7న పైన్‌ ల్యాబ్స్‌ ఐపీఓ

Eenadu icon
By Business News Desk Published : 02 Nov 2025 02:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఫిన్‌టెక్‌ సంస్థ పైన్‌ ల్యాబ్స్‌ ఈ నెల 7న తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు రానుంది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.2,080 కోట్లను సమీకరించనుంది. మరో 8.23 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించనున్నారు. నవంబరు 11న ఇష్యూ ముగుస్తుంది. ఓఎఫ్‌ఎస్‌లో పీఎక్‌ ఎక్స్‌వీ పార్టనర్స్, లండన్‌కు చెందిన యాక్టిస్, పేపాల్, మాస్టర్‌కార్డ్‌ ఏషియా/పసిఫిక్, టెమాసెక్, ఇన్వెస్కో, మాడిసన్‌.. తదితర ప్రమోటర్లు పాల్గొననున్నారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు లోక్‌వీర్‌ కపూర్‌ కూడా తన షేర్లు అమ్మనున్నారు. 

ఈ కంపెనీ భారత్‌తో పాటు మలేషియా, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా తదితర దేశాల్లోనూ డిజిటల్‌ లావాదేవీలు, చెల్లింపు ప్రక్రియలకు సాంకేతిక మౌలిక వసతులను అందజేస్తోంది. 2024-25లో    రూ.11.42 లక్షల కోట్ల స్థూల లావాదేవీలను ఈ కంపెనీ ప్రాసెస్‌ చేసింది. 2025 జూన్‌ చివరకు 9.88 లక్షల మంది వ్యాపారులు, 716 బ్రాండ్లు, కంపెనీలు, 177 ఆర్థిక సంస్థలు ఈ కంపెనీ ప్లాట్‌ఫాంను వినియోగించారు.

ఐపీఓకు షాడోఫాక్స్‌: లాజిస్టిక్స్‌ సేవల కంపెనీ షాడోఫాక్స్‌ టెక్నాలజీస్‌ తన ఐపీఓ ద్వారా రూ.2,000 కోట్ల సమీకరించేందుకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీఓ నిధుల్లో రూ.1,000 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా, రూ.1,000 కోట్లు ప్రస్తుత వాటాదార్లు ఓఎఫ్‌ఎస్‌లో షేర్ల అమ్మకం ద్వారా లభించనున్నాయి. ఓఎఫ్‌ఎస్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ఇంటర్నెట్, ఎయిట్‌ రోడ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మారిషస్‌ 2, న్యూక్వెస్ట్‌ ఏషియా ఫండ్‌ 4(సింగపూర్‌) వంటి ప్రమోటర్లు పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని