iPhone tariff: ఆ ఐఫోన్లకు 25% సుంకం
అమెరికాలో తయారు చేయని వాటికి వర్తింపు
ఈయూపైనా 50% టారిఫ్  
సామాజిక మాధ్యమాల్లో అమెరికా అధ్యక్షుడు పోస్టులు

అమెరికాలో ఐఫోన్ ఉత్పత్తి చేస్తే: యాపిల్ సంస్థ ఐఫోన్లను అమెరికాలోనే ఉత్పత్తి చేస్తే, ప్రస్తుతం 1200 డాలర్లుగా ఉన్న ఐఫోన్ ధర 1500-2000 డాలర్ల వరకు చేరొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టెక్ పరికరాల అగ్రగామి సంస్థ యాపిల్పై విరుచుకుపడ్డారు. అమెరికాలో ఐఫోన్లు తయారు చేయని పక్షంలో, యాపిల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తానని సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ హెచ్చరించారు. ‘యాపిల్ అధిపతి టిమ్కుక్కు నేను ఎపుడో చెప్పా. అమెరికాలో విక్రయమయ్యే ఐఫోన్లన్నీ అమెరికాలోనే తయారు కావాలి. భారత్లోనో ఇంకో దేశంలోనో కాదు. ఒక వేళ అమెరికాలో తయారీకి సిద్ధం కాకుంటే, దిగుమతి చేసుకునే ఫోన్లపై యాపిల్ కనీసం 25% సుంకం చెల్లించాల్సి ఉంటుంద’ని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాపై భారీ టారిఫ్ విధించిన నేపథ్యంలో, ఐఫోన్ తయారీని భారత్లో భారీగా చేపట్టేందుకు టిమ్కుక్ సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాలో విక్రయం కానున్న ఐఫోన్లలో మెజారిటీ భాగాన్ని భారత్లో తయారు చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల కంపెనీ వెల్లడించింది. అమెరికాలో అమ్ముడయ్యే ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్, ఎయిర్పాడ్లు వియత్నాంలో తయారు చేసినవే ఉంటాయని వివరించింది. అమెరికా వెలుపల తమ ఉత్పత్తుల మొత్తం విక్రయాల్లో, అధిక భాగం చైనాలో తయారు చేసినవే ఉంటాయనీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు.
జూన్ 1 నుంచే అమలు
ఎప్పటి నుంచో అమెరికాకు సన్నిహితంగా ఉన్న ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి, చైనాకు మించి టారిఫ్ వసూలు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. చర్చల అనంతరం చైనాపై టారిఫ్ను 30 శాతానికి సవరించిన ట్రంప్.. ఈయూతో వాణిజ్య చర్చల్లో పెద్దగా ప్రగతి కనిపించకపోవడంతో విసుగెత్తారు. అమెరికాలోకి వచ్చే చాలా వరకు దిగుమతులపై 10 శాతం ప్రాథమిక సుంకాన్ని ఉంచుతామని ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఈయూ మాత్రం టారిఫ్ను సున్నాకు తగ్గించాలని కోరుతోంది. ‘మా చర్చలు ముందుకు జరగడం లేదు. అందుకే ఈయూపై జూన్ 1 నుంచి 50% టారిఫ్ విధిస్తున్నా. అమెరికాలో తయారైన ఉత్పత్తులపై మాత్రం ఎటువంటి టారిఫ్ ఉండదు’ అని తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. - 
                                    
                                        

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 - 
                        
                            

ఎయిర్పోర్ట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్.. పారిపోతుండగా నిందితులపై కాల్పులు
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 - 
                        
                            

వడ్ల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
 


