Road Accident: అధ్వాన రహదారితో అంబులెన్సుకు ప్రమాదం

రాష్ట్రంలోని అధ్వాన రహదారుల కారణంగా రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఇలాగే 108 వాహనం ప్రమాదానికి గురైంది.

Updated : 29 May 2024 07:19 IST

కాల్వలోకి దూసుకెళ్లిన అంబులెన్సు

కోడూరు (అవనిగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అధ్వాన రహదారుల కారణంగా రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం ఇలాగే 108 వాహనం ప్రమాదానికి గురైంది. కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన అంబులెన్సులో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ రోగిని చేర్పించి తిరుగు ప్రయాణమయ్యారు. రహదారి అధ్వానంగా ఉండడంతో జయపురం సమీపంలో వాహనం కుదుపులకు గురై స్టీరింగ్‌ వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అంబులెన్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఒక కారు ప్రమాదానికి గురైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని