AP Election Violence: మారణాయుధాలతో దాడులకు తెగబడినా నామమాత్రపు సెక్షన్లే
వందల మంది రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడినా నామమాత్రపు సెక్షన్లే తప్ప హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్లు పెట్టలేదు.
ఈవీఎంలు ధ్వంసం చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..
గుర్తుతెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు
హింసాత్మక ఘటనల్లో కేసుల నమోదు, దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం
పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలపై సిట్ తుది నివేదిక
ఈనాడు, అమరావతి: వందల మంది రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడినా నామమాత్రపు సెక్షన్లే తప్ప హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్లు పెట్టలేదు. మాచర్ల అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా వైకాపా నాయకులు పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసినా గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదులిచ్చి తప్పించేందుకు యత్నించారు. అలాంటి విధ్వంస ఘటనలపై ప్రిసైడింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా.. బీఎల్వోలతో ఇప్పించారు. అత్యధిక కేసుల్లో నిందితులను ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’గా పేర్కొనడం గమనార్హం. ఆయా కేసుల్లో కొందరిని గుర్తించినా అరెస్టు చేయలేదు. పోలింగ్ రోజున, ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక, ఈవీఎంల విధ్వంస ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరిది. కేసుల నమోదు, వాటి దర్యాప్తులోనూ అవసరమైన శ్రద్ధ చూపించలేదు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ అంశాలన్నింటినీ గుర్తించింది. గత నెల 20నే ప్రాథమిక నివేదిక సమర్పించిన సిట్.. తాజాగా 274 పేజీలతో సమగ్ర తుది నివేదికను డీజీపీ హరీష్కుమార్ గుప్తా, ఎన్నికల సంఘానికి అందజేసింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో నమోదైన తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించిన మొత్తం 37 కేసుల గురించి ప్రతి అంశాన్ని అందులో పొందుపరిచింది. వీటిల్లో ఈవీఎంల విధ్వంస ఘటనలకు సంబంధించినవి 7, ఇతర హింసాత్మక ఘటనలకు సంబంధించినవి 30 కేసులు ఉన్నాయి.
11 కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు
మొత్తం 37 కేసులకు గాను ఏకంగా 32 కేసుల్లో ఆ నేరానికి తగిన సెక్షన్లు వర్తింపజేయలేదని సిట్ గుర్తించింది. ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు జోడిస్తూ న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించి ఆ సెక్షన్లు జత చేయించింది. 11 కేసుల్లో హత్యాయత్నం సెక్షన్ (ఐపీసీ 307) పెట్టాల్సి ఉండగా దాన్ని వర్తింపజేయలేదు. అందులో 7 కేసులు పల్నాడు జిల్లా పరిధిలో, 4 కేసులు అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నాయి. 21 కేసుల్లో నేరపూరిత కుట్ర సెక్షన్ (ఐపీసీ 120బీ) పెట్టలేదు. అందులో 13 పల్నాడు జిల్లా పరిధిలోనే ఉన్నాయి. 19 కేసుల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్లను, ఒక కేసులో ప్రభుత్వ ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం సెక్షన్లను, ఒక కేసులో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను పెట్టాల్సి ఉన్నా పెట్టలేదు. ఇవే కాకుండా అనేక కేసుల్లో ఐపీసీ 143, 144, 145, 147, 148, 188, 448, 427, 506, 394 (బీ), 352 ,436, 452 రెడ్విత్ 149 వంటి సెక్షన్లను వర్తింపజేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఈ లోపాలను గుర్తించిన సిట్ వాటిని సరిదిద్దింది.
- మాచర్లలో వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వాటికి అదనంగా ఐపీసీ 143, 147, 353, 452 రెడ్విత్/149, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 131, 135 సెక్షన్లను సిట్ సూచనతో పోలీసులు జత చేశారు.
- సత్తెనపల్లి నియోజకవర్గం గుండ్లపల్లె గ్రామంలో 170వ పోలింగ్ స్టేషన్లో సుమారు 60 మంది విధ్వంసం సృష్టించిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వీటికి అదనంగా ఐపీసీ 120బి, 188, 352, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125, 128, 132, 134(ఎ, బి)సెక్షన్లను వర్తింపజేయాలని సిట్ తేల్చడంతో తర్వాత దర్యాప్తు అధికారులు వాటిని చేర్చారు.
ఆలస్యంగా ఫిర్యాదులు..
హింసాత్మక ఘటనల్లో అత్యధిక శాతం పట్టపగలు నివాసిత ప్రాంతాల్లోనే చోటుచేసుకున్నా దర్యాప్తులో ప్రత్యక్ష సాక్షుల్ని పోలీసులు ప్రశ్నించనేలేదు. వెబ్కాస్టింగ్ ఫీడ్ నుంచి ఈవీఎంల విధ్వంసానికి పాల్పడిన నిందితుల్ని గుర్తించే అవకాశమున్నా ఆ ప్రయత్నం చేయకుండానే గుర్తుతెలియని వ్యక్తులంటూ ఫిర్యాదులిచ్చారు. అది కూడా ఘటన జరిగిన వెంటనే కాకుండా కొంత జాప్యం చేశారు. ఆయా ఘటనల్లో పోలింగ్ బూత్ల్లోని సిబ్బందిని తప్పనిసరిగా ప్రశ్నించాలని సిట్ పేర్కొంది. ఈ కేసుల్లో ప్రిసైడింగ్ అధికారుల నుంచి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన సర్టిఫికెట్లు పొందాలని దర్యాప్తు అధికారులను సిట్ ఆదేశించింది. ఈవీఎం టెక్నీషియన్లు, పోలింగ్ అధికారుల నుంచి సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్దేశించింది. గతంలో భయం వల్ల వాంగ్మూలం ఇవ్వటానికి ముందుకు రాని సాక్షుల్ని గుర్తించి వారితో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాలు నమోదు చేయించాలని సిట్ సిఫార్సు చేసింది.
ర్యాలీలకు అనుమతించటం వల్లే తాడిపత్రిలో హింస
తాడిపత్రిలో పోలింగ్ రోజున ఇరువర్గాల వారికి ద్విచక్రవాహనాల ర్యాలీలకు అనుమతిచ్చారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ ఇలా చేయడం గమనార్హం. ఆ పర్యవసానమే అక్కడ తీవ్ర హింసాకాండకు దారి తీసింది. ఈ ఘటనల్లో పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు. తిరుపతి, పల్నాడు జిల్లాల్లో చెలరేగిన హింస వల్ల పోలీసుల వాహనాలతో పాటు రాజకీయ నాయకులు, ప్రజల ఆస్తులూ, వాహనాలు ధ్వంసమయ్యాయి. కేసుల నమోదు, దర్యాప్తులో పోలీసులు తగిన శ్రద్ధ చూపకపోవడంతో సాక్షుల్ని మళ్లీ విచారించాలని సిట్ నివేదించింది. తీవ్ర గాయాలైన వారి మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్టులు సేకరించి ఆ మేరకు అవసరమైన సెక్షన్లను వర్తింపజేయాలని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల