హెటిరో ల్యాబ్స్‌ నక్కపల్లి యూనిట్‌పై యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరాలు

Eenadu icon
By Business News Desk Published : 02 Nov 2025 02:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఫారమ్‌- 483 జారీ 

ఈనాడు, హైదరాబాద్‌: హెటిరో ల్యాబ్స్‌కు విశాఖపట్నం సమీపంలోని నక్కపల్లి వద్ద ఉన్న యూనిట్‌పై అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. దీనిపై ఫారమ్‌-483 జారీ చేసింది. యూఎస్‌ఎఫ్‌డీఏ బృందం గత నెల 19 నుంచి 26 వరకు నక్కపల్లి యూనిట్‌ను తనిఖీ చేసింది. ప్రధానంగా నాణ్యతా ప్రమాణాల్లో లోపాలు గుర్తించింది. నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా లేవని, ఈ యూనిట్‌ వెలుపల ఉన్న అన్‌-రిజిస్టర్డ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీని వినియోగిస్తున్నట్లు ఈ బృందం దృష్టికి వచ్చింది. యూఎస్‌కు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియెంట్స్‌) ఔషధాలను సరైన పత్రాలు లేకుండా బయటకు తరలిస్తున్నట్లు ఎఫ్‌డీఏ బృందం తన తనిఖీ నివేదికలో పేర్కొంది. ఇటువంటి మరికొన్ని లోపాలను గుర్తించింది. దీనిపై హెటిరో ల్యాబ్స్‌ నిర్ణీత గడువులోపు ఎఫ్‌డీఏ బృందానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు