Stock Market: ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. తొలుత స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టిన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 190 పాయింట్ల నష్టంతో 81,599 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 73 పాయింట్ల నష్టంతో 24,873 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, ఎల్అండ్టీ, ఎంఅండ్ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 73.44 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,399 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. నాస్డాక్ 1.52 శాతం, ఎస్ అండ్ పీ 500.. 0.94 శాతం, డోజోన్స్ 0.75 శాతం లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.50 శాతం లాభంతో ట్రేడవుతుండగా.. హాంగ్సెంగ్ 0.25 శాతం, షాంఘై 0.21 శాతం, ఆస్ట్రేలియన్ ఏఎస్ఎక్స్ 0.22 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.2,539 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.5,781 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ధర ఇదే.. 30 రోజుల ఫ్రీ ట్రయల్, అపరిమిత డేటా!
Starlink Subscription Price in India: ఎలాన్ మస్క్కు (Elon musk) చెందిన స్పేస్ఎక్స్ అనుబంధ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్ లింక్ (Starlink) భారత్లో కమర్షియల్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. -

భారీగా విలువ కోల్పోయిన ఇండిగో షేర్లు
వైమానిక సేవల సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (Interglobe Aviation Ltd) షేర్లు స్టాక్ మార్కెట్లలో భారీగా పతనం అవుతున్నాయి. -

900 మంది పైలట్లు సమకూరుతారా!
దేశీయ విమాన ప్రయాణికుల విపణిలో 63% వాటా కలిగిన అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో.. పౌర విమానయాన తాజా నిబంధనల అమలులో విఫలమై, భారీ సంక్షోభాన్ని చవిచూస్తోంది. -

విద్యుత్ పంపిణీ రంగంలో ఏఐ, ఎంఎల్ యాప్లు కీలకం
వినియోగదారు-కేంద్రీకృత, తెలివైన, స్వీయ ఆప్టిమైజింగ్ పంపిణీ నెట్వర్క్లను నిర్మించడంలో కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత అప్లికేషన్లు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్లాల్ ఆదివారం వెల్లడించారు. -

రూ.9 లక్షల కోట్లకు ఎస్బీఐ గృహ రుణాలు
ఈ ఏడాది నవంబరులో తమ తనఖా (గృహ) రుణాల విలువ రూ.9 లక్షల కోట్లను అధిగమించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. -

ఒక శ్రేణిలోనే కదలికలు
దేశీయ స్టాక్ మార్కెట్ల కీలక సూచీలు ఈవారం చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 9-10 తేదీల్లో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పరపతి విధాన సమావేశ నిర్ణయాలపై మదుపర్లు దృష్టి సారిస్తారు. -

పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టులో ఈవారం అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకునే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఉండటం, ఇప్పటికే పసిడి మోతాదుకు మించి పెరగడం ఇందుకు కారణాలుగా చెప్పొచ్చు. -

యూబీఎస్లో 10,000 ఉద్యోగాల కోత!
స్విస్ బ్యాంక్ యూబీఎస్, 2027 కల్లా 9 శాతానికి సమానమైన 10,000 మంది ఉద్యోగులను తగ్గించుకోవచ్చని ఒక వార్తా సంస్థ తెలిపింది. -

వేక్ఫిట్లోకి రూ.186 కోట్ల పెట్టుబడులు
ఐపీఓకు ముందే సెకండరీ మార్కెట్ లావాదేవీల ద్వారా వేక్ఫిట్ ఇన్నోవేషన్స్లోకి రూ.186 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్టెడ్వ్యూ రూ.101 కోట్లు, వైట్ఓక్ రూ.72 కోట్లు, క్యాపిటల్ 2బి రూ.13 కోట్లు పెట్టుబడి పెట్టాయి. -

స్పేస్ఎక్స్లో వాటా విక్రయించడం లేదు
రాకెట్, శాటిలైట్ తయారీ సంస్థ స్పేస్ఎక్స్ నిధులు సమీకరించడం లేదని కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. -

బాక్సైట్ తవ్వకాలు 2026లో ప్రారంభిస్తాం
బాక్సైట్ తవ్వకాలను వచ్చే జూన్ కల్లా ప్రారంభిస్తామని నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. -

సంక్షిప్త వార్తలు (4)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 0.25% తగ్గించిన నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) రెపో అనుసంధానిత రుణ రేట్లు (ఆర్ఎల్ఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’
-

50 పైసలు చెల్లుబాటవుతుందా? నాణేలపై RBI ఏం చెప్పిందంటే?
-

ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు
-

‘ధురంధర్’ స్టెప్ వేసిన సైనా నెహ్వాల్
-

‘అఖండ 2’ ఇష్యూ క్లియర్.. విడుదల తేదీపై తమ్మారెడ్డి ఏమన్నారంటే!
-

స్టార్లింక్ సబ్స్క్రిప్షన్ ధర ఇదే.. 30 రోజుల ఫ్రీ ట్రయల్, అపరిమిత డేటా!


