AP Poll violence: ఎన్నికల సంఘానికి ఎందుకంత భయం?
ఎన్నికల షెడ్యూలు వచ్చాక ఎన్నికల సంఘానికి అసాధారణ అధికారాలుంటాయి. రాష్ట్ర యంత్రాంగాన్ని తమ పరిధిలోకి తీసుకుని నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించడం దాని విధి.
వైకాపా అరాచకాలు, దుశ్చర్యలపై కఠినంగా వ్యవహరించని ఈసీ
ఈవీఎం ధ్వంసంపై కేసు నమోదులో ఉద్దేశపూర్వక జాప్యం.. ఎమ్మెల్యే పిన్నెల్లిని కాపాడే యత్నం
సిట్ లేకుంటే.. గుర్తుతెలియని వ్యక్తులంటూ ముగించే వ్యూహమే
ఈనాడు, అమరావతి: ఎన్నికల షెడ్యూలు వచ్చాక ఎన్నికల సంఘానికి అసాధారణ అధికారాలుంటాయి. రాష్ట్ర యంత్రాంగాన్ని తమ పరిధిలోకి తీసుకుని నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించడం దాని విధి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం.. ప్రభుత్వ యంత్రాంగమే తమ పరిధిలో ఉంటుందనే విషయాన్ని విస్మరించి, తామూ వైకాపా ప్రభుత్వంలో ఒక భాగం అన్నట్లుగా పనిచేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. షెడ్యూలు వెలువడిన నాటి నుంచీ అడుగడుగునా మెతకవైఖరే. ఎన్నికల నిర్వహణలో భాగంగా తన అధికారాలను పూర్తిస్థాయిలో వినియోగించాలనే ఆలోచనే చేయడం లేదు. తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు.. తప్పనిసరి పరిస్థితుల్లోనే చర్యలు తీసుకుంటోంది. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనే ఎన్నికల సంఘం పనితీరుకు నిలువెత్తు నిదర్శనం. మాచర్ల నియోజకవర్గంలో ఏడు చోట్ల ఈవీఎం ధ్వంసం ఘటనలు జరిగితే ఏ అధికారీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించలేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చడానికి 8 రోజులు పట్టింది.
ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియో నిజమేనా అని కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసేవరకూ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. బాధ్యులైన ఉన్నతాధికారులపైనా చర్యల్లేవు. ఇప్పటికీ ఈవీఎంల ధ్వంసం ఘటనలను తేలిగ్గా చెబుతూ, పది ఘటనల్లో పిన్నెల్లి చేసిందొకటి అన్నట్లుగా మాట్లాడుతున్నారంటేనే.. అధికారపార్టీ నేతలపై ఎన్నికల సంఘం అధికారులు ఎంత ఆపేక్ష చూపిస్తున్నారో అర్థమవుతోంది. ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందని వైకాపా వేస్తున్న ప్రశ్నలకు ఉలిక్కిపడుతున్న సీఈఓ ముకేశ్కుమార్ మీనా.. ఆ వీడియో తాము విడుదల చేయలేదంటూ సర్దిచెప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండటం శోచనీయం. అధికారపార్టీ వారిపై ఏ చర్య తీసుకుంటే ఏమవుతుందో అనే భయమే ఎన్నికల సంఘం అధికారుల్ని వెన్నాడుతున్నట్లు కనిపిస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అందుకే ప్రతి అంశంపైనా దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందించాల్సి వస్తోందని చెబుతున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఎన్నికల సంఘం ఇలాగే చేతులు కట్టుకుని కూర్చుంటే.. అధికార వైకాపా మరెన్నో అక్రమాలకు తెగబడుతుందనే ఆందోళన ప్రతిపక్షాల్లో వ్యక్తమవుతోంది.
సిట్ లేకుంటే బయటపడే ప్రశ్నే లేదు!
పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేసినా.. గుర్తుతెలియని వ్యక్తులు చేశారనే కేసు నమోదైంది. ఎమ్మెల్యేకు భయపడిన అక్కడి అధికారులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో వీఆర్వో ద్వారా పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. పోలింగ్ అనంతర హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్ ఏర్పాటుచేశాకే.. ఈవీఎం ధ్వంసం చేసింది ఎమ్మెల్యే పిన్నెల్లి అనే విషయం వెబ్కాస్టింగ్ పరిశీలనలో బయటపడింది. అంటే సిట్ ఏర్పాటుకాకుంటే గుర్తుతెలియని వ్యక్తులు చేశారనే కేసునే కొనసాగించేవారు. ఎమ్మెల్యే వీడియో కూడా బయటకొచ్చేది కాదు. కేసు తర్వాత కూడా ఈవీఎం ధ్వంసం వీడియో బయటపెట్టకుండా.. పోలీసులు, ఎన్నికల అధికారులు పిన్నెల్లికి జీ హుజూర్ అన్నారు.
ఈవీఎం ధ్వంసమైతే ఎవరు చేశారో ఆరా తీయలేదా?
ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగితేనే ఎవరు వారనే ప్రశ్న వస్తుంది. పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసమైనప్పుడు ఈ ఘటనకు పాల్పడిందెవరనే ప్రశ్న ఎన్నికల సంఘానికి ఎందుకు రాలేదు? అందులోనూ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ధ్వంసం చేస్తే ఎందుకు పట్టించుకోలేదు? పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసమైన సంగతి తెలిశాక.. కొత్త యూనిట్తో పోలింగ్ నిర్వహించాలని ఆదేశించినట్లు సీఈఓ మీనా చెబుతున్నారు. అప్పుడే ఈవీఎం ఎందుకు ధ్వంసమైంది, ఎవరు చేశారని ఆయన ఎందుకు ఆరాతీయలేదు? కనీసం పీఓ, ఏపీఓ నివేదికలేంటో తెలుసుకోకుండా నిర్లక్ష్యం వహించారు. వీడియో ఫుటేజిని పోలీసులకు ఇవ్వడంతోనే.. తమ పని అయిపోయిందంటూ ఆర్వో సహా ఎన్నికల సంఘం చేతులు కట్టేసుకునే ప్రయత్నం చేసిందని ప్రజాసంఘాల నేతలు పేర్కొంటున్నారు.
పీఓ, ఏపీఓ మాత్రమే బాధ్యులా?
పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే పిన్నెల్లి వస్తుండగా అక్కడి అధికారులంతా లేచి నిల్చుని మరీ ఆయనకు సలాం కొట్టారు. ఈవీఎం ధ్వంసంతో వారు మరింత వణికిపోయారు. భయంతో ఫిర్యాదు చేసేందుకు రాలేదు. కీలక అధికారులంతా ఎవరికి వారే ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్నట్లు వ్యవహరిస్తుంటే పీఓ, ఏపీఓ మాత్రం ఏం చేయగలరు? వారికి నైతిక ధైర్యం కల్పించి ఫిర్యాదు చేసేలా చూడాల్సిన బాధ్యతను మరిచిపోయిన ఉన్నతాధికారులు.. వారిద్దరినీ బాధ్యులను చేస్తూ చేతులు దులిపేసుకున్నారు. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిందో వెబ్కాస్టింగ్లో చూసే ఆర్ఓ శ్యామ్ప్రసాద్, జిల్లా ఎన్నికల అధికారి, సీఈఓ సహా అందరికీ కనిపిస్తుంది. ఆ క్షణంలో చూడకపోయినా.. ఈవీఎం ధ్వంసమైందని పోలింగ్ కేంద్ర సిబ్బంది నుంచి ఫిర్యాదు అందిన తర్వాతైనా చూసే ఉంటారు. మళ్లీ పోలింగ్ కొనసాగించేందుకు అనుమతించే సమయంలో అయినా తప్పనిసరిగా వెబ్కాస్టింగ్ చూసే ఉంటారు. కనీసం అప్పుడైనా ఈవీఎం ధ్వంసం చేసింది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే అని స్పష్టంగా తెలుస్తుంది. అయినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదంటే కారణమేంటి? ఆర్ఓ శ్యామ్ప్రసాద్ ఏం చేశారు? సీఈఓ మీనా ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోయారు? దీనికి బాధ్యులెవరు? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి కోరల్లో.. తిరునగరి
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?