Jio IPO: వచ్చే ఏడాది జియో ఐపీఓ
100 కోట్ల తెరలపై జియోస్టార్!
కొత్త ఏఐ కంపెనీ ఏర్పాటు
గూగుల్, మెటాతో భాగస్వామ్యం
2026లో బ్యాటరీ గిగాఫ్యాక్టరీ 
ముకేశ్ అంబానీ ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎమ్   

దిల్లీ: అందరూ ఎదురుచూస్తున్న, భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా చెబుతున్న రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూ వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే రానుందని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. ఐపీఓ కోసం జియో అన్ని విధాలా సిద్ధమవుతోందన్నారు. ఇన్వెస్టర్లకు ఇది అత్యంత ఆకర్షణీయ అవకాశంగా ఉండగలదని శుక్రవారం జరిగిన ఆర్ఐఎల్ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు. 2027 కల్లా ఎబిటాను 2022 నాటి రూ.1.25 లక్షల కోట్ల నుంచి రెట్టింపు చేస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రూప్నకు సంబంధించిన పలు అంశాలను వాటాదార్లతో పంచుకున్నారు.
రిలయన్స్ ఇంటలిజెన్స్ వస్తోంది
మెటా, గూగుల్తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఏఐ అనుబంధ సంస్థ ‘రిలయన్స్ ఇంటలిజెన్స్’ను ఏర్పాటు చేయనున్నట్లు ముకేశ్ ప్రకటించారు. ప్రతీ ఒక్కరికీ, ప్రతీ చోటకు ఏఐని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కంపెనీ ఏఐ రెడీ డేటా సెంటర్లను గిగావాట్ పరిమాణంలో నిర్మించనుందని తెలిపారు. భారత్కు తదుపరి తరం ఏఐ మౌలిక వసతులను, ఏఐ సేవలను, ఏఐ నిపుణులను అందించడమే రిలయన్స్ ఇంటలిజెన్స్ లక్ష్యాలని స్పష్టం చేశారు.
ఆర్ఐఎల్, మెటా కలిసి రూ.855 కోట్ల ప్రాథమిక పెట్టుబడులతో ఒక ఏఐ సంయుక్త సంస్థ(70:30)ను ఏర్పాటు చేయనున్నారు. ఏఐ రెడీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి గూగుల్తోనూ ఆర్ఐఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
10 శాతం వాటా విక్రయం
50 కోట్లకు పైగా వినియోగదారులున్న జియోలో ఎంత మేర వాటా విక్రయం ఉంటుందన్నదనీ ముకేశ్ వెల్లడించనప్పటికీ 10% వాటా అమ్మవచ్చన్న వార్తలున్నాయి. ఆర్ఐఎల్కు ప్రస్తుతం జియోప్లాట్ఫామ్స్లో 66.3% వాటా ఉండగా, ఫేస్బుక్కు 10%, గూగుల్కు 7.7% వాటాలున్నాయి. జియో విలువ 136-154 బి. డాలర్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐపీఓకు వచ్చాక ప్రపంచంలోనే అతిపెద్ద ఆరో టెలికాం కంపెనీగా మారే అవకాశం ఉంది. 2019లో తొలిసారిగా జియో ఐపీఓ గురించి ముకేశ్ ప్రస్తావించారు. 2030 కల్లా 5జీ నుంచి 6జీకి వినియోగదార్లను తీసుకెళతామన్నారు.
2032 కల్లా 3 మి.టన్నుల హరిత హైడ్రోజన్
స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో కంపెనీ దూకుడుగా వ్యవహరించనుంది. 2026లో ఒక మెగా బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఏటా 40 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం నుంచి 100 జీడబ్ల్యూహెచ్కు విస్తరిస్తామని ముకేశ్ అన్నారు. వచ్చే ఏడాది చివరకు ఒక ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీ కార్యకలాపాలూ ప్రారంభమవుతాయన్నారు. సింగపూర్ పరిమణంతో పోలిస్తే మూడింతలుండే ఒక సౌర విద్యత్ ప్రాజెక్టునూ తీసుకురానున్నారు. 2032 కల్లా 3 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్ సామర్థ్యాన్ని లక్ష్యంగా కంపెనీ పెట్టుకుంది. సౌర, బ్యాటరీ స్టోరేజీ, హైడ్రోజన్.. ఇలా స్వచ్ఛ ఇంధన వ్యవస్థనంతా ఒక గొడుగు కిందకు తీసుకురానున్నట్లు ముకేశ్ తెలిపారు. జామ్ నగర్ను ‘కొత్త రిలయన్స్, సరికొత్త భారత్’కు ముఖచిత్రంగా మారుస్తామన్నారు.
అతిపెద్ద రెండో ప్లాట్ఫాం
30 కోట్ల మంది వినియోగదార్లతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా జియోహాట్స్టార్గా మారింది. మొబైల్, టీవీ, కనెక్టెడ్ డివైజెస్లలో సేవలందిస్తున్న జియోస్టార్ 100 తెరలపై కనిపిస్తోందని ఆర్ఐఎల్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
ఫుడ్పార్క్లపై రూ.40,000 కోట్లు
భారత్లోనే అతిపెద్ద రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ వచ్చే మూడేళ్లలో 20% సమ్మిళిత వృద్ధిని సాధించడంపై ధీమాగా ఉంది. ‘రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్’తో ఎఫ్ఎమ్సీజీ వ్యాపారాన్ని వచ్చే అయిదేళ్లలో ఎనిమిదింతలు చేసి రూ.లక్ష కోట్లకు చేర్చుకోవాలని భావిస్తోంది. అంతే కాకుండా.. ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్ పార్క్లను సృష్టించడం కోసం రూ.40,000 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ఆర్ఐఎల్ డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు.
- స్మార్ట్గ్లాసెస్ విభాగంలోకి జియో అడుగుపెట్టింది. ‘జియోఫ్రేమ్స్’ ద్వారా చేతులతో పనిలేకుండానే కాల్స్ చేసుకోవడం, మ్యూజిక్ ఆన్/ఆఫ్ చేసుకోవడంతో పాటు వీడియోలను రికార్డ్ చేయొచ్చు.
 - యాపిల్ సిరిలాగా ఏఐ వాయిస్ అసిస్టెంట్ రియాను అంబానీ ఆవిష్కరించారు.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. - 
                                    
                                        

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


