గ్రేట్‌ నికోబార్‌ ప్రాజెక్టుతో భారత సముద్ర వాణిజ్యం పరుగులు

Eenadu icon
By Business News Desk Published : 28 Oct 2025 03:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కేంద్ర మంత్రి అమిత్‌ షా

ముంబయి: 5 బిలియన్‌ డాలర్ల (రూ.44,000 కోట్ల) పెట్టుబడితో చేపట్టిన గ్రేట్‌ నికోబార్‌ ఐలాండ్‌ ప్రాజెక్టు వల్ల మన దేశ సముద్ర వాణిజ్యం పలు రెట్లు వృద్ధి చెందుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఇండియా మారిటైమ్‌ వీక్‌ 2025 ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. అండమాన్‌ నికోబార్‌ ద్వీపం రూపురేఖలు మార్చే లక్ష్యంతో 2021లో ఈ ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మాణాన్ని భారత్‌ ప్రారంభించింది. పోటీ కంటే సహకారంపై భారత్‌ విశ్వాసం ఉంచుతుందని, సముద్ర రంగంలో రూ.10 లక్షల కోట్ల విలువైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అమిత్‌ షా పేర్కొన్నారు. నౌకా నిర్మాణంలో అగ్రగామి అయిదు దేశాల్లో భారత్‌ స్థానం పొందాలని, అత్యధిక లోతు ఉండే డీప్‌ డ్రాఫ్ట్‌ పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా, అంతర్జాతీయ  కార్గో నౌకల నిర్వహణను మూడు రెట్లు పెంచి 10,000 ఎంఎంటీపీఏకు చేర్చాలన్నది లక్ష్యమని తెలిపారు. 10 బి.డాలర్ల పెట్టుబడితో ముంబయి సమీపంలో నిర్మిస్తున్న వధవాన్‌ పోర్టు, ప్రపంచ అత్యుత్తమ 10 పోర్టుల్లో ఒకటి కానుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు