AP Poll violence: ఎన్నికల సంఘానికి ఎందుకంత భయం?
ఎన్నికల షెడ్యూలు వచ్చాక ఎన్నికల సంఘానికి అసాధారణ అధికారాలుంటాయి. రాష్ట్ర యంత్రాంగాన్ని తమ పరిధిలోకి తీసుకుని నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించడం దాని విధి.
వైకాపా అరాచకాలు, దుశ్చర్యలపై కఠినంగా వ్యవహరించని ఈసీ
ఈవీఎం ధ్వంసంపై కేసు నమోదులో ఉద్దేశపూర్వక జాప్యం.. ఎమ్మెల్యే పిన్నెల్లిని కాపాడే యత్నం
సిట్ లేకుంటే.. గుర్తుతెలియని వ్యక్తులంటూ ముగించే వ్యూహమే
ఈనాడు, అమరావతి: ఎన్నికల షెడ్యూలు వచ్చాక ఎన్నికల సంఘానికి అసాధారణ అధికారాలుంటాయి. రాష్ట్ర యంత్రాంగాన్ని తమ పరిధిలోకి తీసుకుని నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించడం దాని విధి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం.. ప్రభుత్వ యంత్రాంగమే తమ పరిధిలో ఉంటుందనే విషయాన్ని విస్మరించి, తామూ వైకాపా ప్రభుత్వంలో ఒక భాగం అన్నట్లుగా పనిచేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. షెడ్యూలు వెలువడిన నాటి నుంచీ అడుగడుగునా మెతకవైఖరే. ఎన్నికల నిర్వహణలో భాగంగా తన అధికారాలను పూర్తిస్థాయిలో వినియోగించాలనే ఆలోచనే చేయడం లేదు. తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు.. తప్పనిసరి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకుంటోంది. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనే ఎన్నికల సంఘం పనితీరుకు నిలువెత్తు నిదర్శనం. మాచర్ల నియోజకవర్గంలో ఏడు చోట్ల ఈవీఎం ధ్వంసం ఘటనలు జరిగితే ఏ అధికారీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించలేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చడానికి 8 రోజులు పట్టింది.
ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియో నిజమేనా అని కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసేవరకూ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. బాధ్యులైన ఉన్నతాధికారులపైనా చర్యల్లేవు. ఇప్పటికీ ఈవీఎంల ధ్వంసం ఘటనలను తేలిగ్గా చెబుతూ, పది ఘటనల్లో పిన్నెల్లి చేసిందొకటి అన్నట్లుగా మాట్లాడుతున్నారంటేనే.. అధికారపార్టీ నేతలపై ఎన్నికల సంఘం అధికారులు ఎంత ఆపేక్ష చూపిస్తున్నారో అర్థమవుతోంది. ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందని వైకాపా వేస్తున్న ప్రశ్నలకు ఉలిక్కిపడుతున్న సీఈఓ ముకేశ్కుమార్ మీనా.. ఆ వీడియో తాము విడుదల చేయలేదంటూ సర్దిచెప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండటం శోచనీయం. అధికారపార్టీ వారిపై ఏ చర్య తీసుకుంటే ఏమవుతుందో అనే భయమే ఎన్నికల సంఘం అధికారుల్ని వెన్నాడుతున్నట్లు కనిపిస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అందుకే ప్రతి అంశంపైనా దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందించాల్సి వస్తోందని చెబుతున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఎన్నికల సంఘం ఇలాగే చేతులు కట్టుకుని కూర్చుంటే.. అధికార వైకాపా మరెన్నో అక్రమాలకు తెగబడుతుందనే ఆందోళన ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది.
సిట్ లేకుంటే బయటపడే ప్రశ్నే లేదు!
పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేసినా.. గుర్తుతెలియని వ్యక్తులు చేశారనే కేసు నమోదైంది. ఎమ్మెల్యేకు భయపడిన అక్కడి అధికారులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో వీఆర్వో ద్వారా పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. పోలింగ్ అనంతర హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్ ఏర్పాటుచేశాకే.. ఈవీఎం ధ్వంసం చేసింది ఎమ్మెల్యే పిన్నెల్లి అనే విషయం వెబ్కాస్టింగ్ పరిశీలనలో బయటపడింది. అంటే సిట్ ఏర్పాటుకాకుంటే గుర్తుతెలియని వ్యక్తులు చేశారనే కేసునే కొనసాగించేవారు. ఎమ్మెల్యే వీడియో కూడా బయటకొచ్చేది కాదు. కేసు తర్వాత కూడా ఈవీఎం ధ్వంసం వీడియో బయటపెట్టకుండా.. పోలీసులు, ఎన్నికల అధికారులు పిన్నెల్లికి జీ హుజూర్ అన్నారు.
ఈవీఎం ధ్వంసమైతే ఎవరు చేశారో ఆరా తీయలేదా?
ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగితేనే ఎవరు వారనే ప్రశ్న వస్తుంది. పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసమైనప్పుడు ఈ ఘటనకు పాల్పడిందెవరనే ప్రశ్న ఎన్నికల సంఘానికి ఎందుకు రాలేదు? అందులోనూ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ధ్వంసం చేస్తే ఎందుకు పట్టించుకోలేదు? పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసమైన సంగతి తెలిశాక.. కొత్త యూనిట్తో పోలింగ్ నిర్వహించాలని ఆదేశించినట్లు సీఈఓ మీనా చెబుతున్నారు. అప్పుడే ఈవీఎం ఎందుకు ధ్వంసమైంది, ఎవరు చేశారని ఆయన ఎందుకు ఆరాతీయలేదు? కనీసం పీఓ, ఏపీఓ నివేదికలేంటో తెలుసుకోకుండా నిర్లక్ష్యం వహించారు. వీడియో ఫుటేజిని పోలీసులకు ఇవ్వడంతోనే.. తమ పని అయిపోయిందంటూ ఆర్వో సహా ఎన్నికల సంఘం చేతులు కట్టేసుకునే ప్రయత్నం చేసిందని ప్రజాసంఘాల నేతలు పేర్కొంటున్నారు.
పీఓ, ఏపీఓ మాత్రమే బాధ్యులా?
పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి వస్తుండగా అక్కడి అధికారులంతా లేచి నిల్చుని మరీ ఆయనకు సలాం కొట్టారు. ఈవీఎం ధ్వంసంతో వారు మరింత వణికిపోయారు. భయంతో ఫిర్యాదు చేసేందుకు రాలేదు. కీలక అధికారులంతా ఎవరికి వారే ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్నట్లు వ్యవహరిస్తుంటే పీఓ, ఏపీఓ మాత్రం ఏం చేయగలరు? వారికి నైతిక ధైర్యం కల్పించి ఫిర్యాదు చేసేలా చూడాల్సిన బాధ్యతను మరిచిపోయిన ఉన్నతాధికారులు.. వారిద్దరినీ బాధ్యులను చేస్తూ చేతులు దులిపేసుకున్నారు. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిందో వెబ్కాస్టింగ్లో చూసే ఆర్ఓ శ్యామ్ప్రసాద్, జిల్లా ఎన్నికల అధికారి, సీఈఓ సహా అందరికీ కనిపిస్తుంది. ఆ క్షణంలో చూడకపోయినా.. ఈవీఎం ధ్వంసమైందని పోలింగ్ కేంద్ర సిబ్బంది నుంచి ఫిర్యాదు అందిన తర్వాతైనా చూసే ఉంటారు. మళ్లీ పోలింగ్ కొనసాగించేందుకు అనుమతించే సమయంలో అయినా తప్పనిసరిగా వెబ్కాస్టింగ్ చూసే ఉంటారు. కనీసం అప్పుడైనా ఈవీఎం ధ్వంసం చేసింది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే అని స్పష్టంగా తెలుస్తుంది. అయినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదంటే కారణమేంటి? ఆర్ఓ శ్యామ్ప్రసాద్ ఏం చేశారు? సీఈఓ మీనా ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోయారు? దీనికి బాధ్యులెవరు? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి...!
ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టిన మహిళ విజయలక్ష్మి.. శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వచ్చారు. -
పోలవరమే పెను సవాలు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఒక పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్ వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. -
అధికారం వచ్చిందని.. కక్ష సాధింపులొద్దు
‘అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు.. విర్రవీగడం లాంటి చర్యలొద్దు.. ప్రజలు తప్పు పట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దు’ అని తెదేపా నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. -
ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. -
మోసపోయాం.. మన్నించండి
వైకాపా కార్పొరేటర్లు మాతో బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఆ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తటస్థంగా ఉందామన్నా తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. -
విద్యా, వసతి దీవెన బకాయిల వివరాలివ్వండి
రాష్ట్రవ్యాప్తంగా విద్యా, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల ఖాళీల వివరాలివ్వాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. -
మాజీ ఏఏజీ పొన్నవోలుపై పోలీసులకు ఫిర్యాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని తెదేపా పరిశోధన, సమాచార కమిటీ సభ్యుడు తోపూరి గంగాధర్ మంగళగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. -
ఏయూ విద్యార్థిని ఫిర్యాదు.. వెంటనే మంత్రి స్పందన
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. -
రామోజీరావు.. ఒక విశ్వవిద్యాలయం
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఒక వ్యక్తి కాదని.. ఆయనొక విశ్వవిద్యాలయమని భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి స్మరించుకున్నారు. -
ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కసరత్తు
రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు. -
బోల్తాపడిన బోధనాసుపత్రులు
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల అభివృద్ధి పడకేసింది. వాటిల్లో మౌలిక సదుపాయాల కల్పన హామీలను పాలకులు విస్మరించారు. -
ముఖ్యమంత్రి రేపు పోలవరం సందర్శన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. -
చంద్రబాబుకు కళ్లద్దాలిచ్చి.. మురిసిపోయిన మహిళ
మిమ్మల్ని సీఎంగా చూడాలని ఐదేళ్లుగా మేం చేయని పూజలు లేవని పలువురు మహిళలు చంద్రబాబుతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. -
సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం
అనుమతులు లేకుండా అవులపల్లె ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి.. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.600 కోట్ల బిల్లులు చేసుకున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. -
సంక్షిప్త వార్తలు (4)
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీరభ్కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్కుమార్ గుప్తా శనివారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. -
ఇదీ సంగతి!
-
సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల వినతులు స్వీకరించడానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు శ్రీకారం చుట్టారు. -
కిషన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్కల్యాణ్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు బొగ్గు, గనులశాఖ ఎంతో కీలకం. -
ప్రజలకూ నాకూ మధ్య అడ్డుగోడలుండవు
ప్రజలకు, తనకు మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల నుంచి నేరుగా వినతుల స్వీకరణ, నిర్దేశిత సమయంలోగా పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. -
పౌరసరఫరాల శాఖలో భారీ దోపిడీ
రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె.. ఏది చూసినా ప్యాకెట్కు 50-100 గ్రాములు తక్కువ బరువే. -
మహిళలకు రక్షణ కల్పిస్తాం.. రాష్ట్ర హోం మంత్రి అనిత
భూకబ్జాలు, దాడులు.. మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరక్కుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?