PSB: 8 ప్రభుత్వ బ్యాంకులే మిగులుతాయా?

Eenadu icon
By Business News Desk Published : 26 Oct 2025 08:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) మలివిడత విలీన ప్రక్రియకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం 12 పీఎస్‌బీలు ఉన్నాయి. వీటిలో నాలుగింటిని విలీనం చేసి మొత్తం పీఎస్‌బీల సంఖ్యను ఎనిమిదికి పరిమితం చేసే యోచనలో ప్రభుత్వం ఉందని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ తెలిపింది. విలీనం చేసే బ్యాంకుల్లో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ), సెంట్రల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఉన్నట్లు పేర్కొంది. పెద్ద బ్యాంకులైన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వంటి వాటిల్లో వీటిని విలీనం చేయొచ్చని పేర్కొంటున్నారు. అయితే విలీన ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయా బ్యాంకర్లు తెలిపారు.

బ్యాలెన్స్‌ షీట్ల బలోపేతం పైనే దృష్టి: ‘ఒక బ్యాంకులో మరో బ్యాంకును విలీనం చేయాలా? వద్దా? అనేది దీర్ఘకాలిక దృక్పథంతో తీసుకునే నిర్ణయం. ఈ విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి చర్చలు జరగలేదు. ఆర్థిక శాఖ నుంచి అలాంటి ప్రతిపాదనేదీ రాలేదు. ఇప్పటివరకైతే బ్యాలెన్స్‌ షీట్లను బలోపేతం చేసుకోవడం పైనే దృష్టి సారిస్తున్నామ’ని ఒక బ్యాంకరు తెలిపారు. అయితే సెబీ నిబంధనకు అనుగుణంగా, ‘కనీస ప్రజల వాటా’ సాధించేందుకు కొన్ని బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా తగ్గించుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మరో బ్యాంకర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు