తగ్గిన వాణిజ్య సిలిండర్‌ ధర

Eenadu icon
By Business News Desk Published : 02 Nov 2025 02:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర శనివారం హైదరాబాద్‌లో రూ.1817.50 నుంచి రూ.6 తగ్గి, రూ.1811.50కి చేరింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరలో ఏ మార్పూ లేదు. 

విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరను చమురు సంస్థలు కిలో లీటరుకు రూ.777 పెంచాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో ఏటీఎఫ్‌ కిలో లీటరు ధర రూ.94,543కు చేరింది. ఏటీఎఫ్‌ ధర పెరగడం వరుసగా ఇది రెండో నెల. అక్టోబరు 1న కిలో లీటరు ధరను రూ.3,052 పెంచాయి. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో దాదాపు 40% ఇంధన వాటానే ఉంటుంది.  

ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌.. అంతర్జాతీయ ఇంధన ధరలు, డాలరుతో రూపాయి మారకపు విలువ ఆధారంగా ప్రతి నెలా ఏటీఎఫ్, ఎల్‌పీజీ ధరలను సవరిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు