Tadepalli: తాడేపల్లిలో తోడేళ్ల డెన్!
‘రౌడీలంతా గుంపులుగా ఊరి మీద పడి.. సామాన్యుల్ని, వ్యాపారుల్ని భయపెట్టి, వేధించి వసూలు చేసిన సొమ్మంతా ఏ రోజుకు ఆ రోజు విలన్ అడ్డాకు చేరుస్తారు.
ఐదేళ్లుగా.. అనుమానాస్పద లావాదేవీలన్నీ అక్కడే!
ప్యాలెస్ పక్కనే కొన్ని విల్లాలు, ఫ్లాట్లలో వ్యవహారాలు
ఇసుక, మద్యం సహా ఎన్నో అక్రమాలు అక్కణ్నుంచే!
కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే.. వాస్తవాలు వెలుగులోకి..
ఈనాడు-అమరావతి: ‘రౌడీలంతా గుంపులుగా ఊరి మీద పడి.. సామాన్యుల్ని, వ్యాపారుల్ని భయపెట్టి, వేధించి వసూలు చేసిన సొమ్మంతా ఏ రోజుకు ఆ రోజు విలన్ అడ్డాకు చేరుస్తారు. కుప్పలుగా పోసి యంత్రాలతో లెక్క పెడుతుంటారు..’ 17 ఏళ్ల కిందట వచ్చిన ‘ఢీ’ సినిమాలో ఇదొక సన్నివేశం.. గత ఐదేళ్లపాటు తాడేపల్లి ప్యాలెస్, పక్కనున్న కొన్ని విల్లాలు, అపార్ట్మెంట్లలోని కొన్ని ఫ్లాట్లలో ఈ సినిమా సన్నివేశాలను తలదన్నేంత వ్యవహారాలు సాగాయి. అక్కడి అవినీతి సొమ్ము లెక్కలు చూస్తే కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. అందులో పెద్దలకు చేరేది వందల కోట్లలోనే ఉంటుంది మరి! వారి సామంతుడిగా పనిచేసే సలహాదారు, మరో ముఖ్య అధికారి వాటాలూ పెద్దమొత్తంలోనే ఉన్నాయి. ఎవరి లెక్కలు వారివే. మద్యం అమ్మకాల్లో వచ్చిన నగదైనా.. ఇసుక నుంచి తీసిన సొమ్మైనా.. కాంట్రాక్టుల్లో వాటాలైనా.. అన్నీ అక్కడ నుంచే నడిచాయి. అనుమానాస్పద లావాదేవీలకు నిలయంగా మారిన కొన్ని అపార్ట్మెంట్లలోని కొన్ని ఫ్లాట్లు, విల్లాలను తనిఖీ చేస్తే.. అక్రమ వ్యవహారాలెన్నో వెలుగులోకి వస్తాయి. వాటన్నిటిని తరలించకముందే.. కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొన్ని రాజకీయపక్షాలు డిమాండు చేస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో వివిధ రంగాల్లో దోపిడీని కేంద్రీకృతం చేశారు. కీలకమైన మద్యం, ఇసుక సహా బిల్లుల చెల్లింపులో కమీషన్ల వసూలు వరకు.. అక్రమ లావాదేవీలన్నీ తాడేపల్లి కేంద్రంగానే నడిపించారు. శాఖలవారీ బాగా నమ్మకస్తులైన కొందరు అధికారులను నియమించుకుని.. వారి కనుసన్నల్లోనే కార్యక్రమాలు నడిపించారు. అదనంగా వచ్చిన మొత్తాన్ని లెక్క చూసి తరలించే విషయాన్ని అధినేతకు బాగా దగ్గరి వారు చూశారు. అచ్చంగా ఇలాంటి వ్యవహారాల కోసమే కొందరు విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేశారు. మరికొన్ని అద్దెకు తీసుకున్నారు. వీటి కోసమే రూ.కోట్లలో ఖర్చు చేశారంటే.. అక్రమ ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో ప్రభుత్వం తరపున అద్దె కట్టే ఫ్లాట్లు కూడా కొన్ని ఉండడం గమనార్హం.
బిల్లు రావాలంటే.. పది శాతం సమర్పించుకోవాల్సిందే
కాంట్రాక్టు పనులకు బిల్లులు రావాలంటే.. పెద్దమొత్తంలో సమర్పించుకోవాల్సిందే. రూ. 2 కోట్లకు మించి బిల్లు చెల్లించాలంటే ప్యాలెస్ నుంచి అనుమతి రావాల్సిందే. దీనికి 10% కమీషన్ తప్పనిసరి. పెద్ద కాంట్రాక్టర్లకు సంబంధించిన ఇలాంటి వసూళ్లన్నీ ముఖ్యనేతలకు అతి సన్నిహితులైన ఒకరిద్దరి కనుసన్నల్లోనే నడిచాయి. మరికొన్ని బిల్లుల చెల్లింపు వ్యవహారాలన్నీ.. ఒక ముఖ్య అధికారితోపాటు గత ప్రభుత్వంలో నంబర్ 2 అనేలా అధికారం చెలాయించిన ఒక నాయకుడి కనుసన్నల్లో సాగాయి. వీరి కింద పదులకొద్దీ దళారులు ఉండేవారు. ఒక్కో దళారీ నాలుగైదు ఖరీదైన కార్లతో రాజసం వెలగబెట్టారు. అంటే ఎంత భారీ స్థాయిలో వసూళ్లు చేశారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో వైకాపా అధికారాన్ని కోల్పోవడంతో.. తాడేపల్లి కేంద్రంగా సాగిస్తున్న అక్రమ వ్యవహారాలకు అడ్డుకట్ట పడింది.
పక్కా లెక్క.. అధికారికంగా దొరక్కుండా?
తాడేపల్లి ప్రాంతంలోని పదుల సంఖ్యలో విల్లాలు, ఫ్లాట్ల నుంచే ఐదేళ్లపాటు అక్రమ వసూళ్ల వ్యవహారం సాగింది. ఎవరి పని వారిదే. పదుల సంఖ్యలో వ్యక్తులు ఈ వ్యవహారాల్లో నిమగ్నమైనా.. ఒకరు చేసేది మరొకరికి తెలియనంత పకడ్బందీగా జరిగేది. ఉదాహరణకు ఇసుక అక్రమాలనే తీసుకుంటే.. ఎక్కడెక్కడ ఎంతెంత తరలించారు? వాటి ద్వారా వచ్చిన మొత్తమెంత.. అనే లెక్కల్ని రేవులవారీగా నిర్వహించే అధికార పార్టీ నేతలు సాయంత్రానికి పంపేవారు. ఈ కథ మొత్తం ఫోన్లు, ఆన్లైన్లోనే నడిపేవారు. మద్యం వ్యవహారాలు చూసేందుకు మరో భవనం ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నిటిని క్రోడీకరించి పెద్దలకు లెక్కలు అప్పజెప్పేవారని కొందరు వైకాపా నేతలు పేర్కొంటున్నారు.
సమగ్ర విచారణ చేయిస్తే..: ఇసుక, మద్యం సహా వివిధ రంగాల్లో భారీ ఎత్తున జరిగిన దోపిడీపై కొత్త ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాజకీయ పక్షాలు డిమాండు చేస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించిన ప్లాట్లు, విల్లాల్లో అధికారులు తనిఖీలు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. గతంలో అక్కడ విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది ఎవరో విచారిస్తే.. రూ.వేల కోట్ల దోపిడీలో నిజాలు బయటపడతాయి. ఇక్కడ జరిగే వ్యవహారాలు శాఖలవారీ కొందరు ఉన్నతాధికారులకూ తెలుసని, వారి పాత్రపైనా విచారణ చేయించాలని కోరుతున్నారు. ఈ దోపిడీలన్నిటి వెనక అంతిమ లబ్ధిదారులెవరో తేల్చాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత