Andhra Pradesh News: ఆగిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు!
ఓ వ్యక్తి వేరొకరి వద్ద కారు కొనుగోలు చేశారు. రవాణా శాఖకు చెందిన ఈ-ప్రగతి వెబ్సైట్ ద్వారా.. తన పేరిట రిజిస్ట్రేషన్ మార్పించుకుంటున్నారు.
రూ.18 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే కారణం
క్లౌడ్ యాక్సెస్ను నిలిపివేసిన సర్వీస్ ప్రొవైడర్
ఈ-ప్రగతి వెబ్సైట్ పనిచేయక వాహనదారులకు ఇక్కట్లు
ఈనాడు, అమరావతి: ఓ వ్యక్తి వేరొకరి వద్ద కారు కొనుగోలు చేశారు. రవాణా శాఖకు చెందిన ఈ-ప్రగతి వెబ్సైట్ ద్వారా.. తన పేరిట రిజిస్ట్రేషన్ మార్పించుకుంటున్నారు. ఇంతలో బుధవారం సాయంత్రం వెబ్సైట్ ఆగిపోయింది. గురువారం కూడా అదే పరిస్థితి. రవాణా శాఖ అధికారులను సంప్రదిస్తే.. సాంకేతిక సమస్య వచ్చిందని, నాలుగైదు రోజులు పడుతుందని చెప్పారు. కానీ.. అసలు విషయం అదికాదు. రవాణా శాఖ డేటా అంతా ఓటీఎస్ఐ అనే సంస్థకు చెందిన క్లౌడ్లో స్టోర్ అవుతుంది. అందుకు ఓటీఎస్ఐకి రవాణా శాఖ ఏటా నిర్దేశిత మొత్తం చెల్లించాలి. ఏడాదిన్నరగా ఆ సొమ్ము చెల్లించకపోవడంతో ఆ సంస్థ బుధవారం సాయంత్రం క్లౌడ్ స్టోరేజ్తో యాక్సెస్ను నిలిపేసింది. దీంతో రవాణా శాఖకు చెందిన ఈ-ప్రగతి వెబ్సైట్ కూడా నిలిచిపోయింది. ఈ వెబ్సైట్ నిర్వహణ కూడా ఆ సంస్థే చూస్తోంది. రెండింటికీ కలిపి ఏడాదిన్నరగా దాదాపు రూ.18 కోట్ల వరకు బకాయిలు చెల్లించాలి. వాటిపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సదరు సంస్థ తమ సేవలను అర్ధాంతరంగా ఆపేసింది. దీంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్ల జారీ మినహా.. మిగిలిన అన్ని సేవలూ బంద్ అయ్యాయి. వాహనాల ట్రాన్స్ఫర్, రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఎన్వోసీల జారీ, త్రైమాసిక పన్నులు, ఈ-చలాన్ల చెల్లింపు, ఈ-పర్మిట్ల జారీ.. తదితర సేవలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో ఈ సమస్య వచ్చింది.
అసలు ఏం జరిగింది..?
రవాణా శాఖ పరిధిలో వాహనాల సమాచారాన్ని 2016 నుంచి క్లౌడ్లో స్టోర్ చేస్తున్నారు. దానికి ఓటీఎస్ఐ సంస్థ సర్వీస్ ప్రొవైడర్గా ఉంది. ఓ వాహనం ఎంతమంది చేతుల మారింది, దానికి ఎప్పుడెప్పుడు పన్నులు చెల్లించారు, జారీ అయిన పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు తదితరాలన్నీ స్టోర్ చేస్తారు. ఈ డేటాను క్లౌడ్లో ఉంచినందుకు ఏటా రూ.5 కోట్ల వరకు ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. దీంతోపాటు రవాణా శాఖ చాలా కాలంగా ఈ-ప్రగతి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సేవలందిస్తోంది. ఆ వెబ్సైట్ కూడా సదరు సంస్థే నిర్వహిస్తోంది. ఇందుకు ఏటా రూ.3 కోట్ల వరకు చెల్లించాలి. మరోవైపు రవాణా శాఖకు సంబంధించి సేవలు అందించేందుకు కేంద్రం ఎన్ఐసీ రూపొందించిన వాహన్ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. 2021లో ఏపీ రవాణా శాఖ వాహన్లో చేరింది. రాష్ట్ర రవాణా శాఖకు చెందిన డేటా మొత్తం ఎన్ఐసీలోకి బదలాయింపు (మైగ్రేట్) కావాల్సి ఉంది. ఎన్ఐసీ వెబ్సైట్ నెమ్మదిగా ఉండటం.. ఈ-ప్రగతిలో ఉండే అనేక మాడ్యూల్స్ అందులో లేకపోవడంతో ఆ ప్రక్రియ జాప్యమవుతోంది. ఈ పరిస్థితుల్లో అటు వాహన్, ఇటు ఈ-ప్రగతి సేవలను కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వాహన్ ద్వారా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వాహన్లో భాగమైన సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్లు జారీ చేస్తున్నారు. మిగిలిన సేవలన్నీ ఈ-ప్రగతిలోనే అందుతున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యమే: క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, ఈ-ప్రగతి వెబ్సైట్ను నిర్వహించే ఓటీఎస్ఐ సేవలను కొనసాగించడంపై గత ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. అందుకు అవసరమైన ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. రవాణా శాఖ అధికారులు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించేలా చూస్తామని చెప్పి.. ఇంతకాలం సేవలు కొనసాగేలా చూశారు. బకాయి రూ.18 కోట్లకు పెరిగినా, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. ఆ సంస్థ అర్ధాంతరంగా సేవలను ఆపేసింది. వాహన్లోకి రాష్ట్ర రవాణా శాఖ డేటా బదలాయింపు పూర్తవ్వకుండానే.. పాత సంస్థ సేవలను కొనసాగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే వాదన వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి...!
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టిన మహిళ విజయలక్ష్మి.. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వచ్చారు. -
పోలవరమే పెను సవాలు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఒక పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్ వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. -
అధికారం వచ్చిందని.. కక్ష సాధింపులొద్దు
‘అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు.. విర్రవీగడం లాంటి చర్యలొద్దు.. ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దు’ అని తెదేపా నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. -
మోసపోయాం.. మన్నించండి
వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. -
విద్యా, వసతి దీవెన బకాయిల వివరాలివ్వండి
రాష్ట్రవ్యాప్తంగా విద్యా, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల ఖాళీల వివరాలివ్వాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. -
మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. -
ఏయూ విద్యార్థిని ఫిర్యాదు.. వెంటనే మంత్రి స్పందన
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. -
రామోజీరావు.. ఒక విశ్వవిద్యాలయం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. ఆయనొక విశ్వవిద్యాలయమని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్మరించుకున్నారు. -
ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కసరత్తు
రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
బోల్తాపడిన బోధనాసుపత్రులు
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్ధి పడకేసింది. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పన హామీలను పాలకులు విస్మరించారు. -
ముఖ్యమంత్రి రేపు పోలవరం సందర్శన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. -
చంద్రబాబుకు కళ్లద్దాలిచ్చి.. మురిసిపోయిన మహిళ
మిమ్మల్ని సీఎంగా చూడాలని ఐదేళ్లుగా మేం చేయని పూజలు లేవని పలువురు మహిళలు చంద్రబాబుతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. -
సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం
అనుమతులు లేకుండా అవులపల్లె ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి.. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.600 కోట్ల బిల్లులు చేసుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీరభ్కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్కుమార్ గుప్తా శనివారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. -
ఇదీ సంగతి!
-
సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల వినతులు స్వీకరించడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టారు. -
కిషన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్కల్యాణ్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు బొగ్గు, గనులశాఖ ఎంతో కీలకం. -
ప్రజలకూ నాకూ మధ్య అడ్డుగోడలుండవు
ప్రజలకు, తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. -
పౌరసరఫరాల శాఖలో భారీ దోపిడీ
రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె.. ఏది చూసినా ప్యాకెట్కు 50-100 గ్రాములు తక్కువ బరువే. -
మహిళలకు రక్షణ కల్పిస్తాం.. రాష్ట్ర హోం మంత్రి అనిత
భూకబ్జాలు, దాడులు.. మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరక్కుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!
-
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
-
విష్వక్ సేన్ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి