ద్రవ్యలోటు రూ.5,73,123 కోట్లకు ఆర్థిక సంవత్సర లక్ష్యంలో 36.5%

Eenadu icon
By Business News Desk Published : 01 Nov 2025 01:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: కేంద్ర ద్రవ్యలోటు ఏప్రిల్‌-సెప్టెంబరులో రూ.5.7 లక్షల కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సర (2025-26) లక్ష్యమైన రూ.15.69 లక్షల కోట్లలో 36.5 శాతానికి చేరిందని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బడ్జెట్‌ అంచనాల్లో(బీఈ) 29 శాతంగా ద్రవ్యలోటు నమోదైంది. ప్రభుత్వ వ్యయాలు, ఆదాయం మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 4.4 శాతానికి ద్రవ్యలోటు చేరొచ్చన్నది కేంద్రం అంచనా.

మూలధన వ్యయాల్లో 40% పెరుగుదల కారణంగా కేంద్ర ద్రవ్యలోటు రూ.5.7 లక్షల కోట్లుగా నమోదవడాన్ని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్‌ స్వాగతించారు. ప్రభుత్వ అంచనా అయిన జీడీపీలో 4.4% లక్ష్యానికి ఇబ్బంది కలుగుతుందని భావించడం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు