సంక్షిప్తవార్తలు (5)
కోల్ ఇండియా సీఎండీగా సనోజ్ కుమార్ ఝా

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝా బాధ్యతలు స్వీకరించారు. శనివారం నుంచి మూడు నెలల పాటు లేదా తదుపరి సీఎండీ నియామకం జరిగే వరకు లేదా తదుపరి ఆదేశాల వరకు ఆయన ఈ అదనపు బాధ్యతలు చూస్తారు. కోల్ ఇండియా సీఎండీ స్థానంలోని పీఎమ్ ప్రసాద్ పదవీ విరమణ చేయడంతో, శనివారం ఝా ఈ పగ్గాలు చేపట్టినట్లు బీఎస్ఈకిచ్చిన సమాచారంలో కోల్ ఇండియా పేర్కొంది. నార్తర్న్ కోల్ఫీల్డ్స్ ప్రస్తుత సీఎండీ బి.సాయిరామ్ను కోల్ ఇండియా ఛైర్మన్ పదవికి సెప్టెంబరులో పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలెక్షన్ బోర్డ్(పీఈఎస్బీ) సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.
రూ.5,817 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇంకా విపణిలోనే: ఆర్బీఐ
ముంబయి: రూ.5,817 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఇంకా విపణిలోనే ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. 2023 మే 19న వీటిని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించే నాటికి మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వినియోగంలో ఉండేవి. అందులో ఇప్పటివరకు 98.37% నోట్లు ఆర్బీఐకి తిరిగి వచ్చాయి. రూ.2,000 నోట్లను తమ ఖాతాలో జమ చేసుకునేందుకు హైదరాబాద్ సహా 19 ప్రాంతాల్లోని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాలకు ఈ నగదును తపాలా కార్యాలయాల ద్వారాకూడా పంపొచ్చు.
ఆజాద్ ఇంజినీరింగ్ లాభం రూ.32 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆజాద్ ఇంజినీరింగ్ రూ.157.8 కోట్ల ఆదాయాన్ని, రూ.32.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.113 కోట్లు, నికర లాభం రూ.20.8 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబరులో రూ.303.6 కోట్ల ఆదాయాన్ని, రూ.62.04 కోట్ల నికర లాభాన్ని సంస్థ నమోదు చేసింది.
ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజీలోకి ఎస్బీఐ
దిల్లీ: ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్(ఐఐబీఎక్స్)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చేరింది. ప్రత్యేక విభాగ క్లయింటు(ఎస్సీసీ)గా తొలి ట్రేడింగ్ను శనివారం చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఐఐబీఎక్స్ ద్వారా పసిడిని దిగుమతి చేసుకునే ఆభరణదార్లు, బులియన్ డీలర్లు, ఇతర వర్గాలకు ఉపకరించేలా సరళతర బులియన్ లావాదేవీలను ఒక ప్రత్యేక విభాగ క్లయింటుగా ఎస్బీఐ జరుపుతుంది. ఆర్థిక సేవల్లో దిగ్గజంగానే కాకుండా, బులియన్ దిగుమతుల గతిని మార్చే ప్రక్రియలోనూ ఎస్బీఐ పాలుపంచుకున్నట్లయిందని బ్యాంకు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు. పసిడి దిగుమతిదార్ల నుంచి వినియోగదార్ల వరకు ఉండే మొత్తం వ్యవస్థకు ఈ పరిణామం ప్రయోజనం కలిగిస్తుందన్నారు. ట్రేడింగ్ కమ్ క్లియరింగ్(టీసీఎమ్) మెంబర్గా మారిన తొలి బ్యాంకు కూడా ఎస్బీఐనే అని తెలిపారు.
మహీంద్రా 7 సీట్ల ఇ-ఎస్యూవీ.. ఎక్స్ఈవీ 9ఎస్
ముంబయి: మహీంద్రా గ్రూప్ 7 సీట్లు గల విద్యుత్ స్పోర్ట్స్ వినియోగ వాహనానికి (ఎస్యూవీ) ఎక్స్ఈవీ 9ఎస్ పేరు పెట్టినట్లు ప్రకటించింది. ఆధునాతన ఇంగ్లో ప్లాట్ఫామ్పై ఈ ఇ-ఎస్యూవీని రూపొందించినట్లు తెలిపింది. ఈనెల 27న బెంగళూరులో జరిగే ‘స్క్రీమ్ ఎలక్ట్రిక్’ కార్యక్రమంలో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది.

Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


