petrol sales: పెట్రోలు విక్రయాలకు పండగ జోష్‌

Eenadu icon
By Business News Desk Published : 03 Nov 2025 03:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అక్టోబరులో 5 నెలల గరిష్ఠానికి డీజిల్‌ విక్రయాలు స్తబ్దుగా

దిల్లీ: పండగ సమయంలో ప్రయాణాలు పెరగడంతో అక్టోబరులో పెట్రోల్‌ అమ్మకాలు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే ఇందుకు భిన్నంగా డీజిల్‌ వినియోగంలో స్తబ్దత కొనసాగిందని ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. పెట్రోలియమ్, సహజవాయువు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియమ్‌ ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌ నెలవారీ నివేదిక ప్రకారం... 

  • పెట్రోల్‌ వినియోగం గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఈ అక్టోబరులో 7 శాతం పెరిగి 36.5 లక్షల టన్నులకు పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబరులో నమోదైన 34 లక్షల టన్నులతో పోలిస్తే కూడా అక్టోబరులో పెట్రోల్‌ విక్రయాలు పెరిగాయి. 2023 అక్టోబరుతో చూసినా పెట్రోల్‌ వినియోగం 16.3 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి 7 నెలల్లో పెట్రోల్‌ వినియోగం 6.8 శాతం పెరిగి 248.40 లక్షల టన్నులకు చేరింది.
  • దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనమైన డీజిల్‌ విక్రయాలు అక్టోబరులో పెద్దగా మార్పులేకుండా 76 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. 2024 అక్టోబరులోనూ డీజిల్‌ విక్రయాలు 76.40 లక్షలు టన్నులుగా ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలం కావడంతో జూన్‌లో డీజిల్‌ వినియోగం తగ్గుతుంది. అక్టోబరు నాటికి వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ వినియోగం పుంజుకుంటుంది. పండగ సీజను కానుండటం ఇందుకు కలిసివస్తుంది. అయినప్పటికీ ఈసారి అక్టోబరులో డీజిల్‌ విక్రయాలు స్తబ్దుగా ఉండటం గమనార్హం. 2023 అక్టోబరులోని 76.3 లక్షల టన్నుల కంటే కూడా 2025 అక్టోబరులో డీజిల్‌ గిరాకీ తక్కువగా నమోదైందని నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో ఈ ఇంధన విక్రయాలు 2.45 శాతం పెరిగి 533 లక్షల టన్నులుగా ఉందని నివేదిక వివరించింది. 
  • కిందటేడాది అక్టోబరుతో పోలిస్తే విమాన ఇంధన (ఏటీఎఫ్‌) వినియోగం ఈ అక్టోబరులో 1.6 శాతం పెరిగి 7,69,900 టన్నులకు చేరింది. 2023 అక్టోబరుతో పోలిస్తే కూడా ఏటీఎఫ్‌ విక్రయాల్లో  11.11 శాతం పెరుగదల ఉంది. 
  • ఎల్‌పీజీ విక్రయాలు కూడా 5.4 శాతం పెరిగి 30 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు