AP High Court: పిన్నెల్లి రోజూ ఎస్పీ కార్యాలయంలో హాజరుకావాలి
పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో అరెస్టు నుంచి జూన్ 6 వరకు రక్షణ కల్పిస్తూ మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
పాస్పోర్టు కోర్టులో అప్పగించాలి..
నరసరావుపేటలోనే ఉండాలి..
సాక్షులను కలవడానికి వీల్లేదు
మాచర్ల ఎమ్మెల్యేకు హైకోర్టు ఆంక్షలు
జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు
ఆయనపై నిఘా ఉంచాలని సీఈఓకు ఆదేశం
ఈనాడు, అమరావతి: పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో అరెస్టు నుంచి జూన్ 6 వరకు రక్షణ కల్పిస్తూ మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అరెస్టుతోపాటు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అయితే ఎమ్మెల్యే పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోపు హాజరు కావాలని స్పష్టం చేసింది. నరసరావుపేట దాటి వెళ్లొద్దని, ఆ ఊళ్లో ఎక్కడ ఉంటున్నారో పల్నాడు ఎస్పీకి తెలియజేయాలని ఆదేశించింది. పాస్పోర్టు అప్పగించాలని, దేశం దాటి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘిస్తే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది.
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై హత్యాయత్నం, తనను నిలదీసిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను తీవ్రంగా దుర్భాషలాడటం, పోలింగ్ మరుసటిరోజు తన సోదరుడు, అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరచడం వంటి ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని బాధితులు, పోలీసులు, బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వద్దని బాధితుల తరఫు న్యాయవాదులు వాదించగా.. ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందని, ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిన్నెల్లి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. సోమవారం వాదనలు ముగిశాయి. పిన్నెల్లికి అరెస్టు నుంచి జూన్ 6 వరకు రక్షణ కల్పిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
షరతులు ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు
- పిన్నెల్లి కదలికలపై పోలీసు అధికారులతో పూర్తిస్థాయిలో నిఘా ఉంచేలా ఉత్తర్వులు జారీచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ని హైకోర్టు ఆదేశించింది.
- ఏ విధమైన నేరకార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని, నేర ఘటనలను పునరావృతం చేయవద్దని తేల్చిచెప్పింది.
- జిల్లాలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించొద్దని పిన్నెల్లికి స్పష్టం చేసింది.
- అనుచరులను నియంత్రించే బాధ్యత, ఆ ప్రాంతంలో ప్రశాంతతకు, బాధితులకు ఏ విధమైన అవరోధాలు కలిగించే ప్రయత్నాలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదేనని తెల్చిచెప్పింది.
- ఈ కేసులకు సంబంధించి తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడవద్దని స్పష్టం చేసింది. బాధితులను/సాక్షులను కలవడానికి వీల్లేదంది. వారిని ప్రభావితం, భయపెట్టడం చేయవద్దని ఆదేశించింది.
- పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన నరసరావుపేటలో మాత్రమే ఉండాలని పిన్నెల్లికి తేల్చిచెప్పింది. ఓట్ల లెక్కింపు కేంద్రం మరోచోట ఉన్నట్లయితే.. లెక్కింపు రోజు మాత్రమే అక్కడికి వెళ్లవచ్చంది.
- గురజాల మేజిస్ట్రేట్ కోర్టులో పాస్పోర్టును అప్పగించాలని పిన్నెల్లిని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లొద్దంది.
- బాధితులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వారికి రక్షణగా గస్తీ ఏర్పాటు చేయాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది.
ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాల్సిందే
ఏడేళ్లకు పైబడి శిక్షపడేందుకు వీలున్న ఐపీసీ సెక్షన్ 307 (హత్యాయత్నం) కేసుల్లో ఎన్నికల్లో పాల్గొన్న పలువురు అభ్యర్థులకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇదే న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిందని న్యాయమూర్తి గుర్తుచేశారు. అదే సూత్రం పిటిషనర్కు వర్తిస్తుందన్నారు. ఎన్నికల బరిలో ఉన్నవారు/ప్రజాప్రతినిధులు చాలా బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ‘న్యాయచక్రాలు నెమ్మదిగా తిరుగుతుండొచ్చు కానీ.. సక్రమంగా తిరుగుతాయి’ అని సుప్రీంకోర్టు ఓ కేసులో ఉటంకించిన విషయాన్ని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. కౌంటర్ వేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను జూన్ 6కి వాయిదా వేశారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి స్పందిస్తూ.. ఎస్పీ ముందు హాజరుకావాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఓట్ల లెక్కింపు రోజు (జూన్ 4)న ఆర్వో ముందు హాజరయ్యేలా సవరించాలని కోరగా ఆ ఒక్కరోజుకు కోర్టు వెసులుబాటు ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు