Ikkurru: గొడవలకు స్వస్తి.. అభివృద్ధికి నాంది
రాజకీయ మారణహోమంతో అట్టుడికిన ఆ గ్రామం ఇప్పుడు నవోదయంతో తొణికిసలాడుతోంది.
కలిసిమెలిసి జీవిస్తున్న గ్రామస్థులు
విదేశాల్లో ఉద్యోగాలతో నవతరం పురోగతి
పల్నాడు జిల్లా ఇక్కుర్రు ప్రస్తుత స్థితి ఇదీ
ఇక్కుర్రులోని దేవాలయం
ఈనాడు డిజిటల్, నరసరావుపేట- న్యూస్టుడే, నరసరావుపేట అర్బన్: రాజకీయ మారణహోమంతో అట్టుడికిన ఆ గ్రామం ఇప్పుడు నవోదయంతో తొణికిసలాడుతోంది. కక్షలు, కార్పణ్యాలతో నష్టపోయిన ఓ తరం.. తమ భావితరాల బాగుకోసం చేసిన కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడు అక్కడ ప్రత్యర్థులు అనే మాటే లేదు. క్షణికావేశంలో చోటుచేసుకున్న విషాద ఘటనలను మర్చిపోయి అన్నివర్గాల వారూ కలిసిమెలిసి జీవిస్తూ.. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కుర్రు గ్రామస్థులు రాసిన ‘మరో చరిత్ర’ ఇది.
ప్రస్తుతం విదేశాల్లో ఉన్నతస్థాయిలో
రెండువర్గాల వారు కేసుల వాయిదాల కోసం కోర్టు చుట్టూ ఐదేళ్ల పాటు తిరిగారు. 1996లో కేసులకు కోర్టు ముగింపు పలికింది. ప్రతీకార దాడులు.. కేసులతో రూ.లక్షలు పోగొట్టుకున్నామని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు. అప్పట్లో చదువులేక రాజకీయ కక్షల్లో ఇరుక్కుపోయామని బాధపడుతున్నారు. సుమారు ఆరువేల జనాభా ఉన్న ఈ గ్రామంలో 2004 నుంచి ఎటువంటి ఘర్షణ వాతావరణం లేదంటూ సంతోషంగా చెబుతున్నారు. అప్పట్లో రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు పాల్పడ్డ కుటుంబాలన్నీ నేడు పరస్పరం శుభకార్యాలకు హాజరవుతున్నారని, పాత గొడవలను ఎవరూ మనసులో పెట్టుకోలేదని, అందుకే ఎటువంటి అల్లర్లు లేవని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఊరి నుంచి ఇంటికొకరు ఉన్నతస్థాయిలో ఉన్నారు. సుమారు 100 మంది వరకూ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
అప్పుడేం జరిగింది?
1989 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున నరసరావుపేట మండలం ఇక్కుర్రులో కాంగ్రెస్, తెదేపా వర్గీయుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. రెండువర్గాల వారు నాటుబాంబులు విసురుకున్నారు. కాంగ్రెస్కు చెందిన ఓ వ్యక్తి గోడ ఎక్కి నాటుబాంబు విసరడానికి ప్రయత్నిస్తుండగా పోలీసు సైరన్ మోగడంతో కాలుజారి కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో తెదేపా వర్గీయులపై కాంగ్రెస్ వర్గీయులు కక్ష పెంచుకున్నారు. ఫలితాల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పాత ఘటనను మనసులో పెట్టుకుని దాడులు చేయాలని కాంగ్రెస్ వర్గీయులు ప్రణాళిక వేసుకున్నారు. పోలింగ్ రోజు జరిగిన దాడుల్లో నిందితులుగా ఉన్న తెదేపా వర్గీయులు 40మంది నరసరావుపేట కోర్టుకు వెళ్లారు. ఇదే అదునుగా భావించి ఎవరు వచ్చినా దాడులు చేయాలని కాంగ్రెస్ వర్గీయులు గ్రామంలోని ఓ ఆలయం వద్ద మారణాయుధాలతో సిద్ధంగా ఉన్నారు. పొలంలో నారుపోసి ఎడ్లబండిపై కనుమూరి వెంకటేశ్వర్లు(60), ఓ మహిళ(40), ఓ యువకుడు(30) ఊరులోకి వస్తున్నారు. కాపుకాస్తున్న అల్లరిమూకలు రోడ్డుపైకి వచ్చి ఎడ్లబండిపై నుంచి వారిని కిందకు లాగి మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ముగ్గురినీ కొన ఊపిరితో ఉండగానే గడ్డివాములో వేసి తగలబెట్టారు. ఈ ఘటన 1990 జులై 19న జరిగింది. సజీవదహనం కేసులో ఏడుగురికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడింది.
మా తరంతోనే ముగింపు
- కనుమూరి రమేశ్, ఇక్కుర్రు
రాజకీయాలకు సంబంధం లేని మా నాన్నను చంపేశారు. ఆయుధాలతో దాడిచేయడమే కాకుండా బతికుండగానే దహనం చేశారు. నేను చదువుకోవడంతో ఈ గొడవలకు దూరంగా ఉంటున్నా. నా పిల్లలనూ అలానే పెంచాను. వారంతా ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నారు. నాన్నను చంపినంత మాత్రాన ప్రత్యర్థులుగా నేను ఎవరినీ భావించడం లేదు. అలా అనుకుంటే సంతోషంగా ఉండలేం. పగ, ప్రతీకారాలతో రగిలిపోతే జీవితం నరకం. కేసుల్లో ఇరుక్కుంటూ జీవితాలను పాడుచేసుకోవడం మంచిది కాదు. మా తరంతోనే గొడవలకు ముగింపు పలికాం.
కేసులతోనే సగం జీవితం వృథా
- జి.పేరయ్య, ఇక్కుర్రు
మా నాన్న గ్రామపెద్దగా వ్యవహరించేవారు. కాలక్రమేణా పార్టీలు వచ్చి ప్రజల్లో చిచ్చుపెట్టాయి. గొడవల్లో కేసుల్లో ఇరుక్కుని కోర్టు చుట్టూ తిరిగాం. సగం జీవితం వృథా అయిపోయింది. కొంత ఆస్తి కూడా హరించుకుపోయింది. మేం పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదని గొడవలకు దూరంగా పెంచాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?