Andhra Pradesh News: ఆగిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు!
ఓ వ్యక్తి వేరొకరి వద్ద కారు కొనుగోలు చేశారు. రవాణా శాఖకు చెందిన ఈ-ప్రగతి వెబ్సైట్ ద్వారా.. తన పేరిట రిజిస్ట్రేషన్ మార్పించుకుంటున్నారు.
రూ.18 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే కారణం
క్లౌడ్ యాక్సెస్ను నిలిపివేసిన సర్వీస్ ప్రొవైడర్
ఈ-ప్రగతి వెబ్సైట్ పనిచేయక వాహనదారులకు ఇక్కట్లు
ఈనాడు, అమరావతి: ఓ వ్యక్తి వేరొకరి వద్ద కారు కొనుగోలు చేశారు. రవాణా శాఖకు చెందిన ఈ-ప్రగతి వెబ్సైట్ ద్వారా.. తన పేరిట రిజిస్ట్రేషన్ మార్పించుకుంటున్నారు. ఇంతలో బుధవారం సాయంత్రం వెబ్సైట్ ఆగిపోయింది. గురువారం కూడా అదే పరిస్థితి. రవాణా శాఖ అధికారులను సంప్రదిస్తే.. సాంకేతిక సమస్య వచ్చిందని, నాలుగైదు రోజులు పడుతుందని చెప్పారు. కానీ.. అసలు విషయం అదికాదు. రవాణా శాఖ డేటా అంతా ఓటీఎస్ఐ అనే సంస్థకు చెందిన క్లౌడ్లో స్టోర్ అవుతుంది. అందుకు ఓటీఎస్ఐకి రవాణా శాఖ ఏటా నిర్దేశిత మొత్తం చెల్లించాలి. ఏడాదిన్నరగా ఆ సొమ్ము చెల్లించకపోవడంతో ఆ సంస్థ బుధవారం సాయంత్రం క్లౌడ్ స్టోరేజ్తో యాక్సెస్ను నిలిపేసింది. దీంతో రవాణా శాఖకు చెందిన ఈ-ప్రగతి వెబ్సైట్ కూడా నిలిచిపోయింది. ఈ వెబ్సైట్ నిర్వహణ కూడా ఆ సంస్థే చూస్తోంది. రెండింటికీ కలిపి ఏడాదిన్నరగా దాదాపు రూ.18 కోట్ల వరకు బకాయిలు చెల్లించాలి. వాటిపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సదరు సంస్థ తమ సేవలను అర్ధాంతరంగా ఆపేసింది. దీంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్ల జారీ మినహా.. మిగిలిన అన్ని సేవలూ బంద్ అయ్యాయి. వాహనాల ట్రాన్స్ఫర్, రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఎన్వోసీల జారీ, త్రైమాసిక పన్నులు, ఈ-చలాన్ల చెల్లింపు, ఈ-పర్మిట్ల జారీ.. తదితర సేవలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా, ముందుచూపు లేకుండా వ్యవహరించడంతో ఈ సమస్య వచ్చింది.
అసలు ఏం జరిగింది..?
రవాణా శాఖ పరిధిలో వాహనాల సమాచారాన్ని 2016 నుంచి క్లౌడ్లో స్టోర్ చేస్తున్నారు. దానికి ఓటీఎస్ఐ సంస్థ సర్వీస్ ప్రొవైడర్గా ఉంది. ఓ వాహనం ఎంతమంది చేతుల మారింది, దానికి ఎప్పుడెప్పుడు పన్నులు చెల్లించారు, జారీ అయిన పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు తదితరాలన్నీ స్టోర్ చేస్తారు. ఈ డేటాను క్లౌడ్లో ఉంచినందుకు ఏటా రూ.5 కోట్ల వరకు ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. దీంతోపాటు రవాణా శాఖ చాలా కాలంగా ఈ-ప్రగతి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సేవలందిస్తోంది. ఆ వెబ్సైట్ కూడా సదరు సంస్థే నిర్వహిస్తోంది. ఇందుకు ఏటా రూ.3 కోట్ల వరకు చెల్లించాలి. మరోవైపు రవాణా శాఖకు సంబంధించి సేవలు అందించేందుకు కేంద్రం ఎన్ఐసీ రూపొందించిన వాహన్ వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. 2021లో ఏపీ రవాణా శాఖ వాహన్లో చేరింది. రాష్ట్ర రవాణా శాఖకు చెందిన డేటా మొత్తం ఎన్ఐసీలోకి బదలాయింపు (మైగ్రేట్) కావాల్సి ఉంది. ఎన్ఐసీ వెబ్సైట్ నెమ్మదిగా ఉండటం.. ఈ-ప్రగతిలో ఉండే అనేక మాడ్యూల్స్ అందులో లేకపోవడంతో ఆ ప్రక్రియ జాప్యమవుతోంది. ఈ పరిస్థితుల్లో అటు వాహన్, ఇటు ఈ-ప్రగతి సేవలను కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వాహన్ ద్వారా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వాహన్లో భాగమైన సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్లు జారీ చేస్తున్నారు. మిగిలిన సేవలన్నీ ఈ-ప్రగతిలోనే అందుతున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యమే: క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, ఈ-ప్రగతి వెబ్సైట్ను నిర్వహించే ఓటీఎస్ఐ సేవలను కొనసాగించడంపై గత ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. అందుకు అవసరమైన ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. రవాణా శాఖ అధికారులు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించేలా చూస్తామని చెప్పి.. ఇంతకాలం సేవలు కొనసాగేలా చూశారు. బకాయి రూ.18 కోట్లకు పెరిగినా, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. ఆ సంస్థ అర్ధాంతరంగా సేవలను ఆపేసింది. వాహన్లోకి రాష్ట్ర రవాణా శాఖ డేటా బదలాయింపు పూర్తవ్వకుండానే.. పాత సంస్థ సేవలను కొనసాగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే వాదన వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం