Piyush Goyal: వినియోగదార్లకు జీఎస్టీ ప్రయోజనాలు.. పరిశ్రమకు పీయూశ్ గోయల్ సూచన

దిల్లీ: జీఎస్టీ రేట్ల మార్పు వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను వినియోగదార్లకు కచ్చితంగా బదలాయించాలని పరిశ్రమకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి మంత్రి పీయూశ్ గోయల్ సూచించారు. స్వాతంత్య్రం వచ్చాక.. అతిపెద్ద సంస్కరణ ఇదేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల దాదాపు అన్ని రంగాల్లోనూ గిరాకీ పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. గురువారమిక్కడ జరిగిన మెడ్టెక్ ఎక్స్పో, ఐఫెక్స్ 2025, భారత్ న్యూట్రావర్స్ ఎక్స్పో 2025లో ఆయన మాట్లాడారు. ‘వచ్చే రెండేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. 2047 కల్లా ప్రస్తుత 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుంచి 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుంది. జీఎస్టీ సంస్కరణలతో రైతు నుంచి ఎమ్ఎస్ఎమ్ఈల వరకు పలు రంగాలపై ప్రభావం కనిపిస్తుంది. దేశంలోని ప్రతీ వినియోగదారుకు లబ్ది చేకూరుతుంది. 140 కోట్ల మంది పౌరులకు నాణ్యమైన జీవితాన్ని ఈ దీపావళి కానుక ఇస్తుంద’న్నారు.
మేం బదిలీ చేస్తాం: దాదాపు ఎఫ్ఎమ్సీజీ కంపెనీలన్నీ వినియోగదార్లకు ప్రయోజనాన్ని బదిలీ చేస్తామని చెప్పాయి. మదర్డెయిరీ కూడా తమ అన్ని ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను బదిలీ చేస్తామని తెలిపింది. తోలు ఉత్పత్తులపై పన్ను రేటును 12% నుంచి 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో, రూ.1,000లోపు ఉత్పత్తులపై ఈ ప్రయోజనాన్ని గడువుకన్నా ముందే వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు బాటా తెలిపింది.
22 దాకా కొనుగోళ్లు ఆపాలా?: సబ్బుల నుంచి చిన్న కార్ల వరకు సుంకాలు తగ్గిన నేపథ్యంలో.. కారు కానీ టీవీ కానీ కొనాలంటే ఈ నెల 22 వరకూ ఆగాలా? అన్న అనుమానం రావొచ్చు. దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే.. ‘చట్టప్రకారం.. 22 నుంచే ఇన్వాయిస్లలో సవరించిన జీఎస్టీ రేటు కనిపిస్తుంది. ఆ తేదీ తర్వాత పంపిణీదార్ల వద్ద ఏదైనా పెండింగ్లో ఉన్నా కూడా రిటైలర్లు మాత్రం పాత రేటును ఛార్జీ చేయలేరు. అయితే వినియోగదార్లు, తగ్గిన రేట్లను పరిశీలించుకుంటే మంచిద’ని చెబుతున్నారు. 21 వరకూ ప్రస్తుత రేట్లు ఉంటాయి కాబట్టి.. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
జీఎస్టీ సాఫ్ట్వేర్ నవీకరణపై పరిశ్రమ రంగాలతో సమన్వయం: సీబీఐసీ
దిల్లీ: జీఎస్టీ రేట్లలో మార్పులను ఈ నెల 22 నుంచి అమల్లోకి తెచ్చే ప్రక్రియ సాఫీగా జరిగేందుకు, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్పై పరిశ్రమలతో సమన్వయం చేసుకోవడంపై జీఎస్టీ విభాగం దృష్టి పెట్టింది. పన్ను రేట్లు తగ్గిన వస్తువులకు సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను వినియోగించుకునే విషయంలో పరిశ్రమ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. క్లెయిమ్ చేసుకున్న క్రెడిట్ను పన్నుల చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. జీఎస్టీ విధానంలో 4 శ్లాబులకు బదులు రెండు శ్లాబులనే కొనసాగిస్తూ జీఎస్టీ మండలి 56వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ‘పన్ను రేట్లలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా 40% జీఎస్టీ రేటును ప్రవేశపెట్టారు. ఇవి అమల్లోకి తేవడానికి సుమారు రెండు వారాల సమయమే ఉంది. అయినా ఈ ప్రక్రియ సాఫీగా జరిగేలా చూసేందుకు మేం పూర్తి సన్నద్ధతతో ఉన్నామ’ని అగర్వాల్ వెల్లడించారు. పరిశ్రమ రంగాలతో ఇప్పటికే జీఎస్టీ విభాగం సంప్రదింపులు జరిపిందని, వాళ్లు కూడా తమ సాఫ్ట్వేర్లను అప్గ్రేడ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ‘జీఎస్టీ రేట్లలో మార్పులకు తగ్గట్లుగా పరిశ్రమ కూడా వాళ్ల సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే జీఎస్టీ రేట్ల కోత అమలు ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. ఎలాంటి సాంకేతిక సమస్యలూ తలెత్తవు. ఈ విషయంలో మేం పూర్తి విశ్వాసంతో ఉన్నామ’ని అగర్వాల్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. - 
                                    
                                        

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారతీయ విద్యార్థి వీసాలను భారీగా తిరస్కరించిన కెనడా
 - 
                        
                            

100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్
 - 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 - 
                        
                            

హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 


