Dharma Reddy: తితిదే ఈవో ధర్మారెడ్డిని సెలవులో పంపిన ప్రభుత్వం

తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్‌ఛార్జ్‌ ఈవో ఏవీ ధర్మారెడ్డిని ప్రభుత్వం సెలవులో పంపింది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated : 11 Jun 2024 06:17 IST

12న కుటుంబంతో తిరుమలకు వెళ్లనున్న చంద్రబాబు

ఈనాడు-అమరావతి, తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్‌ఛార్జ్‌ ఈవో ఏవీ ధర్మారెడ్డిని ప్రభుత్వం సెలవులో పంపింది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డిని మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు సాధారణ సెలవులపై పంపిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన తిరుపతి దాటి వెళ్లేందుకు అనుమతించినా, రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని