Ramoji rao: ఏపీలో నేడు, రేపు సంతాప దినాలు

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. ఆదివారం, సోమవారం (9, 10 తేదీలు) సంతాప దినాలుగా పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 09 Jun 2024 05:23 IST

ఈనాడు, అమరావతి: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. ఆదివారం, సోమవారం (9, 10 తేదీలు) సంతాప దినాలుగా పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రెండు రోజులూ జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయాలని, అధికారికంగా ఏ వేడుకలూ నిర్వహించరాదని ఆదేశించింది.


ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు

ఈనాడు, అమరావతి: రామోజీరావు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆదివారం నిర్వహించనున్న అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వ అధికారిక ప్రతినిధులుగా రెవెన్యూ శాఖ (ఎక్సైజ్‌) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్పీ సిసోడియా హాజరై నివాళులు అర్పించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని