చైనాలో రోజుకో కుబేరుడి అవతరణ

Eenadu icon
By Business News Desk Published : 29 Oct 2025 02:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

1,434 మంది సంపన్నుల విలువ 30 లక్షల కోట్ల యువాన్‌లు

గతేడాది కాలంగా చైనాలో కుబేరుల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. స్టాక్‌ మార్కెట్లలో బలమైన ర్యాలీ ఇందుకు ఉపకరించిందని హురున్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెలువరచిన ‘హురున్‌ చైనా రిచ్‌ లిస్ట్‌’ చెబుతోంది. దీని ప్రకారం..

  • కనీసం 5 బిలియన్‌ యువాన్‌ (702 మి. డాలర్లు) సంపద గల వ్యక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 1,434కు చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 31% అధికం. అంటే ఏడాది కాలంలో దాదాపు రోజుకో కుబేరుడు అవతరించారన్నమాట. వీరి మొత్తం సంపద 2023తో పోలిస్తే 42% వృద్ధితో 30 లక్షల కోట్ల యువాన్‌లకు చేరింది. 
  • టెక్నాలజీ, ఈవీ, బయోటెక్నాలజీ వంటి ‘కొత్త ఆర్థిక వ్యవస్థ’ రంగాల్లోని వ్యాపారవేత్తల వల్లే ఇది సాధ్యమైంది.
  • నోంగ్‌ఫు స్ప్రింగ్‌ వ్యవస్థాపకుడు జాంగ్‌ షాన్షాన్‌ 2025లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సంపద 56% పెరిగి 530 బి.యువాన్‌లకు చేరడం ఇందుకు నేపథ్యం. 71 ఏళ్ల నోంగ్‌ఫు నాలుగు సార్లు ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు.
  • బైట్‌డాన్స్‌ (టిక్‌టాక్‌ మాతృసంస్థ) వ్యవస్థాపకుడు ఝాంగ్‌ ఇమింగ్‌ 470 బి.యువాన్‌ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. ః 100 బిలియన్‌ యువాన్‌ల సంపదను అధిగమించిన వ్యక్తుల సంఖ్య 41గా ఉంది. గతేడాదితో పోలిస్తే వీరు 59% పెరిగారు. 
  • 1 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారు 36% పెరిగి 1,021 మందికి చేరారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు