Andhra Pradesh News: రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
13 మందిలో 9 మంది ఏసీబీ నుంచే...
ఆయన హయాంలో నియమితులైన అధికారులపై నిష్పక్షపాత నివేదిక ఇవ్వగలరా?
ప్రతిపక్షాల్లో సంశయం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వారు తమ బాస్ నియమించిన అధికారుల తప్పుల్ని ఎత్తిచూపుతూ, చర్యలకు సిఫార్సు చేస్తూ నిష్పక్షపాతంగా నివేదిక ఇవ్వగలరా అనే సంశయం కలుగుతోంది. ఎన్నికల సందర్భంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తును సమీక్షించేందుకు తాజాగా ఏర్పాటుచేసిన సిట్లోని 13 మంది సభ్యుల్లో 9 మంది ఏసీబీలో పనిచేస్తున్నవారే. వీరిలో ఎస్పీ స్థాయి అధికారి మొదలుకుని ఇన్స్పెక్టర్ల వరకూ ఉన్నారు. వీరందరినీ రాజేంద్రనాథరెడ్డే ఏసీబీలో నియమించారు. ప్రస్తుతం వీరు సిట్లో సభ్యులైనా.. ఆ తర్వాత మళ్లీ ఏసీబీలో రాజేంద్రనాథరెడ్డి నేతృత్వంలోనే పనిచేయాలి. అలాంటప్పుడు సిట్ సభ్యులు వాస్తవాలను వెలికితీసి, ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వగలరా అనే సందేహం ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది.
అందరూ ఏసీబీ నుంచే ఎందుకు?
వైకాపాతో అంటకాగుతూ.. ఎన్నికల్లో ఆ పార్టీకి లబ్ధి కలిగించేలా పనిచేస్తున్నారనే ఫిర్యాదులపైనే పోలింగ్కు కొద్దిరోజుల ముందు ఎన్నికల సంఘం రాజేంద్రనాథరెడ్డిని డీజీపీ పోస్టు నుంచి తప్పించింది. తర్వాత ఆయన ఏసీబీ డీజీ పోస్టులో కొనసాగుతున్నారు. అలాంటి ఆరోపణలున్న అధికారి కింద పనిచేస్తున్న బృందాన్నే సిట్లో ఎలా నియమిస్తారు? వేర్వేరు విభాగాల నుంచి ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
రెండు రోజుల్లో ఎలా సాధ్యం?
పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. సిట్ బృందాలు విచారణ మొదలుపెట్టడానికే రెండు రోజులు సరిపోదు. అలాంటిది ఇంత తక్కువ వ్యవధిలో వాస్తవాల్ని ఎలా వెలికితీయగలరు? కేసుల దర్యాప్తును సమీక్షించడం, సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోతే.. సంబంధిత సెక్షన్లు వర్తింపజేయడం, కొత్తగా కేసులు నమోదు చేయాల్సి వస్తే ఆ వివరాల్ని నివేదికలో పొందుపరచడం వంటివి సిట్ ప్రధాన బాధ్యతలు. ఈ కొద్దిసమయంలో క్షేత్రస్థాయిలో నుంచి సమాచారం సేకరించి, బాధితులతో మాట్లాడి, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం వీలుకాదు. హడావుడిగా నివేదిక సమర్పిస్తే అసలు దోషుల్ని గుర్తించటం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విశ్రాంత న్యాయమూర్తి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఉంటే!
సిట్ అధిపతిగా ఐపీఎస్ అధికారి, ఎస్ఐబీ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఉన్నారు. బృందంలోని మిగతా 13 మంది సభ్యులూ పోలీసు అధికారులే. ఇదే బృందంలో పర్యవేక్షణ కోసం ఒక విశ్రాంత న్యాయమూర్తిని, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి ఉంటే.. ఎక్కడికక్కడ చెక్స్కు వీలుండేది. పూర్తిస్థాయి వాస్తవాలను వెలికితీసే అవకాశం ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేయగలరా?
హింసకు తెగబడి ఎన్నికల్లో పైచేయి సాధించాలనే కుట్రలో భాగంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ రావడానికి కొన్ని నెలల ముందే వైకాపా వీరభక్తులైన అధికారులను డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలుగా కీలక స్థానాల్లో వైకాపా ప్రభుత్వం నియమించుకుంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పూర్వ డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి వీరిని నియమించారు. వారిలో ఎక్కువమంది జిల్లా ఎస్పీలకు సహకరించకుండా.. వైకాపా ఎమ్మెల్యేలు చెప్పినట్లు పనిచేశారు. వారికి వేగుల్లా వ్యవహరించారు. ఎస్పీకే అబద్ధాలు చెప్పి పక్కదారి పట్టించారు. పూర్వ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి అయితే అరాచక శక్తుల్ని బైండోవర్ చేయనివ్వకుండా అడ్డుకున్నారన్న ఫిర్యాదులున్నాయి. వైకాపాకు కొమ్ముకాస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎస్పీ విన్నవించినా పట్టించుకోలేదనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. వీటన్నింటి ఫలితంగానే పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపైన దాడులు జరిగాయి.
- తాడిపత్రిలోనూ డీఎస్పీ గంగయ్యను రాజేంద్రనాథరెడ్డే నియమించారు. గంగయ్యతో పాటు మరికొందరు అధికారులు వైకాపా నాయకులతో కుమ్మక్కు కావడం వల్లే తాడిపత్రిలో హింస చోటుచేసుకుంది. తిరుపతి డీఎస్పీ సరేందర్ రెడ్డి, ఎస్బీ డీఎస్పీ భాస్కర్రెడ్డి, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి, తిరుపతి ఎస్బీ సీఐ రాజశేఖర్... వీరంతా వైకాపా వీరవిధేయులైన అధికారులు. తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ వద్ద తెదేపా అభ్యర్థి పులవర్తి నానిపై హత్యాయత్నం జరగడానికి, హింస చెలరేగడానికి వీరితోపాటు మరికొంతమంది బాధ్యులు. ఈ అధికారులంతా రాజేంద్రనాథరెడ్డి హయాంలో నియమితులైనవారే.
- ఎన్నికల రోజున, ఆ తర్వాత ప్రజ్వరిల్లిన హింసాకాండకు రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమనే ఫిర్యాదులు, విమర్శలున్నాయి. వారిపై చర్యలకు సిఫార్సు చేస్తూ సిట్ నివేదిక ఇవ్వగలదా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!