YS Jagan: ‘అన్నకు బంపర్ ఆఫర్.. శుక్రవారమంటే ఇక దడే’.. ఇది దేవుడి స్క్రిప్ట్!
సామాజిక మాధ్యమాల వేదికగా జగన్పై మరోసారి ట్రోలర్లు రెచ్చిపోయారు. ఎన్నికల్లో వైకాపా ఓటమి, ప్రచారంలో ఆయన శైలి, పాలనా తీరు, గత ఎన్నికల గెలుపు సమయంలో ఆయన వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ మీమ్స్ను ఇరగదీశారు. వీడియోలను పోస్ట్ చేస్తూ ఒక ఆట ఆడుకున్నారు.
ఈనాడు, అమరావతి: సామాజిక మాధ్యమాల వేదికగా జగన్పై మరోసారి ట్రోలర్లు రెచ్చిపోయారు. ఎన్నికల్లో వైకాపా ఓటమి, ప్రచారంలో ఆయన శైలి, పాలనా తీరు, గత ఎన్నికల గెలుపు సమయంలో ఆయన వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ మీమ్స్ను ఇరగదీశారు. వీడియోలను పోస్ట్ చేస్తూ ఒక ఆట ఆడుకున్నారు. మంగళవారం ఫలితాలు వెలువడినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో పోస్టులతో దండెత్తారు. నిన్నమొన్నటి వరకు పోస్టులు పెట్టాలంటే జంకే పరిస్థితిని నుంచి బయటపడి వారి సృజనాత్మకతకు స్వేచ్ఛగా పనిపెట్టారు
దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే..
కూటమి సాధించిన సీట్లు : 164; వైకాపా సాధించిన సీట్లు : 11
అంటే 1+6+4 కలిపితే : 11.. ఇదే కదా దేవుని లీల అంటే..
5 ఎగిరి పోయిందే..
151 సీట్లలో అటు ఒకటో.. ఇటు ఒకటో ఎగిరిపోతుందనుకుంటే మధ్యలో 5 ఎగిరిపోయిందే..
అన్నకు బంపర్ ఆఫర్
అన్నయ్యకు పేటీఎం బ్యాచ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.. కూలీ రూ.5 ఇవ్వనందుకు.. 151లో 5 కట్ చేసి 11 చేతికిచ్చారు.
జనమే పీకేశారు
‘ప్రతిపక్షాలు నా వెంట్రుక కూడా పీకలేరు’ అన్నారు. జనం మాత్రం మొత్తం పీకేశారు.
గ్రాఫిక్స్ ఇక్కడ కుదరనట్టుందే!
సిద్ధం సభకు జనాలు రాకపోయినా గ్రాఫిక్స్లో చూపించొచ్చు. కానీ ఓట్లు అదే గ్రాఫిక్స్లో వేయించలేరుగా!
సర్లే పడుకో.. ఇక పడుకో..
మీరు ఆంధ్రాను రాజధాని లేని రాష్ట్రంగా చేస్తే.. ప్రజలు ప్రతిపక్షమే లేని రాష్ట్రంగా చేశారే.. సర్లే పడుకో ఏం ఉందిలే ఇక పడుకో..
నేను విన్నాను.. నేను చూశాను..
సీఎం పదవికి రాజీనామా
ఇది నేను విన్నాను.. నేను చూశాను..
ఈ జన్మకు ఇది చాలు అన్నయ్య
మీరు బులుగు రంగు వేస్తే.. ప్రజలు పసుపు రంగు వేశారు
ఎవరో కట్టిన పంచాయతీ కార్యాలయాలకు, ప్రభుత్వ దవాఖానాలకు బులుగు రంగు పూస్తే..
ప్రజలు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పసుపు రంగు వేశారు.
ఎరుపు రంగు బొట్టు పెట్టారు. కమలాలు విరబూయించారు.
జగనూ నీకు కనపడుతోందా? అట్టుంటది మనతోటి..
ఒక్క ఛాన్స్ అని అడిగితే.. ఒక్క ఛాన్సే ఇచ్చారు
అన్న ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ మాత్రమే ఇచ్చారు..
ఏపీ జనాలు నిజంగా నిజాయతీ పరులే
అప్పుడు దండం.. ఇప్పుడు పిండం
అన్న దండం పెడితే.. తమ్ముడు వైకాపాకు పిండం పెట్టాడు
దేవుడికేం తెలుస్తుంది జగనన్న..
సజ్జల...కొడాలి.... పేర్ని....జోగి.. అనిల్, రోజక్కలను అడుగు తెలుస్తుంది... ఎందుకు ఓడిపోయామో!
అమ్మకు....అమ్మికి ఎరుక
ఎందుకు ఓడిపోయామో తెలిసేది దేవుడికాదు మామయ్య
అమ్మకు.... అమ్మికి ఎరుక
సజ్జలకు.... మంత్రులకు ఎరుక
గాయమైన రాష్ట్రానికి పసుపు రాసిన ప్రజలు
వైజాగ్లో రూముల్ని ఖాళీ చేయాలా వద్దా మామా
జరిగిందేదో జరిగిపోయింది..
వైజాగ్లో మనోళ్లు బుక్ చేసుకున్న రూముల్ని ఖాళీ చేయాలా వద్దా చెప్పు మామా
ఉన్న 11 మందితోనైనా ప్రమాణ స్వీకారం చేద్దాం
9వ తేదీ వరకు వెయిట్ చేయమంటావా?
ఈ సారి గెలిస్తే 5 రాజధానుల్ని చేయాల్సిందే
మూడు అచ్చి రాలేదు మామ
ఇప్పుడు మనకు సీట్లు ఇచ్చింది 5 జిల్లాల్లోనే
కాబట్టి 2029లో గెలిస్తే ఈ సారి 5 రాజధానుల్ని చేయాల్సిందే
అన్న వస్తున్నాడంటున్న చంచల్గూడ ఖైదీలు...
అన్న వస్తున్నాడు.....అన్న వస్తున్నాడు...
ఎక్కడికి అనుకుంటున్నారా? మీ ఇంటికి కాదు.....చంచల్ గూడ జైలుకి
దీన్నే ట్రోలర్లు అస్త్రంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఆటాడుకుంటున్నారు
‘రావాలి జగన్ .. కావాలి జగన్..’ అంటూ చంచల్ గూడ ఖైదీలు జైల్లో చిందులేస్తూ పాడుకుంటున్న వీడియోను పోస్టు చేస్తున్నారు
బాహుబలిలో మాదిరిగా ‘మనతో ఉండటానికి వస్తున్నాడురా.. పండగ చేసుకోవాలి రా..’ అంటూ చిందులేస్తున్నారు.
ముద్రగడకు కూడా ఇలానే నామకరణం చేస్తారేమో!
పిఠాపురంలో పవన్కల్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు ముద్రగడ
ఇప్పుడు అదే శపథాన్ని గుర్తుచేస్తున్నారు ట్రోలర్లు....
దీనికి ఎన్నికల ప్రచారంలో జగన్ ఓ పాపను ఎత్తుకుని ముద్దు చేస్తు.. నామకరణం చేసే వీడియోను ఉపయోగించుకుంటున్నారు
ఆ వీడియోని పోస్టు చేస్తూ... ముద్రగడకు కూడా ఇలాగే నామకరణం చేస్తారేమో అని ఎద్దేవా చేస్తున్నారు.
- ఆడుదాం ఆంధ్రకు ఎన్నికైన 11 మంది వైకాపా ఆటగాళ్లకు ధన్యవాదాలు
- 10, 11 తరగతులు చదివేటోళ్లతో దొంగ ఓట్లు వేయించాం సార్. కూటమి వాళ్ల ఓట్లు కూడా తీయించాం. అలా ఎలా ఓడిపోతాం సార్.
- ఐటీశాఖ మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్్ ఓడిపోవడంతో నువ్వేం టెన్షన్ పడకు మావ ఇద్దరం కలిసి కోళ్ల ఫామ్ పెడదామని ఎద్దేవా చేస్తున్నారు.
- జల్సా సినిమాలో పవన్కల్యాణ్, ప్రకాశ్రాజ్ మధ్య సంభాషణను తీసుకుని.. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండని సరదాగా అన్నానురా.. మేం సీరియస్గా తీసుకున్నాం అని ప్రజలు అన్నట్లు మార్చారు.
ఇక శుక్రవారమంటే దడపుట్టడమే
నాడు....నాకు అసెంబ్లీ ఉంది కోర్టుకు రాలేను...
నేడు.... నాకు కోర్టు ఉంది అసెంబ్లీకి రాలేను....
ఐపీఎల్కు నయా టీం వచ్చేసింది
ఆడుదాం ఆంధ్ర....ఆడుదాం ఆంధ్ర అంటుంటే ఏంటో అనుకున్నా
ముందే 11 మందిని సిద్ధం చేసుకున్నారన్నమాట!
వచ్చే ఐపీఎల్కి నయా ఆంధ్ర టీం రెడీ అయినట్టే
ఇన్నాళ్లూ విన్నాం.. ఇప్పుడు చూస్తున్నాం..
తోబుట్టువుల కన్నీళ్లు ఇంటికి అరిష్ఠమంటారు పెద్దలు
ఇన్నాళ్లూ ఈ మాటను విన్నాం
ఇప్పుడు చూస్తున్నాం
నీకు అర్థమయ్యిందా అన్నయ్యా!
ఇదిగో ఇప్పుడు కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది
స్త్రీలను నిండు సభలో అగౌరవపరిస్తే రాజ్యాలే కూలాయని చదువుకున్నాం.... విన్నాం
ఇప్పుడు కళ్లారా చూశాం
నీకు అర్థమయ్యిందా అన్నయ్యా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్