Hyderabad: క్షిపణులు.. డ్రోన్లు.. నావిగేషన్ సిస్టమ్స్
రక్షణ ఉత్పత్తుల కంపెనీలకు జోరుగా ఆర్డర్లు
హైదరాబాద్లో విస్తరిస్తున్న పరిశ్రమలు
ఈనాడు - హైదరాబాద్

హైదరాబాద్ కేంద్రంగా రక్షణ ఉత్పత్తుల రంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ విభాగంలో ఇప్పటికే పలు కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుండగా, కొత్తగా మరిన్ని ఏర్పాటవుతున్నాయి. క్షిపణులు, డ్రోన్లు, నావిగేషన్ సిస్టమ్స్, ట్రైనింగ్ సిస్టమ్స్, విడిభాగాలను ఈ కంపెనీలు అందిస్తున్నాయి. రక్షణ ఉత్పత్తుల కోసం ఎన్నో ఏళ్లుగా ఇజ్రాయెల్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాపై ఆధారపడిన మనదేశం.. ఆయా దేశాల కంపెనీల నుంచి ఆయుధాలు, ఆయుధ సామగ్రి, యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తూ వచ్చింది. దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలు రూపొందించి, కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించిన ఫలితంగా నాలుగైదేళ్లుగా మార్పు వేగవంతమైంది. ఈ క్రమంలోనే స్థానిక కంపెనీలకు రక్షణ శాఖ, రక్షణ సంస్థల నుంచి ఆర్డర్లు లభిస్తున్నాయి.
ఈ కంపెనీలకు..: రక్షణ శాఖకు చెందిన డీఆర్డీఓ (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) విభాగాలు హైదరాబాద్లో పెద్దఎత్తున విస్తరించి ఉన్నాయి. అదనంగా బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్), మిధాని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ రంగ రక్షణ ఉత్పత్తుల సంస్థలే. ఈ సంస్థల మద్దతుతో ప్రైవేటు రంగంలో ఎన్నో సంస్థలు స్థానికంగా ఏర్పాటయ్యాయి. ఇవి నెమ్మదిగా విస్తరించి, ఇప్పుడు అభివృద్ధి పరుగు అందుకుంటున్నాయి. ఇందులో కొన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కాగా, మరికొన్ని ప్రైవేటు సంస్థలుగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇక్కడ కొలువు దీరిన జెన్ టెక్నాలజీస్, అవాంటెల్, అస్త్ర మైక్రోవేవ్, అపోలో మైక్రో సిస్టమ్స్.. తదితర కంపెనీలకూ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి. ట్రైనింగ్ సిస్టమ్స్, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ అందించే జెన్ టెక్నాలజీస్కు రక్షణ శాఖ నుంచి తాజాగా రూ.289 కోట్ల ఆర్డర్ లభించింది. డ్రోన్ టెక్నాలజీ ఆధునికీకరణకు వచ్చిన ఈ ఆర్డర్ను, ఏడాది కాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అస్త్ర మైక్రోవేవ్కు రూ.285.56 కోట్ల ఆర్డర్ లభించింది. భారత వాయుసేనలోని స్పెషల్ ఫోర్సెస్ అవసరాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ సిస్టమ్స్, విడిభాగాలను 11 నెలల వ్యవధిలో ఈ సంస్థ సరఫరా చేయాలి. అవాంటెల్ సిస్టమ్స్కు ఇటీవల పలు చిన్న, మధ్యస్థాయి ఆర్డర్లు లభించాయి. కొన్ని పెద్ద ఆర్డర్ల కోసం ఈ సంస్థ ఎదురు చూస్తున్నట్లు మార్కెట్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. స్టాక్మార్కెట్లో నమోదు కాని, చిన్న- మధ్యస్థాయి రక్షణ ఉత్పత్తుల సంస్థలు సైతం ఆకర్షణీయ ఆర్డర్లు సంపాదిస్తున్నాయి. దీనివల్ల కొత్తగా ఉద్యోగాల కల్పన సాధ్యమవుతోంది.

Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


