Pinnelli: హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయరా?
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో పోలీసులు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కారంపూడి సీఐపై దాడి చేసి గాయపరిచినా ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకుండా అసాధారణ సంయమనం ఎందుకు పాటిస్తున్నారు?
సీఐపై దాడి చేసినా చీమకుట్టినట్టు లేదా?
పోలీసులది స్వామిభక్తా.. చేవలేనితనమా?
ఈనాడు, అమరావతి: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో పోలీసులు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కారంపూడి సీఐపై దాడి చేసి గాయపరిచినా ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకుండా అసాధారణ సంయమనం ఎందుకు పాటిస్తున్నారు? ఇది పోలీసుల చేతగానితనమా లేక వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్రెడ్డితో వ్యవహరిస్తున్నట్టుగా ఎక్కడ లేని భక్తిప్రపత్తులు ప్రదర్శిస్తున్నారా? పాల్వాయిగేటు పోలింగ్స్టేషన్లో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాత్రమే పిన్నెల్లిని వచ్చే నెల 6 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు చెప్పింది. హత్యాయత్నం నేరం కింద ఐపీసీ సెక్షన్ 307 కింద ఎమ్మెల్యేను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ దాఖలైన కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేయవద్దని చెప్పలేదు. మరి అంత తీవ్ర నేరానికి సంబంధించిన కేసుల్లో పిన్నెల్లిని అరెస్ట్ చేయకుండా పోలీసుల్ని ఆపుతోంది ఎవరు? ఈవీఎం ధ్వంసం కేసులో కూడా సంబంధిత వీడియో బయటకు వచ్చి, ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేశాకే ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కదిలారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే కారును వెంబడించామని, ఆయన తప్పించుకు పారిపోయారని హైడ్రామా పండించారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఆరో తేదీ వరకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయవద్దని కోర్టు చెప్పడంతో పోలీసులు.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, రిలాక్సై పోయారా? ఈవీఎం ధ్వంసం కంటే హత్యాయత్నం తీవ్రమైన నేరమైనప్పుడు ఆయన్ను వెంటనే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎమ్మెల్యేపై సెక్షన్ 307 కింద రెండు కేసులు నమోదైనా అరెస్ట్ చేయకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
మరీ అంత ప్రభు భక్తా?
రాష్ట్రంలో డీజీపీ మారినా అధికార పార్టీ నాయకులపై పోలీసుల ప్రభుభక్తిలో ఎలాంటి మార్పూ రాలేదనడానికి పిన్నెల్లి ఉదంతమే నిదర్శనం. పోలింగ్ సందర్భంగా... రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. దానిపై రెంటచింతల పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరో 15 మందిపై సెక్షన్ 307, 147, 148, 120బీ, 324, రెడ్విత్ 149 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. రామకృష్ణారెడ్డిని ఏ-1గా పెట్టారు. పోలింగ్ మరుసటిరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అలజడి సృష్టించారు. అడ్డుకోబోయిన సీఐ నారాయణస్వామిపై దాడి చేసి, గాయపరిచారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు, మరికొందరిపై ఐపీసీ 307, 332, 143, 147, 324, 149 సెక్షన్ల కింద కింద ఈ నెల 14వ తేదీ రాత్రి కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఒక సీఐని దారుణంగా కొట్టి గాయపరిచినా కూడా ఎమ్మెల్యేను అరెస్ట్ చేయకుండా పోలీసులు మీనమేషాలు లెక్కించడం సిగ్గుచేటు!
ఇంత కంటే అరాచకం ఏముంటుంది?
‘పోలింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బూత్లోకి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే ఈవీఎం పగలగొట్టారు. నేను అడ్డుకోబోతే వేలు చూపించి బెదిరిస్తూ ఈ నా కొడుకును చంపెయ్యండ్రా అంటూ హుంకరించారు. ఎమ్మెల్యే అనుచరులు చింతా సుబ్బారావు, మరికొందరు కర్రలు, రాడ్లతో, కత్తులతో నాపై దాడిచేశారు. తీవ్రంగా గాయపడ్డ నేను అక్కడే కిందపడిపోయాను. చచ్చాడు లేరా అంటూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు వెళ్లిపోయారు. అనంతరం బంధువుల సాయంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాను’ అని నంబూరి శేషగిరిరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంత పక్కాగా ఆధారాలు, ఫిర్యాదులున్నా పోలీసులు ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ప్రజాప్రతినిధినని మర్చిపోయి ఒక రౌడీలా వ్యవహరించిన ఆయనపై పోలీసులకు ఎందుకంత మమకారం? పాల్వాయిగేటులో ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ నిలదీయగా ఆమెను తీవ్రంగా హెచ్చరిస్తూ దుర్భాషలాడారు. దీనిపై ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులా? పిన్నెల్లికి వేగులా?
పల్నాడు జిల్లాలోని పోలీసుల్లో అత్యధికులు వైకాపా నాయకులకు వేగుల్లా పనిచేస్తున్నారని ఇటీవల ఒక పోలీసు ఉన్నతాధికారి వాపోయారు. పిన్నెల్లి కోసం గాలిస్తున్న పోలీసు బృందాల్లోని కొందరు వారి కదలికల్ని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేకు చేరవేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం నుంచి పోలీసు బృందాలు బయల్దేరగానే ఆ సమాచారం పిన్నెల్లికి చేరిపోయిందని, ఈ బృందాలకు సారథ్యం వహిస్తున్న అధికారికి సభ్యులు ఏ మాత్రం సహకరించడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. పిన్నెల్లి ఈ నెల 22న హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు విమాన టిక్కెట్ కొన్నారు. ఆ విషయాన్ని పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన బృందాలకు పల్నాడు జిల్లా నుంచి ఒక పోలీసు అధికారి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఈ విషయం పిన్నెల్లికి చేరిపోవడంతో ఆయన విమానాశ్రయానికి వెళ్లలేదని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత