3 రోజుల్లోనే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌

Eenadu icon
By Business News Desk Published : 02 Nov 2025 02:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు ప్రత్యేకం

దిల్లీ: చిన్న, మధ్య స్థాయి వ్యాపారుల కోసం సరళీకృత జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని జీఎస్‌టీ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం (నవంబరు 1) నుంచే ఇది అమల్లోకి వచ్చింది. దీని ద్వారా చిన్న, తక్కువ రిస్క్‌ ఉన్న వ్యాపార సంస్థలు 3 రోజుల్లోనే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ పొందొచ్చు. 

వీరు అర్హులు: నెలకు రూ.2.5 లక్షల్లోపు అవుట్‌పుట్‌ టాక్స్‌ లయబులిటీ (సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ/యూటీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ కలిపి) ఉందని స్వీయ మదింపు పత్రాన్ని ఇచ్చే దరఖాస్తుదార్లకు ఈ పథకం వర్తిస్తుంది. జీఎస్‌టీ వ్యవస్థ సైతం డేటా అనలిటిక్స్‌ ద్వారా దీనికి ఎవరు అర్హులో గుర్తిస్తుంది. ఈ పథకం ద్వారా 96% మంది కొత్త దరఖాస్తుదార్లకు ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు