ఓయో బోనస్‌ ఇష్యూ గడువు పొడిగింపు

Eenadu icon
By Business News Desk Published : 03 Nov 2025 03:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: బోనస్‌ ఇష్యూ కోసం దరఖాస్తుల తుది గడువును పొడిగించినట్లు ఆతిథ్య సేవల సంస్థ ఓయో వెల్లడించింది. నమోదుకాని ఈక్విటీ వాటాదార్ల కోసం గడువును నవంబరు 1 నుంచి 7వ తేదీకి పొడిగించినట్లు సంస్థ తెలిపింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో వాటాదార్ల నుంచి అభిప్రాయాలు అందాయని, పెట్టుబడిదార్లకు సరైన బోనస్‌ను ఎంచుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఓయో పేర్కొంది. దరఖాస్తు చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు, వాటాదారులు ఎన్నికల పత్రంతో పాటు క్లయింట్‌ మాస్టర్‌ లిస్ట్‌ (సీఎంఎల్‌)ను సమర్పించాల్సిన అవసరం లేదని కంపెనీ స్పష్టం చేసింది. బోనస్‌ ఇష్యూలో భాగంగా వాటాదార్లు ప్రతి 6000 ఈక్విటీ షేర్లకు ఒక ప్రిఫరెన్స్‌ షేరును పొందుతారు. సంస్థలో ప్రిఫరెన్ష్‌ షేర్లు రూపంలో మెజారిటీ వాటాలు కలిగిన సాఫ్ట్‌ బ్యాంక్‌ విజన్‌ ఫండ్, రితేశ్‌ అగర్వాల్‌ సంస్థలకు ఈ ఇష్యూలో పాల్గొనే అర్హత లేదని కంపెనీ వెల్లడించింది. 

ఐపీఓకు వచ్చేందుకు ఈ నెలలో సెబీ వద్ద ఓయో ముసాయిదా పత్రాలు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఐపీఓ కోసం కంపెనీ విలువను 7-8 బిలియన్‌ డాలర్లుగా లెక్కకట్టొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు