Palnadu: ఓటు.. వారికి జీవన్మరణ సమస్య!
పట్టణాల్లో కొందరికి పోలింగ్ అంటే సెలవు దినం.. ఓటేయడానికి అరగంట కూడా లైన్లో నిల్చోలేనంత బద్ధకం.. నేనొక్కణ్నే ఓటేయకపోతే ఏమవుతుందనేంత నిర్లక్ష్యం.. పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వారికి మాత్రం ఓటేయడం అంటే జీవితాల్ని పణంగా పెట్టడమే. రాజ్యాంగం కల్పించిన ఆ హక్కు వినియోగించుకోవాలంటే పెద్ద పోరాటమే చేయాలి.
పల్నాట కొన్ని పల్లెల్లో ఓటేయడం ఓ యజ్ఞమే
వర్గపోరుతో దాడులు, దౌర్జన్యాలు.. అరాచకాలతో ఊరొదిలే పరిస్థితి
ఈనాడు, అమరావతి: పట్టణాల్లో కొందరికి పోలింగ్ అంటే సెలవు దినం.. ఓటేయడానికి అరగంట కూడా లైన్లో నిల్చోలేనంత బద్ధకం.. నేనొక్కణ్నే ఓటేయకపోతే ఏమవుతుందనేంత నిర్లక్ష్యం.. పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వారికి మాత్రం ఓటేయడం అంటే జీవితాల్ని పణంగా పెట్టడమే. రాజ్యాంగం కల్పించిన ఆ హక్కు వినియోగించుకోవాలంటే పెద్ద పోరాటమే చేయాలి. ప్రాణాలకు ఎదురొడ్డి నిలవాలి. ఇది మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల పరిస్థితి! అక్కడ ఫ్యాక్షన్ మూకల అరాచకాల్ని ప్రశ్నించి, వారి దాడులకు, వేధింపులకు తట్టుకోలేక అవతలి వర్గం ఊరొదిలి పారిపోవాల్సి వస్తుంది. అలాంటి వారంతా ఎక్కడెక్కడో శరణార్థుల్లా బతికి.. మళ్లీ ఎన్నికలప్పుడు ఓటేయడానికి ఊళ్లోకి వస్తారు. అప్పుడూ మళ్లీ గొడవలు.. కేసుల్లో ఇరుక్కుంటారు. ఎన్నికల్లో తమ వర్గం మద్దతిచ్చే పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యర్థి వర్గీయులపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రత్యర్థి వర్గీయుల పార్టీ పైచేయి సాధిస్తే.. మళ్లీ పారిపోతారు. గెలిచే పార్టీలకు అనుగుణంగా గ్రామాల్లో బాధితులు మారతారంతే. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, ఊరు నుంచి పారిపోవడాలు మాత్రం ఆగవు. కాష్ఠం రగులుతూనే ఉంటుంది. జిల్లా కలెక్టర్లు, పోలీసులు, రాజకీయ నేతలు వస్తుంటారు. పోతుంటారు. వారెవరూ వీరి గోడు పట్టించుకోరు. రాజీ చేద్దామనే ఆలోచనే చేయరు. కక్షలు కార్పణ్యాలతో నిత్యం రగిలిపోయే ఈ వ్యవస్థ మారేదెన్నడు? అరాచకాలకు ముగింపు పలికేదెప్పుడు?
ఊరంటే ఏదో ఒక వర్గంలో చేరాల్సిందే
పల్నాడులో చాలా పల్లెల్లో ప్రజలు స్థానిక పరిస్థితులు, అవసరాల దృష్ట్యా ఏదో ఒక వర్గంలో ఉండక తప్పని పరిస్థితి. తటస్థంగా ఉంటామన్నా కుదరదు. రాజకీయ పార్టీలు కూడా తమ అవసరాల కోసం ఈ వర్గాలను చేరదీసి విభేదాలను ప్రోత్సహిస్తాయి. ఎన్నికల్లో తమ గ్రామం నుంచి ఇంత మెజారిటీ తెచ్చామని చూపిస్తేనే ఎమ్మెల్యే, ఎంపీల దగ్గర వర్గ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది. అందుకే ఓటు కోసం అంత పట్టుదలగా తలపడుతుంటారు. ప్రత్యర్థుల్ని ఓటేయనివ్వకుండా దాడులకు పాల్పడుతుంటారు. ఫ్యాక్షన్ కక్షలకు బలవుతున్న పల్లెలన్నింటిలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి ఈవీఎం పగలగొడుతుంటే.. తెదేపా ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరిరావు ముందుకు దూకి ఆయన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరమేంటి? తమ వర్గం మద్దతిచ్చే పార్టీ గెలిచినా ఆయనకేం అధికారం రాదు. ఇప్పటి మాదిరిగానే ఆయనో సాధారణ రైతుగానే మిగులుతారు. గతంలో వినాయక నిమజ్జనం సందర్భంగా దాచేపల్లి మండలం రామాపురంలో రెండు వర్గాల ఘర్షణలో ఒకరి తల పగిలింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా ఒకే వర్గానికి చెందిన 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టు చేసి జైలుకు పంపారు. వారు 30 రోజులు అక్కడే గడిపారు. అధికారపక్షం వారిపై మాత్రం సెక్షన్ 324 కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి గంటలోనే ఇంటికి పంపేశారు. మాచర్ల, కారంపూడి, వెల్దుర్తి, గురజాల, మాచవరం తదితర మండలాల్లోని పదులకొద్దీ గ్రామాల్లో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమే. చిన్న గొడవ జరిగినా.. దానికి రాజకీయ రంగు పులిమేసి ప్రత్యర్థులను కట్టడి చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతుంటారు.
గొడవలు జరుగుతాయని తెలిసినా.. ఓటు కోసమే
ఊరొదిలి వెళ్లి హైదరాబాద్లో మెస్ పెట్టుకుని జీవిస్తున్న మంజుల.. మళ్లీ రెంటాల వెళ్లి గొడవల్లో ఇరుక్కోవడం ఎందుకు? ప్రత్యర్థులు దాడి చేస్తారని తెలిసినప్పుడైనా ఆగిపోవచ్చుగా? అయినా ఆమె అలా ఆలోచించలేదు. తానే ఏజెంట్గా నిలబడేందుకు సిద్ధమై.. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత కూడా ఆ కుటుంబసభ్యులు వెనక్కి తగ్గకుండా ఏజెంటుగా బాధ్యతలు నిర్వహించి.. రిగ్గింగ్ను అడ్డుకున్నారు. ఆ కుటుంబానికి గతంలో ఎదురైన పరిస్థితులే దీనంతటికీ కారణం. వర్గపోరు అధికంగా ఉండే గ్రామాల్లో ఒక పార్టీ అధికారంలోకి వస్తే ‘దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షు’ అన్నట్లు అవతలి వర్గం అనుక్షణం భయపడుతూ బతకాల్సి వస్తోంది. అధికారులు, పోలీసులను కూడా వాడుకుని వెంటపడి వేధిస్తారు. వాళ్లు చేసిన పనులకు బిల్లులు ఇవ్వరు. అప్పులపాలై ఆస్తులమ్ముకుని ఊరొదిలి పోయేలా చేస్తారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఒకరు ఎన్నికల్లో ఓటేయడం కోసమే ఊరొచ్చారు. అక్కడ జరిగిన ఘర్షణలో తమ ప్రమేయం లేకున్నా జైలు పాలయ్యారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వ్యాపారాలు చేస్తూ, హోటళ్లు నడుపుతూ, కూలి పనులు చేసుకుంటూ బతికేవారు.. ఇలా అందరూ ఓటేసేందుకు ఊళ్లకు తిరిగొస్తున్నారు. గొడవల్లో ఇరుక్కుంటే పోలీసు కేసులవుతాయనే భయమున్నా.. అది తమ భవిష్యత్తుకు ఇబ్బందికరమని తెలిసినా వెనకాడటం లేదు. విదేశాల్లో ఉండేవారు సైతం రూ.లక్షల్లో ఖర్చు పెట్టుకుని ఓటేసేందుకు వస్తున్నారు. తీరా గ్రామంలోకి వచ్చాక.. అక్కడ జరిగే గొడవల్లో ప్రత్యక్షంగా పాల్గొనకున్నా ఉద్రిక్త పరిస్థితుల నడుమ జైలుపాలవుతున్నారు.
దుర్గి మండలం ఆత్మకూరులో స్వల్ప వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీయడంతో 65 కుటుంబాలు ఊరొదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల, జంగమహేశ్వరపాడులో దాడులు తట్టుకోలేక సుమారు 50 కుటుంబాలు ఊరొదిలాయి. గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలోనూ పనికెళ్లి వస్తున్న ఒక వర్గం వారిపై ప్రత్యర్థులు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడులు చేసి బీభత్సం సృష్టించి, 300 కుటుంబాలను ఊరు నుంచి తరిమేశారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఒక పార్టీ సానుభూతిపరుణ్ని హత్య చేశారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులు బెయిల్పై బయటకు వచ్చాక.. బాధిత కుటుంబాల్ని వేధించి, అడవుల్లోకి తరిమేశారు. ఎన్నికల నేపథ్యంలో వీరంతా సొంతూళ్లకు తిరిగొచ్చినా ఇళ్ల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని బతుకుతున్నారు. వంతులవారీ కాపలా కాస్తున్నారు. ఒకేచోట నిద్రపోతున్నారు. ఏ పనికైనా మహిళలే వెళ్లాల్సి వస్తోంది.
పొలాలు బీళ్లు.. కేసులు, వాయిదాలు.. భారీగా ఖర్చులు
గొడవలు మొదలయ్యాయంటే.. హత్యలు, దాడులతో గ్రామం అట్టుడికిపోతుంది. ప్రత్యర్థులను ఎదిరించే క్రమంలో అందరిపైనా కేసులు నమోదవుతాయి. పోలీస్స్టేషన్లు, బైండోవర్లు, కోర్టు వాయిదాలకు తిరుగుతూ వ్యవసాయం చేసేవాళ్లు లేక పొలాలు బీళ్లవుతాయి. మహా అయితే రాజకీయ పార్టీ నాయకులు వచ్చి పరామర్శిస్తారు. మాటసాయమే తప్ప ఆర్థికంగా ఆదుకోరు. బాధితులే సొంతంగానో, చందాలేసుకునో భరించాల్సిందే. కేసులు తేలేసరికి ఆస్తులు కరిగిపోతున్నాయి. అయినా ఎక్కడెక్కడో ఉండే ఇలాంటి వారంతా ధైర్యం కూడగట్టుకుని ఎన్నికల సమయానికి ఊరు చేరుతున్నారు. నచ్చిన పార్టీకి ఓటేయడం ద్వారా ప్రభుత్వం మారితే తమపై వేధింపులకు తెరపడుతుందన్న ఆశే వారిని ఇక్కడి వరకూ తీసుకొస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు