27 విమానాల్లో ప్రీమియం ఎకానమీ సీట్లు: ఎయిరిండియా

Eenadu icon
By Business News Desk Published : 01 Nov 2025 01:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: 27 లెగసీ ఏ320 నియో విమానాల రెట్రోఫిట్‌ (నవీకరణ) పూర్లయినట్లు ఎయిరిండియా శుక్రవారం వెల్లడించింది. వీటిలో ప్రీమియం ఎకానమీ క్లాస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. ఈ విమానాల రెట్రోఫిట్‌ కార్యక్రమం 2024 సెప్టెంబరులో ప్రారంభమైంది. మొత్తం విమానాలను ఆధునికీకరించడం కోసం కంపెనీ 400 మి.డాలర్లతో చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఎయిరిండియాకు 190 విమానాలు ఉన్నాయి. ఇందులో లెగసీ బోయింగ్‌ 787, 777లతో పాటు కొత్త ఏ350 విమానాలున్నాయి. రెట్రోఫిట్‌ చేసిన విమానాలతో పాటు ఇతర నేరో బాడీ విమానాలు- 13 ఏ320 సీఈఓలు, 4 ఏ321 సీఈఓలు, 6 ఏ319 విమానాలను ఎయిరిండియా కలిగి ఉంది. కొత్తగా 14 ఏ320 విమానాలను సంస్థ లీజుకు తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని