Nimmagadda: రాష్ట్రాన్ని ఓటుతో నిలబెట్టిన ప్రజలు
రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి సార్వత్రిక ఎన్నికల్లో తమ హక్కును వినియోగించుకున్నారని, ఎవరి ఊహకు అందని విధంగా 82 శాతం పోలింగ్ నమోదుకావడం సాధారణ విషయం కాదని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సెక్రటరీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు.
ఎన్నికల నిర్వహణలో యంత్రాంగం విఫలం
రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ
మాట్లాడుతున్న నిమ్మగడ్డ రమేశ్కుమార్. వేదికపై సమరం, పి.వి.రమేశ్ తదితరులు
ఈనాడు, అమరావతి- న్యూస్టుడే, విజయవాడ సిటీ: రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి సార్వత్రిక ఎన్నికల్లో తమ హక్కును వినియోగించుకున్నారని, ఎవరి ఊహకు అందని విధంగా 82 శాతం పోలింగ్ నమోదుకావడం సాధారణ విషయం కాదని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సెక్రటరీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగేలా తమవంతు ప్రయత్నం చేసిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ బృందానికి ఆత్మీయ అభినందన సభ విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రమేశ్కుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం అగాథంలో పడిపోయిందని, దానిని తిరిగి ఈ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ప్రజలే పైకి తీసుకొచ్చారని అన్నారు. ‘ఓటర్లు గంటల తరబడి పోలింగ్ కేంద్రాల్లో వేచి ఉండేలా చేయడం ఎన్నికల సంఘం వైఫల్యమే. ఎన్నికలకు ముందు, తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను అదుపు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు, ఆధారాలు బయటకొచ్చినా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు.? పైగా.. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. వాస్తవంగా అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉండే రాయలసీమ, మాచర్ల ప్రాంతాల్లో భద్రతపై దృష్టిపెట్టలేదు. నిర్వహణ విషయంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారు. జగన్ ప్రభుత్వం చెప్పిన దానికి ఆయన తల ఊపుతూ వచ్చారు. ఇప్పటికైనా జరిగిన లోటుపాట్లను పరిశీలించుకొని.. ఎక్కడ వైఫల్యం జరిగిందో తెలుసుకుని పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని రమేశ్కుమార్ సూచించారు.
వైకాపాది బందిపోటు పాలన..
జగన్ హయాంలో బందిపోటు పాలన సాగిందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.వి.రమేశ్ మండిపడ్డారు. ప్రజలకు డబ్బులు పంచితే సరిపోతుందని, ఐదేళ్లూ ఓట్లు కొని ఎన్నికల్లో లాభపడొచ్చని భావించిన వైకాపాకు ఓటర్లు సరైన గుణపాఠం చెప్పారన్నారు. ‘భూ ఆక్రమణలు, ఇసుక, గనులు సహా అన్నింటినీ ప్రైవేటు పరం చేశారు. 2019 నాటికి ప్రభుత్వానికి రాబడులు రూ.54 వేల కోట్లు వచ్చేది. ఈ ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రజల ఆదాయం పెంచేందుకు ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. ప్రభుత్వ ఆదాయం పెంచకపోగా.. ఖర్చులు భారీగా పెంచేశారు. అభివృద్ధికి అవసరమైన రహదారులు, నీటి ప్రాజెక్టులు ఆపేశారు. ఫలితంగా పూర్తిగా రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అప్పులు చేశారు. చాలా ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా అమ్మేశారు. తాకట్టు పెట్టేశారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.13 లక్షల కోట్ల వరకు ఉంది. విధ్వంసకర ఆర్థిక వ్యవస్థను రాష్ట్రంలో నెలకొల్పారు. ఇప్పుడు దానంతటినీ పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముంది’ అని పి.వి.రమేష్కుమార్ పేర్కొన్నారు. ‘విధ్వంసం’ పుస్తక రచయిత ఆలపాటి సురేష్కుమార్ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించిందని, అన్ని వ్యవస్థలనూ నాశనం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో జి.ఆర్.కె- పోలవరపు సాంస్కృతిక సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, డాక్టర్ జి.సమరం, ఎం.సి.దాస్, జంధ్యాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ‘ఈనాడు’ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల