Polavaram: పరిహారం అందక.. పురుగుమందే శరణ్యమని!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆస్తులు త్యాగం చేసినా.. ఆయన్ను ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి అధికారులు అనర్హుడిగా తేల్చారు. తాను ఏం పాపం చేశానంటూ కార్యాలయాల చుట్టూ తిరిగినా.. జగన్ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదు.
పోలవరం నిర్వాసిత రైతు ఆత్మహత్యాయత్నం
ధవళేశ్వరంలోని ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయం వద్ద ఘటన
ఏళ్ల తరబడి తిరిగినా.. ఫలితం లేక వేదన చెందిన వృద్ధుడు
ఒక్క దేవీపట్నం మండలంలోనే 1,100 మందికి పైగా బాధితులు
ధవళేశ్వరంలోని పోలవరం పరిపాలనాధికారి కార్యాలయ ఆవరణలో పురుగుమందు తాగిన రైతు సీతారామయ్య
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే, ధవళేశ్వరం, దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆస్తులు త్యాగం చేసినా.. ఆయన్ను ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి అధికారులు అనర్హుడిగా తేల్చారు. తాను ఏం పాపం చేశానంటూ కార్యాలయాల చుట్టూ తిరిగినా.. జగన్ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదు. విసిగిపోయిన ఆ వృద్ధ రైతు శుక్రవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. తరువాత అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంకు చెందిన ఉండమట్ల సీతారామయ్య (75)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలవరం నిర్మాణం కోసం వీరి ఇల్లు, భూమి కోల్పోగా పరిహారం వచ్చింది. కొంత భూమికి సంబంధించి నష్టపరిహారం విషయంలో వివాదం తలెత్తడంతో అది న్యాయస్థానంలో ఉంది. మరోవైపు సీతారామయ్య పెద్ద కుమారుడు నాగేశ్వరరావుకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ మంజూరైనా.. మరో కుమారుడిని మాత్రం అనర్హుడిగా పేర్కొన్నారు. ఇదెక్కడి న్యాయమని వాపోయినా.. సమాధానం చెప్పేవారు కరవయ్యారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం సీతారామయ్యకు రూ.6.36 లక్షలు, 5 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణం చేసి అప్పగించాల్సి ఉన్నప్పటికీ అవేవీ దక్కలేదు. రాజమహేంద్రవరంలో కుమారుడు నాగేశ్వరరావు వద్ద ఉన్న సీతారామయ్య శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరి ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడి పరిపాలనాధికారి (అడ్మినిస్ట్రేటర్) సెలవులో ఉండటంతో ఏవో అర్జునరావును కలిసి వినతి అందజేశారు. ఆరేళ్లుగా తిరుగుతున్నా, తమకు న్యాయం జరగ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడివారు పునరావాస ప్యాకేజీ ఫైలు రంపచోడవరం సబ్ కలెక్టరు వద్ద పెండింగ్లో ఉందని కొంత దురుసుగా సమాధానం చెప్పినట్లు సమాచారం. దీంతో సీతారామయ్య మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి బయటకు వెళ్లిన ఆయన అరగంట తర్వాత తిరిగొచ్చి.. ఆ కార్యాలయం గడప మీదే శీతలపానీయంలో పురుగుమందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సిబ్బంది 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలోని పునరావాస విభాగంలో విధులు నిర్వర్తించే డిప్యూటీ తహసీల్దార్లు వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. స్పెషల్ కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు సైతం రాలేదు.
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు
వాట్సప్ గ్రూపులో చూసి తెలుసుకున్నా..
పరిహారం కోసం తన తండ్రి ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని సీతారామయ్య కుమారుడు నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కార్యాలయానికి వెళ్లిన ఆయన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తమ గ్రామ వాట్సప్ గ్రూపులో ఎవరో పెడితే తమకు తెలిసిందన్నారు. అక్కడి అధికారులు, సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు తప్ప.. తమకు సమాచారం ఇవ్వలేదని కన్నీటిపర్యంతమయ్యారు.
ప్యాకేజీ కోసం ఎన్నాళ్లీ పోరాటం?
దేవీపట్నం మండలంలోని 44 ముంపు గ్రామాలకు చెందిన సుమారు 1,100 మందికి పైగా పోలవరం నిర్వాసితులను అనర్హులుగా గుర్తించడంతో పరిహారం కోసం వారు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మూడేళ్ల క్రితం వారిని కట్టుబట్టలతో గ్రామాల నుంచి జగన్ ప్రభుత్వం ఖాళీ చేయించింది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో పునరావాసం చూపలేదు. ప్యాకేజీ కోసం వారంతా పోరాడుతున్నారు. అధికారుల తప్పిదాల వల్ల ఓ కుటుంబంలో తండ్రికి పరిహారం వస్తే.. కుమారులకు రాకపోవడం, అన్నకు ఇచ్చి తమ్ముడికి మొండిచేయి చూపడం వంటివి ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని తహసీల్దారు కార్యాలయానికి వెళ్తున్న వారిని రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లమని చెబుతున్నారు. అక్కడికి వెళ్తే ధవళేశ్వరం వెళ్లమంటున్నారని బాధితులు వాపోతున్నారు. తీరా.. ధవళేశ్వరం వస్తే ఫైలు రంపచోడవరంలోనే ఉందన్న సమాధానం వస్తోందంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల