MLC Kavitha: కవిత అరెస్టు
సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, భారాస ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం అరెస్ట్ చేసింది.
దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ
రూ.100 కోట్ల హవాలా లావాదేవీలపై విచారణ
అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలమే కీలకం
ఈనాడు, హైదరాబాద్: సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, భారాస ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. దిల్లీ నుంచి మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత నివాసానికి చేరుకున్న 12 మంది సభ్యుల ఈడీ బృందం సుమారు 4 గంటలపాటు ఇంట్లోనే ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉండగా.. ఆమె నివాసానికి భారాస శ్రేణులు పెద్దఎత్తున చేరుకొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగానే కవితకు నోటీస్ జారీ చేస్తారా? లేక అరెస్ట్ చేస్తారా అనే అంశంపై సాయంత్రం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈడీ అధికారులు కవిత ఇంట్లోకి రాగానే సెర్చ్ వారెంట్ చూపించారు. ఇంట్లో సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆమెను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రం 5.20 గంటల సమయంలో అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ ఆమెకు 14 పేజీల నివేదిక ఇచ్చారు. ఆమె నుంచి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ సమాచారాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి కూడా ఇచ్చారు.
నిందితురాలి సోదరుడినని...
ఈడీ అధికారులు నిర్వహించిన పంచనామాలో పరోక్షంగా కేటీఆర్పై ఆరోపణలు చేశారు. ‘సాయంత్రం 6 గంటల సమయంలో నిందితురాలి సోదరుడినని, లాయర్లమని చెబుతూ దాదాపు 20 మంది బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. మా విధులకు ఆటంకం కలిగించారు’ అని పంచనామాలో పేర్కొన్నారు.
కేటీఆర్ వాగ్వాదం..
అరెస్టు సమాచారం తెలియగానే సాయంత్రం ఆరు గంటల సమయంలో భారాస నేతలు కేటీఆర్, హరీశ్రావులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. గేటు వేసి ఉండటంతో చాలాసేపు వారు బయటే ఉన్నారు. అప్పటికే పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్, హరీశ్రావులను లోనికి అనుమతించకపోవడంతో పోలీసులతో భారాస శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. తర్వాత వారిని లోనికి అనుమతించారు. ఈడీ అధికారులతో కవిత సోదరుడు కూడా అయిన కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ‘అరెస్ట్ చేయబోమంటూ సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చి ఇప్పుడెలా అరెస్ట్ చేస్తారు? మాట తప్పుతున్నందున కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది’ అని ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియా మీనాకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాన్సిట్ వారంట్ లేకుండా దిల్లీ ఎలా తరలిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కావాలనే శుక్రవారం వచ్చారని ఆక్షేపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి ఎందుకు రానివ్వరని ఈడీ అధికారులపై ఆయన మండిపడ్డారు. అనంతరం బయటికి వచ్చిన కేటీఆర్, హరీశ్రావు... కార్యకర్తలకు సంయమనం పాటించాలని సూచించారు. కవితను తరలిస్తున్న సమయంలో అక్కడ భావోద్వేగాలు పెల్లుబికాయి. మెట్లు దిగి వస్తూ ఆమె తన కుమారుడిని హత్తుకున్నారు. భర్త అనిల్ ఆమెను ఓదార్చారు. కేటీఆర్, హరీశ్రావు, కుటుంబసభ్యులు, పార్టీ నేతలు ఆమెకు ధైర్యం చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్న అభిమానులకు చేయి ఊపుతూ కారులో వెళ్లిపోయారు.
సొంత కార్లోనే
కవితను దిల్లీ తరలించేందుకు ఈడీ అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లే విమానంలో ముందుగానే సీట్లు బుక్ చేసుకున్నారు. కవితను అరెస్టు చేసి దిల్లీ తీసుకెళుతున్నామని, ఇందుకు సహకరించాలని బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆమెను విమానాశ్రయానికి తరలించేందుకు బంజారాహిల్స్ పోలీసులు వాహనాన్ని తీసుకురాగా కవిత తన వాహనంలోనే వస్తానని చెప్పడంతో ఈడీ అధికారులు అంగీకరించారు.
ఇంటి వద్ద ఉద్రిక్తత
అరెస్టు సందర్భంగా కవిత ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాస్తవానికి 1.30 గంటల సమయంలోనే ఈడీ అధికారులు ఆమె ఇంటికి చేరుకున్నప్పటికీ చాలాసేపటి వరకూ ఈ విషయం బయటకు పొక్కలేదు. సాయంత్రం 4 గంటల తర్వాత కార్యకర్తలు రావడం మొదలుపెట్టారు. అరెస్టయినట్లు టీవీలో ప్రసారం కాగానే భారాస నాయకులు ప్రశాంత్రెడ్డి, బాల్క సుమన్, బాజిరెడ్డి గోవర్ధన్, కేకే తదితరులు వచ్చారు. అప్పటి వరకూ నలుగురైదుగురు పోలీసులు మాత్రమే అక్కడ విధుల్లో ఉన్నారు. కానీ కార్యకర్తలు పెరుగుతుండటం, వచ్చిన వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారింది. దాంతో బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి అక్కడకు చేరుకున్నారు. పెద్దసంఖ్యలో పోలీసులను, రోప్ పార్టీని పిలిపించారు. నేతలు ఒక్కొక్కరు వస్తుండటంతో కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. 7 గంటల సమయంలో డీసీపీ విజయ్కుమార్ కూడా వచ్చారు. కవితను అరెస్టు చేసి బయటకు తీసుకొస్తున్న సమయంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వాహనాలను ముందుకు కదలనీయకుండా చేయడంతో పోలీసులు అందర్నీ పక్కకు నెట్టేశారు. స్వల్పంగా లాఠీఛార్జి చేయడంతో చాలామంది కింద పడిపోయారు. చివరకు 7.30 గంటల ప్రాంతంలో కవితను అక్కడ నుంచి తరలించారు.
శంషాబాద్ విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె భర్త అనిల్, పలువురు కార్యకర్తలు కూడా విమానాశ్రయానికి వెళ్లారు.
ఇదీ నేపథ్యం
దిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు దిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరఫున రూ.కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ నివేదికలో అతడిని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా రూ.100కోట్ల ముడుపులు ఆప్కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గతేడాది మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్టు చేసింది.
కోర్టులోనే తేల్చుకుంటాం: కవిత న్యాయవాదులు
కవితపై కఠిన చర్యలు తీసుకోమని స్వయంగా ఈడీనే న్యాయస్థానంలో అఫిడవిట్ ఇచ్చి, ఇప్పుడు అదే దాన్ని ఉల్లంఘించిందని కవిత న్యాయవాదులు చెబుతున్నారు. ఈడీ అధికారులు మాత్రం దాన్ని ఖండిస్తున్నారు. అప్పట్లో సమన్లు వాయిదా వేస్తామని మాత్రమే చెప్పామని, అందులో అరెస్టు ప్రస్తావన లేదన్నది వారి వాదన. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని కవిత న్యాయవాదులు చెబుతున్నారు.
అణచివేతలను ఎదుర్కొంటాం: కవిత
భారాస శ్రేణులు మనోధైర్యంతో ఉండాలి. ఇలాంటి అణచివేతలను, దొంగ కేసులను, రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొంటాం. చట్టంపై నమ్మకం ఉంది.
కవిత కేసు విచారణ 19కి వాయిదా
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలుచేసిన కేసు విచారణ సుప్రీంకోర్టులో ఈనెల 19కి వాయిదా పడింది. ఈమేరకు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్మిత్తల్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కేసుతోపాటు ఇది కూడా లిస్ట్ అయింది. విచారణ ప్రారంభమైన వెంటనే కవిత తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ విక్రమ్ చౌధరి వాదనలు ప్రారంభిస్తూ... విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ త్రివేది ఈనెల 19వ తేదీకి వాయిదా వేయగా.. న్యాయవాది 20వ తేదీకి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ఆయన పదేపదే అదే విజ్ఞప్తిచేయడంతో న్యాయమూర్తి జస్టిస్ త్రివేది తీవ్రంగా స్పందించారు. అలాగైతే మీకిచ్చిన మధ్యంతర ఉపశమనాలను ఉపసంహరిస్తామని హెచ్చరించారు. వాస్తవంగా ఈకేసు ఈనెల 13న రావాల్సి ఉందని, అయితే ఆరోజు మీరు (జస్టిస్ బేలా త్రివేది) ప్రత్యేక ధర్మాసనంలో ఉన్నందున అది విచారణకు రాలేదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈరోజు విచారిస్తే తేడా ఏమొస్తుందని న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించగా... అందుకు న్యాయవాది బదులిస్తూ దీన్ని నాన్మిసిలేనియస్డేన (సుదీర్ఘ వాదనలు వినిపించే అవకాశం ఉన్న రోజున) లిస్ట్ చేశారని, అందువల్ల 20కి వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి అంగీకరించలేదు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీరాజు స్పందిస్తూ ఇలా వాయిదాలు కోరడం సరికాదన్నారు. విచారణకు పిలిచే ముందు పదిరోజుల సమయం ఇస్తామని ఇదివరకు చెప్పామని, పదేపదే వాయిదాలు కోరితే దాన్ని ఉపసంహరించుకుంటామని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అలాగే వారికి ఎలాంటి ఉపశమనాలు లేవని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్