ఐఓసీ లాభం రూ.7610 కోట్లు

Eenadu icon
By Business News Desk Published : 28 Oct 2025 03:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ప్రభుత్వరంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), సెప్టెంబరు త్రైమాసికంలో రూ.7,610 కోట్ల స్టాండలోన్‌ నికరలాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.180 కోట్లే కావడం గమనార్హం. నిర్వహణ సామర్థ్యాలు పెరగడం, అధిక రిఫైనింగ్‌ మార్జిన్ల వల్లే ఏడాది వ్యవధిలో నికరలాభం కొన్నిరెట్లు పెరిగిందని సంస్థ వివరించింది. బ్యారెల్‌ ముడిచమురును పెట్రోల్, డీజిల్‌ వంటి ఇంధనాలుగా మార్చడం ద్వారా సమీక్షా త్రైమాసికంలో   10.6 డాలర్లను సంస్థ ఆర్జించింది. ఏడాది క్రితం ఇది 1.59 డాలర్లే కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలోనూ 2.15 డాలర్లే. ఏడాది క్రితం సంస్థకు భారీగా ఇన్వెంటరీ నష్టాలు ఎదురవ్వగా, ఈసారి లాభాలొచ్చాయి. రష్యా చమురు విషయంలో అంతర్జాతీయ ఆంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని ఐఓసీ ఛైర్మన్‌ అరవిందర్‌ సింగ్‌ తెలిపారు. 

లాభాల్లోకి సీపీసీఎల్‌: ఐఓసీ అనుబంధ సంస్థ అయిన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ (సీపీసీఎల్‌), సెప్టెంబరు త్రైమాసికంలో రూ.719.19 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.633.69 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. రిఫైనింగ్‌ మార్జిన్‌ భారీగా పెరిగి 9.51 డాలర్లకు చేరడమే ఇందుకు కారణమని పేర్కొంది. సంస్థ టర్నోవర్‌ కూడా రూ.14,429 కోట్ల నుంచి రూ.20,040 కోట్లకు పెరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు