిశోధనాత్మక పాత్రికేయం. ప్రజల పక్షపాతిగా నిరుపేదలు, బడుగు బలహీనవర్గాల ఆయుధంగా ప్రచురించిన అనేక వార్తలు ప్రజాధన దుర్వినియోగాన్ని గట్టిగా ఎండగట్టాయి. అభాగ్యులకు ఆర్థికసాయం అందేలా చేశాయి. అక్షరాలే అస్త్రాలుగా అనేక సామాజిక ఉద్యమాల్నీ ముందుకు నడిపింది ఈనాడు. 1992లో నెల్లూరు జిల్లా దూబగుంటలో సారాపై కన్నెర్ర చేసిన మహిళలకు బాసటగా నిలిచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిన ఉద్యమానికి ఊతమిచ్చింది. 1995లో ఈనాడు చేపట్టిన శ్రమదానోద్యమం ఊళ్లకు ఊళ్లను భాగస్వాముల్ని చేసింది. తుపానుల సమయంలో సంస్థ రిలీఫ్ ఫండ్ ప్రకటించడం, పాఠకులు కూడా బాధితులకు ఆపన్నహస్తం అందించేలా ప్రోత్సహించడం, ఆ వచ్చిన మొత్తంతో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా.. తుపాను బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడంలో ‘ఈనాడు’ కీలక భూమిక పోషించింది.
సాంకేతికంగానూ..
సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనూ ఈనాడు ముందుంది. తెలుగు దినపత్రికలన్నింటికన్నా ముందే 1999లో ఈనాడు.నెట్ ద్వారా ఆన్లైన్ పాఠకులకు చేరువైంది. ఈటీవీ రూపంలో ఎలక్ట్రానిక్ మీడియాలోనూ అడుగుపెట్టిన రామోజీరావు.. ‘ఈటీవీ2’ పేరుతో 24 గంటల వార్తా ప్రసారాలకూ శ్రీకారం చుట్టారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ బాలభారత్, ఈటీవీ ఆధ్యాత్మిక ఛానళ్లను ప్రారంభించారు. 2000 ఏప్రిల్లో ఈటీవీ బంగ్లా, మూడు నెలల్లోనే మరాఠీ ఛానళ్లు మొగ్గతొడిగాయి. మరో ఐదు నెలలకు ఈటీవీ కన్నడకస్తూరి పరిమళాలు వ్యాపించాయి. 2001 ఆగస్టు నుంచి ఈటీవీ ఉర్దూ ప్రసారాలూ మొదలయ్యాయి. 2002 జనవరిలో ఒకేరోజు ఆరు ఛానళ్లను ప్రారంభించి సంచలనం సృష్టించారు. డిజిటల్ రంగంలో ఈటీవీ భారత్ను ఆరంభించారు. ఈటీవీ విన్ ఓటీటీ యాప్ ద్వారా ఉత్కంఠ రేపే వెబ్సిరీస్లు, అనేక చిత్రరాజాలు అందిస్తున్నారు.
కార్మికుడితో స్విచ్ ఆన్..
హంగూ ఆర్భాటం లేకుండా ఒక సాధారణ కార్మికుడే స్విచ్ఆన్ చేసి ‘ఈనాడు’ను ప్రారంభించారు. వ్యవహారిక భాషలో వార్తల రచన, ఏ రోజు వార్తలు ఆ రోజే అన్న సూత్రాన్ని మొదటి నుంచీ ఈనాడు పాటించటంతో ప్రజా బాహుళ్యంలో విశేషమైన ఆదరణ లభించింది. గ్రామీణ, స్థానిక వార్తలకు చోటు కల్పించడంతో ప్రజల పత్రికగా ‘ఈనాడు’ రూపాంతరం చెందింది. వ్యవసాయ వార్తలకు ప్రాధాన్యమిచ్చి ప్రచురించడంతో ‘ఈనాడు’ను రైతు పక్షపాతిగా ప్రజలు ఆదరించారు. డెయిలీ సీరియల్స్ను పత్రికలో ప్రచురించడం ప్రవేశపెట్టిందీ ఈనాడే. అభ్యుదయ రచనలకు ఆటపట్టుగా మారడమే కాదు. ప్రజల అవసరాలకు విలేకరులే వెళ్లి వార్తా సేకరణ చేసేలా జర్నలిజానికి కొత్త అర్థం చెప్పిందీ ఈనాడు మాత్రమే.
అవార్డులు
జర్నలిజంలో విలువలను పెంచడంతో పాటు, ఉన్నత ప్రమాణాలను నిలబెట్టే ప్రముఖులకు ఇచ్చే బి.డి.గోయెంకా అవార్డును 2001లో రామోజీరావు అందుకున్నారు. జర్నలిజం, సాహిత్యం, విద్యలో ఆయన అందించిన సేవలకు పద్మభూషణ్, పద్మ విభూషణ్ వరించాయి. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్గా కూడా రామోజీరావు పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం