ప్రపంచానికి ‘లైట్‌హౌస్‌’లా భారత్‌

Eenadu icon
By Business News Desk Updated : 30 Oct 2025 05:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ దారిచూపుతోంది
స్వయంప్రతిపత్తి, వృద్ధికి చిహ్నంగా మారింది
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ముంబయి: ప్రపంచానికి దారిచూపేందుకు భారత్‌ ఒక ‘స్థిరమైన లైట్‌హౌస్‌’లా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు, వాణిజ్య అవాంతరాలు, సరఫరా వ్యవస్థల్లో మార్పులు వచ్చినా భారత్‌ స్థిరంగా నిలబడగలిగిందన్నారు. ముంబయిలో జరిగిన ‘ఇండియా మారిటైమ్‌ వీక్‌ 2025’లో ‘మారిటైమ్‌ లీడర్స్‌ కాంక్లేవ్‌’ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, శాంతి, వృద్ధికి చిహ్నంగా భారత్‌ మారింది. ఉజ్వల ప్రజాస్వామ్యం, విశ్వసనీయత కలిసి భారత్‌ను ప్రత్యేకంగా నిలిపాయి. అంతర్జాతీయంగా అనిశ్చితులు కనిపించినపుడు, ఒక స్థిరమైన లైట్‌హౌస్‌ కోసం ప్రపంచం ఎదురుచూసింది. దేశ సముద్రవాణిజ్యం భారత వాణిజ్య దృక్పథంలో భాగమే. భవిష్యత్తులో భారత్‌-పశ్చిమాసియా-ఐరోపా ఎకనామిక్‌ కారిడార్‌ వాణిజ్య మార్గాలకు పునర్‌ నిర్వచించగలుతుంది. భారత మారిటైమ్‌ రంగం గొప్ప వేగంతో ముందుకెళుతోంది. భారత పోర్టులకు ఇపుడు ప్రపంచంలో అత్యంత సమర్థమైనవన్న పేరు వచ్చింద’ని పేర్కొన్నారు. ‘శతాబ్దం నాటి పాత చట్టాల స్థానంలో ఆధునిక, భవిష్యత్‌ తరానికి ఉపయోగపడే చట్టాలను మేం తీసుకొచ్చామని మోదీ వివరించారు. భారత ప్రధాన పోర్టుల సామర్థ్యం రెట్టింపయిందనీ అన్నారు. క్రూయిజ్‌ పర్యాటకం, ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్, కార్గో.. ఇలా అన్నిటా వృద్ధి కనిపిస్తోందని తెలిపారు.

Tags :
Published : 30 Oct 2025 02:51 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు