Nutrient food: మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి.
సమతుల ఆహారమే మేలు
ఇంటి వంటల్లోనూ జాగ్రత్తలు అవసరం
భోజనానికి గంట ముందు నుంచి గంట తర్వాత వరకు కాఫీ, టీ తాగొద్దు
కండరాల వృద్ధికి మితిమీరిన ప్రొటీన్ పౌడర్ల వాడకం హానికరం
మితంగానే కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు వాడకం మేలు
ఎన్ఐఎన్ కొత్త మార్గదర్శకాలు
ఈనాడు, అమరావతి
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. జంక్ఫుడ్స్, వ్యాయామం లేకపోవడం.. భోజనం, నిద్ర విషయాలలో సమయాలను పాటించకపోవడం వల్ల వ్యాధులు పెరుగుతున్నాయి. 56 శాతం రోగాలకు అనారోగ్యకర ఆహారమే కారణమని పరిశోధకులు గుర్తించారు. మంచి ఆరోగ్యం కోసం ఏం తినాలి? ఎప్పుడు తినాలి? వంటి అంశాలను ‘డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్’ (భారతీయులకు ఆహార సంబంధిత మార్గదర్శక సూత్రాలు) పేరుతో తాజాగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) విడుదల చేసింది.
పోషకాహారంతోనే దీర్ఘకాల వ్యాధులకు దూరం
పోషకాహారం, శారీరక వ్యాయామంతో హృద్రోగాలు, బీపీ, ఇతర ముప్పులను తగ్గించుకోవచ్చు. ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (చిప్స్, బర్గర్లు, పిజ్జా, కూల్డ్రింక్స్ తదితరాలు) విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సన్నగా ఉన్నవారు శరీర బరువు పెంపునకు ప్రొటీన్ సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవద్దు. వైద్యుల సూచనలు పాటించకుండా ప్రొటీన్ పౌడర్లను వాడితే మూత్రపిండాల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదమూ ఉంది. ఎముకల్లోని మినరల్స్ తగ్గుతాయి. ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గిస్తూ నూనెను పరిమితంగా తీసుకుంటూ జంక్ఫుడ్కు దూరంగా ఉండాలి.
కూరగాయలు, పండ్లు తప్పనిసరి
పోషకాహారం వల్ల అన్ని వయస్కులవారికి వ్యాధుల ముప్పు తప్పుతుంది. ‘మై ప్లేట్ ఫర్ డే’ కింద ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో కనీసం 8 రకాల ఆహార పదార్థాలు ఉండాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇతరాలు కలిపి 500 గ్రాముల వరకు ఉండాలి. ఇందులో అందుబాటులో ఉండే పండ్లు వంద గ్రాములు తప్పకుండా ఉంటే మంచిది.
లావు పెరిగితే కష్టాలే
లావు పెరుగుతున్న కొద్దీ శారీరక, మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయి. దీనివల్ల టైప్-2 మధుమేహం, కాలేయ వ్యాధి, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్లు వస్తున్నాయి. అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉండే అల్ట్రాప్రాసెస్డ్ ఆహారం (చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, కూల్డ్రింక్స్) తగ్గించాలి.
ఫ్రూట్జ్యూస్ల్లో పది శాతమే పండ్ల గుజ్జు ఉండే అవకాశముంది. కొందరు తయారీదారులు 2,3 సహజసిద్ధమైన పదార్థాలను వాడి నేచురల్ ఫుడ్ అంటూ ముద్రిస్తున్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలి. పండ్లను నేరుగా తినడం మంచిది. పొటాషియం, కాల్షియాన్ని అందించే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. తీపి దృష్ట్యా చెరకు రసం మితిమీరి తాగకూడదు. కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండడం మంచిది.
పరిమితంగా ప్రొటీన్ సప్లిమెంట్ల వాడకం
ప్రొటీన్ సప్లిమెంట్ల బదులు కోడిగుడ్లు, పాలు, సోయాబీన్స్, బఠానీలు తీసుకోవాలి. ప్రొటీన్ పౌడర్లలో చక్కెర, కేలరీలు లేని స్వీటెనర్లు కలుపుతున్నారు. ఇందులోని కృత్రిమరుచికి ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. రోజుకు 25 గ్రాములలోపే చక్కెర తీసుకోవాలి. అసలు తీసుకోకపోయినా ఫరవాలేదు. మనం తీసుకునే ఆహారంలో షుగర్ అంతర్గతంగా ఉంటుంది.
సమతుల ఆహారమే ఆరోగ్య సూత్రం
సమతుల ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు సమృద్ధిగా ఉండాలి. దుంపలు, పిండిపదార్థాలు తగ్గించాలి. రోజుకు 250 గ్రాముల ధాన్యాలు తీసుకోవాలి. ఇందులో బియ్యం ఒకటే కాకుండా చిరుధాన్యాలు కలిసి ఉంటే మంచిది. పప్పుదినుసుల వల్ల ప్రొటీన్లు ఎక్కువగా లభించే అవకాశముంది. మంచి కొవ్వు కోసం రోజుకు కుదిరితే 25 నుంచి 35 గ్రాముల నూనెగింజలు (వేరుసెనగ, గుమ్మడి గింజలు, బాదం వంటివి) తీసుకుంటే మంచిది. బరువు పెరగకుండా చూసుకోవాలి.
ఆహారంలో భాగం కావాల్సినవి
స్నాక్స్.. పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్ఫుడ్ ఇలా ఏది నచ్చితే అది తినేస్తున్నారు. కొవిడ్ అనంతరం డ్రైఫ్రూట్స్ రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్న వారి సంఖ్యా పెరిగింది. వీటన్నింటివల్ల జిహ్వచాపల్యం తీరినప్పటికీ పూర్తి పోషకాలు అందడం లేదు. రోజుకు సుమారు రెండు వేల కేలరీలు శరీరానికి అందాలని అనుకుంటే 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు, 85 గ్రాముల పప్పులు లేదా మాంసం లేదా కోడిగుడ్డు, 35 గ్రాముల పప్పుగింజలు, 27 గ్రాముల కొవ్వు పదార్థాలు లేదా నూనెను తీసుకోవాలి. అన్నం, కూర, పప్పు, పెరుగు వంటివాటికే పరిమితం కాకుండా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు రోజూ తప్పనిసరి చేసుకోవాలి. చక్కెరల ద్వారా అందే కేలరీలు 5%లోపే ఉండాలి.
అతిగా టీ, కాఫీలు వద్దు
ఆరోగ్య రక్షణకు తగినంత నీరు తాగాలి. టీ, కాఫీల్లో కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే కెఫీన్ ఉంటుంది. ఇది అలవాటు పడేలా చేస్తుంది. కప్పు కాఫీలో 80-120 మి.గ్రా.కెఫీన్ ఉంటుంది. ఇన్స్టంట్ కాఫీలో 50-65 మి.గ్రా., టీలో 30-65 మి.గ్రా.కెఫీన్ ఉంటుంది. రోజుకు 300.మి.గ్రా.కు మించి కెఫీన్ తీసుకోకూడదు. మితిమీరి కాఫీ తాగితే రక్తపోటు సమస్య వస్తుంది. అలాగే కాఫీ, టీల్లో ఉండే టానిన్- ఆహారంలోని ఇనుమును మన శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. ఐరన్ లోపిస్తే రక్తహీనత, నీరసం, ఆయాసం, గుండెదడ, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి భోజనానికి గంట ముందు, గంట తరువాత టీ, కాఫీలు తాగకూడదు. పాలు లేని గ్రీన్, బ్లాక్ టీ తాగడం ఉత్తమం.
మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు
- ఇంట్లో తయారు చేసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. వంటకు ముందు ఆహార పదార్థాలు శుభ్రం చేయడం, పూర్తి స్థాయిలో ఉడికించడంలో నిర్లక్ష్యం వద్దు. అధికంగా నూనెలు, కొవ్వు, తీపి, ఉప్పు వాడొద్దు.
- శరీర బరువు నిదానంగా తగ్గాలి. దూకుడుగా తగ్గేందుకు ప్రయత్నిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- అయోడైజ్డ్ సాల్ట్ మంచిది. ఉప్పు వాడకం పెరిగితే రక్తపోటు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశముంది.
- సాధారణంగా వ్యక్తి రోజుకు 8 గ్లాసులు (సుమారు రెండు లీటర్లు) నీళ్లు తాగాలి.
- తగినంత బరువు ఉన్న గర్భిణులు గర్భ సమయంలో సమతుల ఆహారం తీసుకుని 10-12 కిలోల బరువు పెరగాలి. స్వతహాగా బరువు ఎక్కువ ఉన్నవారు 5-9కిలోల వరకు పెరగొచ్చు. గర్భిణి తగినంత బరువుంటే పిల్లలు ఆరోగ్యంగా వృద్ధి చెందుతారు.
- శిశువు పుట్టిన 6 నెలల వరకు తప్పనిసరిగా తల్లిపాలే ఇవ్వాలి. ఇది శిశువు పెరుగుదలకు, తల్లి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగకరం. బిడ్డకు రెండేళ్ల వరకు తల్లి పాలు ఇవ్వొచ్చు. పిల్లలకు అధిక మోతాదుల్లో తినడం అలవాటు చేయకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!